ధరణి, భూ సంబంధ సమస్యలపై కాంగ్రెస్‌ టోల్‌ ఫ్రీ నంబరు

రాష్ట్రంలో ధరణి, భూ సంబంధ సమస్యలపై కాంగ్రెస్‌ టోల్‌ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. సమస్యలు ఎదుర్కొంటున్న వారు 040 24615602, 24601254 నంబర్లకు ఫోన్‌ చేసి వివరాలు తెలియజేస్తే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం, ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య

Published : 30 Nov 2021 05:31 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ధరణి, భూ సంబంధ సమస్యలపై కాంగ్రెస్‌ టోల్‌ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. సమస్యలు ఎదుర్కొంటున్న వారు 040 24615602, 24601254 నంబర్లకు ఫోన్‌ చేసి వివరాలు తెలియజేస్తే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం, ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని పీసీసీ ఏర్పాటు చేసిన ధరణి కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహా, కన్వీనర్‌ ఎం.కోదండరెడ్డిలు తెలిపారు. ఈ కమిటీ సోమవారం గాంధీభవన్‌లో సమావేశమైంది. ధరణి పోర్టల్‌లో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలు, రైతులు పడుతున్న ఇబ్బందులు, పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని