విలియమ్సన్ @1.. విరాట్ కోహ్లీ @ 4
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మళ్లీ ప్రపంచ నంబర్ వన్గా అవతరించాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానం చేరుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్స్మిత్ను వెనక్కి నెట్టాడు. మరోవైపు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.......
స్టీవ్స్మిత్ను వెనక్కి నెట్టేసిన కేన్
దుబాయ్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మళ్లీ ప్రపంచ నంబర్ వన్గా అవతరించాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్స్మిత్ను వెనక్కి నెట్టాడు. మరోవైపు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో విలియమ్సన్ భారీ స్కోరు చేయలేదు. రెండో టెస్టు ఆడలేదు. దాంతో స్టీవ్స్మిత్ అతడిని వెనక్కి నెట్టి అగ్రస్థానం సాధించాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో 49, 52*తో రాణించిన కేన్ 10 రేటింగ్ పాయింట్ల అంతరంతో స్మిత్ (891 రేటింగ్)ను ఇప్పుడు రెండో స్థానానికి పరిమితం చేశాడు.
విరాట్ కోహ్లీ ఎప్పటిలాగే నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఓపెనర్ రోహిత్ శర్మ ఆరో స్థానానికి చేరుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ ఏడో ర్యాంకుకు పడిపోయాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో ఇన్నింగ్స్లో 47* పరుగులతో నిలిచిన రాస్టేలర్ 3 స్థానాలు మెరుగై 14వ ర్యాంకు సాధించాడు. డేవాన్ కాన్వే 18 స్థానాలు ఎగబాకి 42వ ర్యాంకులో ఉన్నాడు.
బౌలర్ల జాబితాలో కైల్ జేమీసన్ కెరీర్ బెస్ట్ 13వ ర్యాంకు దక్కించుకున్నాడు. ఫైనల్లో 5/31, 2/30తో అతడు తిరుగులేని గణాంకాలు నమోదు చేశాడు. 1900 నుంచి టెస్టుల్లో అతడిలాంటి సగటు మరెవ్వరికీ లేకపోవడం ప్రత్యేకం. 2/48, 3/39తో రాణించిన ట్రెంట్బౌల్ట్ 2 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకు సాధించాడు.
ఇక ఫైనల్లో 49, 15 పరుగులతో ఫర్వాలేదనిపించిన అజింక్య రహానె 3 స్థానాలు మెరుగై 13వ ర్యాంకు అందుకున్నాడు. ఆల్రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు వారం రోజుల మురిపెంగా మారింది. అతడు మళ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. బౌలర్ల జాబితాలో టాప్-10లో భారత్ నుంచి ఒకే ఒక్క బౌలర్ ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో అతడు మూడో స్థానంలో ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.