FIFA World Cup 2022: ప్రపంచ సంగ్రామం సిద్ధం.. ఎప్పుడు, ఎలా చూడాలంటే..?
టీ20 ప్రపంచకప్ జ్ఞాపకాలను మరువకముందే క్రీడాభిమానుల కోసం మరో మెగా టోర్నీ సిద్ధమైంది. ఖతార్ వేదికగా ఆదివారం నుంచి ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్ 2022 మొదలు కానుంది. తొలి మ్యాచ్ ఆతిథ్య దేశంతో ఈక్వెడార్ తలపడనుంది.
ఇంటర్నెట్ డెస్క్: మొన్నటి వరకు టీ20 ప్రపంచకప్ పోటీలను ఆస్వాదించిన క్రీడాభిమానుల కోసం ఆదివారం నుంచి మరో భారీ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. దాదాపు 32 దేశాల జట్లు పాల్గొనే ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్ 2022 ఫస్ట్ ఎడిషన్కి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఫుట్బాల్ అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఖతార్లో వాలిపోయారు. తొలి మ్యాచ్ ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్ జట్ల మధ్య రాత్రి 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమాలు మొదలవుతాయి.
* నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు ఎనిమిది స్టేడియాల్లో 64 మ్యాచ్లు జరుగుతాయి.
* మొత్తం 32 జట్లు ఎనిమిది గ్రూప్లుగా విడిపోయి తలపడతాయి.
* భారత్లో ఈ మ్యాచ్లను స్పోర్ట్స్ 18, స్పోర్ట్స్ 18 హెచ్డీ ఛానెళ్లలో చూసేందుకు అవకాశం ఉంది.
* భారత కాలమానం కొన్ని మ్యాచులు అర్ధరాత్రి 12.30 గంటలకు, మధ్యాహ్నం 3.30 గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు, రాత్రి 9.30 గంటలకు జరుగుతాయి.
* సెమీఫైనల్స్, కాంస్య పతకం కోసం జరిగే మ్యాచ్, ఫైనల్ అన్నీ అర్ధరాత్రి 12.30 గంటలకు జరుగుతాయి.
గ్రూప్ల్లోని దేశాలు
గ్రూప్ - A: ఖతార్, ఈక్వెడార్, సెనెగల్, నెదర్లాండ్స్
గ్రూప్ - B: ఇంగ్లాండ్, ఇరాన్, యూఎస్, వేల్స్
గ్రూప్ - C: అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పొలాండ్
గ్రూప్ - D: ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, టునీషియా
గ్రూప్ - E: స్పెయిన్, కోస్తారికా, జర్మనీ, జపాన్
గ్రూప్ - F: బెల్జియం, కెనడా, మొరాకో, క్రొయేషియా
గ్రూప్ - G: బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్, కామెరూన్
గ్రూప్ - H: పోర్చగల్, ఘనా, ఉరుగ్వే, దక్షిణ కొరియా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు