IND vs PAK: భారత్ - పాక్ టెస్టు సిరీస్.. ఆతిథ్యం ఇచ్చే యోచనలో ఎంసీసీ!
భారత్ (india), పాకిస్థాన్ (pakistan) జట్ల మధ్య టెస్టు సిరీస్ను నిర్వహించాలంటే కేవలం ఆయా బోర్డులే కాకుండా కేంద్ర ప్రభుత్వాల స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ - పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా సరే అభిమానులతో మైదానం కిక్కిరిసిపోతుంది. మ్యాచ్ హోరాహోరీగా సాగుతుంది.. అభిమానుల చప్పట్లు, ఈలలతో మారుమోగడం ఖాయం. టీ20 ప్రపంచకప్ టోర్నీలో మెల్బోర్న్ వేదికగా జరిగిన భారత్ - పాక్ మ్యాచ్ సూపర్హిట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 90వేల మంది ప్రత్యక్షంగా మ్యాచ్ను వీక్షించినట్లు ఐసీసీ వర్గాలు తెలిపాయి. అయితే 2007 తర్వాత ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు బంద్ అయిన సంగతి తెలిసిందే. తటస్థ వేదికల్లోనే తలపడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది.
‘‘భారత్- పాక్ జట్ల మధ్య టెస్టు సిరీస్ కోసం వేదికను సిద్ధం చేయడంలో మాకు ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే ప్రపంచకప్లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్ భారీగా ప్రేక్షకాదరణను సొంతం చేసుకొంది. టీ20 ప్రపంచ కప్లో భారత్, పాక్ మ్యాచ్ చూస్తున్నప్పుడు కలిగిన అనుభూతి ఇదివరకు ఎప్పుడూ నేను అనుభవించలేదు. ప్రతి బంతికీ అభిమానుల నుంచి వచ్చిన స్పందన అసాధారణమైనది’’
‘‘ఒకవేళ ఇరుజట్లకు మెల్బోర్న్ మైదానం ఆతిథ్యమిస్తే టెస్టు క్రికెట్కు ఇంకా ఆదరణ పెరుగుతుంది. అభిమానులతో స్టేడియం కళకళలాడుతుంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్తో చర్చించాం. బిజీ షెడ్యూల్ సవాలుగా మారుతోంది. ఇది సాధ్యపడేలా ఐసీసీపై ఆస్ట్రేలియా క్రికెట్ ఒత్తిడి చేస్తుందని భావిస్తున్నా. కొన్ని స్టేడియాలు చాలా వరకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అందుకే ప్రేక్షకులతో కిక్కిరిసిపోయే మైదానాల్లో మ్యాచ్లను చూస్తే వచ్చే కిక్కే వేరు’’ అని ఎంసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టువర్ట్ ఫాక్స్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.