Shreyas Iyer: మా ఓటమికి సాకులు లేవు.. ఇకపై భయంలేకుండా ఆడాలి: శ్రేయస్
దిల్లీతో తలపడిన మ్యాచ్లోనూ ఓటమిపాలవ్వడంతో కోల్కతా ఈ సీజన్లో వరుసగా ఐదో మ్యాచ్ కోల్పోయింది. దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది...
(Photo: Shreyas Iyer Instagram)
ముంబయి: దిల్లీతో తలపడిన మ్యాచ్లోనూ ఓటమిపాలవ్వడంతో కోల్కతా ఈ సీజన్లో వరుసగా ఐదో మ్యాచ్ కోల్పోయింది. దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. తమ ఓటమికి సాకులేమీ చెప్పట్లేదని తెలిపాడు. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో తెలుసుకోవాలని చెప్పాడు.
‘మేం చాలా పేలవంగా ఆరంభించాం. ఆదిలోనే వికెట్లు కోల్పోయాం. పిచ్ నెమ్మదిగా ఉన్నా మేం తగినన్ని పరుగులు చేయలేకపోయాం. మా ఓటమికి కారణాలేం లేవు. తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవాలి. మా టాప్ఆర్డర్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సరైన కాంబినేషన్ కనుగొనడానికి కష్టంగా ఉంది. ఇకపై సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. భయం వీడి దూకుడుగా ఆడాలి. ఇంకా ఐదు మ్యాచ్లు ఉన్నాయి. వాటిల్లో బాగా ఆడాలి. జట్టులో నమ్మకం కలిగించి యాజమాన్యం నమ్మకాల్ని నిలబెట్టుకోవాలి. జరిగిన దాని గురించి ఆలోచించకుండా ఇకపై గెలవడానికి కృషిచేయాలి. శక్తిమేరకు రాణించి విఫలమైనా పర్లేదు. ఉమేశ్ తొలి ఓవర్లోనే వికెట్ తీసినా 11 పరుగులిచ్చాడు. అక్కడే మ్యాచ్ టర్న్ అయింది. అయినా, ఈ సీజన్లో అతడు మాకు మంచి శుభారంభాలు అందించాడు’ అని శ్రేయస్ అభిప్రాయపడ్డాడు.
కాగా, కోల్కతా జట్టుకు ఈ సీజన్లో ఇది వరుసగా ఐదో ఓటమి. ఇంతకుముందు 2009లో బ్రెండన్ మెక్కలమ్ సారథ్యంలో ఆ జట్టు వరుసగా 9 మ్యాచ్లు కోల్పోయింది. ఇక 2019లోనూ దినేశ్ కార్తీక్ సారథ్యంలో ఆ జట్టు వరుసగా 6 ఓటములు చవిచూసింది. ఇప్పుడు శ్రేయస్ మరో మ్యాచ్ కోల్పోతే కార్తీక్ సరసన నిలిచి అనవసరపు రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434