పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు.
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. అయితే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ (జేడబ్ల్యూఎస్టీ) తాజాగా గుర్తించిన నక్షత్ర మండలం ఈ భావనకు పెద్ద సవాలే విసురుతోంది. ఎందుకని?
అంతరిక్షంలో ఇప్పటివరకూ తెలియని నక్షత్ర మండలాల ఉనికిని గుర్తించటం కొత్తేమీ కాదు. కానీ తాజాగా గుర్తించిన నక్షత్ర మండలం (జడ్ఎఫ్- యూడీఎస్-7329) సాధారణమైంది కాదు. మొత్తం విశ్వం వయసు 1,380 కోట్ల ఏళ్లు. ఇందులో తొలి 80 కోట్ల ఏళ్లలోనే జడ్ఎఫ్-యూడీఎస్-7329 ఏర్పడింది. అయినా కూడా దీనిలో మన పాలపుంతలో కన్నా ఎక్కువ సంఖ్యలో నక్షత్రాలుండటం గమనార్హం. అంటే ఇవి కృష్ణ పదార్థం లేకుండానే ఏదో ఒక రకంగా ఏర్పడ్డాయని అర్థం. నక్షత్ర మండలాల ఏర్పాటును విశ్లేషించే స్టాండర్డ్ మోడల్కిది విరుద్ధం కావటమే ఆసక్తి కలిగిస్తోంది. తొలినాళ్ల నక్షత్ర మండలాలను పట్టి ఉంచటానికి భారీ కృష్ణ పదార్థాల నిర్మాణాలు అవసరమని ఇప్పటివరకూ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ జడ్ఎఫ్-యూడీఎస్-7329 పుట్టే నాటికి విశ్వంలో అలాంటి నిర్మాణాలు ఏర్పడేంత సమయం లేదు. అయినా ఇదెలా ఏర్పడిందనేది అంతుచిక్కని ప్రశ్న.
కాంతి వేగం సాయంతో
అంతరిక్షంలోని శూన్యంలో కాంతి స్థిరమైన వేగంతో ప్రయాణిస్తుంది. అందువల్ల విశ్వం లోలోతుల్లోకి వెళ్లే కొద్దీ మరింత సుదూర కాంతిని అడ్డుకోవచ్చు. ఇలా కాలంలో వెనక్కి వెళ్లి చూడటానికి అవకాశం లభిస్తుంది. దీని ఆధారంగానే శాస్త్రవేత్తలు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సాయంతో వందల కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్లి జడ్ఎఫ్-యూడీఎస్-7329ను గుర్తించారు. దీనిలోని నక్షత్రాల నుంచి వచ్చే కాంతి చట్రాన్ని అధ్యయనం చేసి, అవి సుమారు 1300 కోట్ల ఏళ్ల క్రితం పుట్టుకొచ్చాయని తేల్చారు. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న నక్షత్ర మండలాలు ఏకీకృతం కావటానికి తోడ్పడిన మొట్టమొదటి నక్షత్ర గోళకాలు ఎప్పుడు ఏర్పడ్డాయనేది కచ్చితంగా తెలియదు. ఈ ప్రక్రియ బిగ్బ్యాంగ్ అనంతరం కొన్ని వేల కోట్ల ఏళ్ల తర్వాత నెమ్మదిగా మొదలయ్యిండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
చిత్రం కృష్ణ పదార్థం
కృష్ణ పదార్థం చిత్రమైంది. కంటికి కనిపించదు గానీ మన విశ్వం మొత్తంలో 25% వరకూ నిండి ఉండేది ఇదేనని భావిస్తుంటారు. దీని చుట్టూరా ఉండే పరివేషాలు వాయువుతో కలిసి తొలినాళ్లలో నక్షత్ర మండలాలకు బీజం వేశాయని అనుకుంటుంటారు. విశ్వం ఏర్పడిన తర్వాత 100 కోట్ల నుంచి 200 కోట్ల సంవత్సరాల తర్వాత తొలిదశ నక్షత్ర మండలాలు పరిపక్వ దశకు చేరుకున్నాయి. మొదట్లో మరుగుజ్జు నక్షత్ర మండలాలు ఏర్పడి.. అనంతరం అవి ఒకదాంతో మరోటి కలిసిపోయాయి. కానీ తాజాగా గుర్తించిన జడ్ఎఫ్- యూడీఎస్-7329 ఈ సిద్ధాంతానికి నిలవటం లేదు. కృష్ణ పదార్థం తగినంత లేకపోయినా నక్షత్ర మండలం ఏర్పడటమే కాకుండా బిగ్ బ్యాంగ్ అనంతరం అనతికాలంలోనే ఇది పుట్టుకు రావటం విచిత్రం.
