Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
Yashasvi Jaiswal: ఈ ఐపీఎల్ సీజన్లో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించిన వారిలో యశస్వి జైస్వాల్ ఒకడు. తన భీకర ఫామ్తో బౌలర్లను చితక్కొట్టిన ఈ కుర్రాడు మైదానంలో ఎలా ఆలోచిస్తాడో అతడి మాటల్లోనే తెలుసుకుందాం..!
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఐపీఎల్ (IPL 2023) సీజన్లో తన భీకర ఫామ్తో రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) అందరి దృష్టినీ ఆకర్షించాడు. అత్యంత వేగవంతమైన అర్ధశతకం సాధించి రికార్డు సృష్టించాడు. మొత్తం 14 మ్యాచుల్లో 635 పరుగులు సాధించాడు. అందులో ఓ శతకం కూడా ఉంది. కోల్కతాపై 47 బంతుల్లో 98 పరుగుల వీర విధ్వంసంతో మరుపురాని ఇన్నింగ్స్ను ఆడాడు. తాజాగా టియాగో ఈవీ ఎలక్ట్రిక్ స్టార్స్ కార్యక్రమంలో పాల్గొన్న అతను తన ఆటతీరుతో పాటు తన మనుసులోని ఆలోచనలను పంచుకున్నాడు. అవేంటో అతడి మాటల్లోనే..
- దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. నిరంతరం దాని కోసమే కృషి చేస్తున్నాను. మైదానంలో ఉన్నంతసేపు ఆటను గమనిస్తూ ఉంటా. ఎలాంటి ఒత్తిడి లేకుండా షాట్లు కొట్టాలని ప్రయత్నిస్తుంటా. ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలని చూస్తాను. క్రికెట్ ఒక ఆట అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆటను ప్రేమించాలి. నేను అదే చేస్తాను.
- నేనేం చేయగలను? ఎక్కడి వరకు వెళ్లగలనని గతంలో ఎప్పుడూ ఆలోచించలేదు. ఎప్పుడూ ప్రస్తుతంపైనే దృష్టి పెడతాను. నా ఫోకస్ మొత్తం నేనిప్పుడు ఏం చేయగలననే దానిపైనే ఉంటుంది. నా ప్రయాణం ఇక్కడి వరకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నా.
- సమయం గడుస్తున్న కొద్దీ నా ఆటతీరు, ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ఆడుతున్న కొద్దీ ఆటపై పట్టు సాధించాను. ఒక్కొక్కరి బౌలింగ్లో ఒక్కోలాగా ఆడాల్సి ఉంటుంది. నా వరకు నేనెప్పుడూ దూకుడుగా ఆడాలనే చూస్తాను. నా ఆలోచన విధానం కూడా అలానే ఉంటుంది. ధైర్యంతో కూడిన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తాను. స్ట్రైక్ రేట్ ఎప్పుడూ ఎక్కువగా ఉండేలా చూసుకుంటాను.
- బౌలింగ్ వేయడాన్ని కూడా చాలా ఎంజాయ్ చేస్తా. బౌలింగ్ విషయంలో నేను ఇప్పుడు చాలా సాధన చేస్తున్నాను. బౌలింగ్ వేయాలని.. లెగ్ స్పిన్ను ఎంజాయ్ చేయాలని వేచిచూస్తున్నాను. నేనెప్పుడు నాలో ఏదైనా లోపం ఉందా? అని ఆలోచించను. నేనింకా నేర్చుకోవాల్సింది ఏముంది? అనే అంశంపైనే దృష్టి పెడతాను.
- లాంగ్ డ్రైవ్లంటే నాకు చాలా ఇష్టం. ఐపీఎల్ లాంటి సుదీర్ఘ టోర్నమెంట్లు ఆడుతున్న సమయంలో మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవడం చాలా అవసరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.