అర్ధంతరంగానూ ఆగింది
తగినన్ని కృష్ణ పదార్థ నిర్మాణాలు లేకపోయినా పుట్టటం ఒక ఎత్తయితే.. ఈ నక్షత్ర మండలం హఠాత్తుగా మౌనం వహించటం మరో ఎత్తు. అంటే ఇందులో నక్షత్రాల పుట్టుక నిలిచిపోయిందన్నమాట. నక్షత్ర మండలాల పుట్టుక, పరిణామానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందని ఇది సూచిస్తోంది. విశ్వం తొలినాళ్లలోనే ఇది అంత త్వరగా ఎలా ఏర్పడిందనేదీ పెద్ద ప్రశ్నగా మిగిలింది. మిగతా విశ్వంలో నక్షత్రాలు ఇంకా పుట్టుకొస్తున్నప్పుడు అక్కడ అర్ధంతరంగా ఈ పక్రియ ఎందుకు ఆగిపోయిందనేదీ రహస్యంగానే తోస్తోంది. ఇలాంటి నక్షత్ర మండలాలు మరెక్కడైనా ఉన్నాయేమో గుర్తించటం మీదా పరిశోధకులు దృష్టి సారించారు. ఒకవేళ అలాంటివి బయటపడితే నక్షత్ర మండలాల పుట్టుక మీద ప్రస్తుతం ఉన్న సిద్ధాంతాలకు ప్రమాదం వాటిల్లినట్టే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూత్రాన్ని తాగు నీరుగా మార్చే స్పేస్సూట్
మూత్రాన్ని తాగే నీరులా మారిస్తే? ఇదేం చోద్యమనుకోకండి. మున్ముందు అంతరిక్షంలో సుదీర్ఘకాలం నడిచే వ్యోమగాములకు ఇదెంతో అవసరం. -
జింక్ సూక్ష్మక్రిములు!
వరి పండించే రైతులకు శుభవార్త. పంట పొలాల్లో జింక్ లోపాన్ని తగ్గించటానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్-బనారస్ హిందూ యూనివర్సిటీ (ఏఐఎస్-బీహెచ్యూ) పరిశోధకులు వినూత్న మార్గాన్ని కనుగొన్నారు. -
కాలేయంలో నాయక కణాలు
అవయవాల్లో కాలేయం తీరే వేరు. ఎప్పుడైనా దెబ్బతిన్నా తిరిగి తానే మరమ్మతు అవుతుంది. దీనికి కారణం కొత్త కణాలు పుట్టుకురావటమేనని ఇప్పటివరకూ భావిస్తున్నారు. -
సాలెగూడు మైక్రోఫోన్
సాలెగూళ్లంటే శాస్త్రవేత్తలకే కాదు.. ఇంజినీర్లకూ ఆసక్తే. దీని దారాలు సన్నగా ఉన్నప్పటికీ చాలా దృఢంగా ఉంటాయి. వీటి స్ఫూర్తితోనే తేలికైన, గాలి ఆడే పదార్థాలను రూపొందించి.. వాటిని విమాన భాగాల తయారీకీ వాడుకుంటున్నారు. -
మరో బొటనవేలు
బొటన వేలు గొప్పతనమేంటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇది లేకపోతే దేన్నీ గట్టిగా పట్టుకోలేం. మహా భారతంలో ఏకలవ్యుడి కథ తెలుసుగా. ద్రోణాచార్యుడు తన శిష్యుడైన అర్జునుడికి పోటీ రావొచ్చనే భావనతో ఏకలవ్యుడి -
తల కిందుల చెట్టు పుట్టుక గుట్టు రట్టు
బావోబ్యాబ్ చెట్ల ఆకర్షణే వేరు. ‘తల కిందుల చెట్లు’ అని పేరొందిన ఇవి చూడగానే ఆకర్షిస్తాయి. వేలాది ఏళ్ల పాటు జీవించే ఇవి స్థానిక సంస్కృతి, సంప్రదాయాల్లోనూ భాగమమయ్యాయి -
ఆకాశ దేశాన అద్భుత కాంతులు!
రాత్రిపూట ఆకాశం ఎలా ఉంటుంది? ఇంకెలా.. నల్లగా. నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ ఉంటాయి. చంద్రుడు ప్రకాశిస్తే తెల్లటి వెన్నెల కాస్తుంది. -
3డీ ముద్రణతో రాకెట్ ఇంజిన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనతను సాధించింది. 3డీ ముద్రణతో రూపొందించిన ద్రవ రాకెట్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించి సంచలనం సృష్టించింది. -
మాట్లాడే పరికరం!
మాటలను గుర్తించే స్పీచ్ రికగ్నిషన్ పరిజ్ఞానంలో ఐఐటీ గువహటి పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. నేరుగా స్వరపేటిక కంపన సంకేతాల నుంచి మాటలను సృష్టించే పద్ధతిని సృష్టించారు. -
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి