Baobab Tree: తల కిందుల చెట్టు పుట్టుక గుట్టు రట్టు
బావోబ్యాబ్ చెట్ల ఆకర్షణే వేరు. ‘తల కిందుల చెట్లు’ అని పేరొందిన ఇవి చూడగానే ఆకర్షిస్తాయి. వేలాది ఏళ్ల పాటు జీవించే ఇవి స్థానిక సంస్కృతి, సంప్రదాయాల్లోనూ భాగమమయ్యాయి
బావోబ్యాబ్ చెట్ల ఆకర్షణే వేరు. ‘తల కిందుల చెట్లు’ అని పేరొందిన ఇవి చూడగానే ఆకర్షిస్తాయి. వేలాది ఏళ్ల పాటు జీవించే ఇవి స్థానిక సంస్కృతి, సంప్రదాయాల్లోనూ భాగమమయ్యాయి. వీటి గురించి ఎన్నెన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ ఈ చెట్ల జన్మ స్థానం ఇప్పటికే రహస్యమే. దీనికి సంబంధించి ఇటీవల ఓ కొత్త విషయం బయటపడింది.
బావోబ్యాబ్ చెట్లు అడన్సోనియా జాతికి చెందిన వృక్షాలు. ఆఫ్రికా, అరేబియా, ఆస్ట్రేలియా, మడగాస్కర్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి ఆయా ప్రాంతాల్లో ఎలా పెరుగుతాయోనని శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా చర్చిస్తూనే వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 8 జాతుల బావోబ్యాబ్ వృక్షాలు కనిపిస్తుంటాయి. అయితే వీటి విస్తరణ అసాధారణం. ఒక జాతి వృక్షాలు ఆఫ్రికాలో కనిపిస్తే.. ఆరు జాతులు మడగాస్కర్లో విస్తరించి ఉన్నాయి. మరొక జాతి వృక్షాలేమో సుదూర ఆస్ట్రేలియాలో పెరుగుతుంటాయి. ఇవి ఆఫ్రికాలో పుట్టాయని చాలామంది పరిశోధకుల భావన. కానీ ఇటీవల నేచర్ ప్రతికలో ప్రచురితమైన అధ్యయనం విభిన్నమైన కథను వివరించింది. బావోబ్యాబ్ వృక్షాలు తొలిసారి మడగాస్కర్లో పరిణామం చెంది ఉండొచ్చని, అక్కడ రెండు భిన్న జాతులుగా మారి ఉండొచ్చని పేర్కొంది. అక్కడి నుంచి సముద్ర ప్రయాణంతో సుదూర ఖండాలకు విస్తరించాయని వివరించింది. ‘మడగాస్కర్ అద్భుతమైన సహజ ప్రయోగశాల’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన చైనాలోని వుహాన్ బొటానికల్ గార్డెన్ వృక్ష శాస్త్రవేత్త టావో వాన్ అభివర్ణిస్తున్నారు. అక్కడి ప్రత్యేకమైన భౌగోళిక చరిత్ర బావోబ్యాబ్ జాతుల వైవిధ్యానికి దోహదం చేసిందని చెబుతున్నారు. వాన్, ఆయన బృందం మొత్తం 8 జాతుల జన్యుచట్రాన్ని విశ్లేషించి, దీని ఆధారంగా అవి ఎలా పరిణామం చెందాయో పరిశీలించారు. చివరికి వీటి ఉమ్మడి పూర్వ వృక్షం మడగాస్కర్లో 2.1 కోట్ల సంవత్సరాల క్రితం పుట్టిందని తేల్చారు. ఇతర వృక్షాలతో పోటీ పడటంతో పాటు భౌగోళిక ఎత్తు, ఉష్ణోగ్రత, అవక్షేపణం, అగ్ని పర్వాతల పేలుళ్ల వంటివి అక్కడ కొత్త జాతులు పుట్టుకురావటానికి ఆస్కారం కలిగించాయి.
ఎలా విస్తరించాయి?
ఏ వృక్షమైనా విస్తరించటానికి, వాటి పుప్పొడిని వ్యాపింపజేసే జీవులు అవసరం. బావోబ్యాబ్ విషయంలో కోతిలా కనిపించే లెమ్యూర్ జంతువులు ఈ పనిని చేసి పెట్టాయి. పండ్లు తినే గబ్బిలాలు, ఆఫ్రికాలోని గాలగో జంతువులు రాత్రిపూట వీటి మకరందానికి అలవాటు పడటమూ వ్యాపికి దోహదం చేసింది. బావోబ్యాబ్ వృక్షాలు తమ పరిణామక్రమంలో పెద్ద, చక్కెర తినే జంతువులను వాడుకోవటం విచిత్రం. చెట్లు, మొక్కల విషయంలో ఇది అసాధారణమైన విషయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుమారు 1.2 కోట్ల సంవత్సరాల క్రితం రెండు మలగసే బావోబ్యాబ్ జాతులు ఆఫ్రికా, ఆస్ట్రేలియాకు చేరుకున్నాయి. అక్కడవి ప్రత్యేకంగా చెట్లుగా రూపాంతరం చెంది, ప్రస్తుతం కనిపిస్తున్న విధంగా ఎదిగాయి. హిందూ మహా సముద్రం అలల ప్రవాహం ద్వారా చెట్లు, మొక్కలతో కలిసి బావోబ్యాబ్ విత్తనాలు వ్యాపించి ఉండొచ్చని భావిస్తున్నారు. హిందూ మహా సముద్రం అల ప్రవాహాం అపసవ్యదిశలో ఆస్ట్రేలియా, దక్షిణాసియా, ఆఫ్రికా తూర్పు తీరాల మధ్య కదలటం విచిత్రం. దీని మూలంగానే బావోబ్యాబ్ విత్తనాలు సుదూర ఖండాలకు విస్తరించటం సాధ్యమైంది.
అంతరించే ప్రమాదం
రెండు మలగసే బావోబ్యాబ్ జాతులు అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నట్టు తేలటం ఆందోళనకరం. వీటిలో జన్యు వైవిధ్యం తక్కువగా ఉండటం వల్ల వాతావరణ మార్పును తట్టుకొని, దానికి అనుగుణంగా మారటం కష్టమని భావిస్తున్నారు. విస్తృతంగా వ్యాపించిన ఒక జాతితో సంపర్కం చెందటం మూలంగా మూడో జాతి మనుగడ కూడా ప్రమాదంలో పడిందంటున్నారు. వీటిని ఇప్పటికే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్టులో చేర్చారు. అంతరించే దశలో ఉన్న జాతులను ఇందులో జోడిస్తుంటారు. తాజాగా వెలువడిన జన్యు సమాచారంతో ఈ ప్రమాదం మరింత పెరిగినట్టయ్యింది. మడగాస్కర్లో గత 2,500 సంవత్సరాలుగా చాలా వృక్ష, జీవజాతులు అంతరిస్తున్నాయి. ఆరు మలగసే బావోబ్యాబ్ జాతులూ ఈ కోవలోనే ఉన్నాయి. దీనికి కారణం మనుషులే. పెద్ద లెమ్యూర్లలో కొన్ని గొరిల్లా సైజుకూ పెరుగుతాయి. ఇవి బావోబ్యాబ్ విత్తనాల వ్యాప్తికి ఎంతగానో దోహదం చేశాయని భావిస్తున్నారు. అయితే మనుషులు వేటాడటం వల్ల వీటిల్లో చాలా జాతులు సుమారు వెయ్యేళ్ల క్రితమే అంతరించటం విచారకరం. పరిణామక్రమంలో భాగంగా జీవజాతులు సహజంగా పుడుతుంటాయి, మరణిస్తుంటాయి. మనుషుల జోక్యంతో ఈ ప్రక్రియ మరింత తీవ్రమైపోయింది.
ట్రీ ఆఫ్ లైఫ్
బావోబ్యాబ్ వృక్షాలను సాహిత్యంలో ‘ద ట్రీ ఆఫ్ లైఫ్’ అని వర్ణిస్తారు. దీని బెరడు, పండ్లు 300 రకాలుగా ప్రాణం నిలవడటానికి తోడ్పడతాయి మరి. స్థానిక వైద్యం, సంప్రదాయాలు, జానపద జీవనంలోకి దీని మూలాలు చొచ్చుకెళ్లాయి. ఈ వృక్షాలు 5వేల ఏళ్ల వరకూ జీవిస్తాయని ఆఫ్రికా ఖండం అన్వేషణకు వెళ్లినవారు భావించారు. కానీ కార్బన్ డేటింగ్ ప్రక్రియతో పరీక్షించగా 3వేల ఏళ్లు జీవిస్తాయని తేలింది. భారీ కాండంతో కూడిన ఇవి 100 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. రకరకాల జీవులకు ఆవాసం కల్పిస్తాయి. ఆహారం, నీరు అందిస్తాయి. ఆఫ్రికాలో నివసించే సముదాయాలు ఈ చెట్ల చుట్టూరా తమ ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటుంటారు.
దేవతల కోపంతో తల కిందులు
బావోబ్యాబ్ కొమ్మలు పైన వేళ్ల మాదిరిగా అన్ని వైపులకూ విస్తరించినట్టు ఉంటాయి. అందుకే ఇది చూడటానికి తల కిందుల చెట్టుగా కనిపిస్తుంది. స్థానికులు దీని మీద ఆసక్తికరమైన కథనూ చెబుతుంటారు. బావోబ్యాబ్ చెట్టుకు పొగరు ఎక్కువట. అందువల్ల దేవతలు కోపం తెచ్చుకొని, వేళ్లతో పెకిలించి తల కిందులుగా భూమి మీదకు విసిరేశారట. అప్పటి నుంచీ ఈ చెట్లు తల కిందులుగా మొలవటం మొదలెట్టాయని స్థానిక సముదాయాలు కథలుగా చెప్పుకొంటాయి.
పర్యావరణానికి కీలకం
ఆఫ్రికాలోని సవానా ప్రాంత పొడి పర్యావరణ వ్యవస్థకు బావోబ్యాబ్ వృక్షాలే ఆధారం. ఇవి నేల తేమగా ఉండటానికి, పోషకాల పునర్యవస్థీకరణకు తోడ్పడతాయి. వీటి వేళ్లు బలంగా, ఎక్కువ దూరాలకు విస్తరించటం మూలంగా నేల కోతకు గురికాకుండానూ అడ్డుకుంటాయి. వీటి పూలు రాత్రిపూట పూస్తాయి. ఒక రోజులోనే రాలుతాయి. పొడి కాలంలో పోషకాలతో కూడిన పండ్లను అందిస్తాయి. ఈ పండ్లలో విటమిన్ సి దండిగా ఉంటుంది. చాలా జీవులకివి ఆహారాన్ని, కీలక పోషకాన్ని అందిస్తాయి. బావోబ్యాబ్ చెట్లు వర్షాకాలంలో నీటిని పీల్చుకొని కాండంలో నిల్వ చేసుకోవటం విశేషం. అందుకే బల్లులు, పక్షులు, కోతులు, చివరికి ఏనుగులు సైతం దీని మీద ఆధారపడుతుంటాయి. చుట్టుపక్కల నీరు కనిపించకపోతే వీటి బెరడును నములుతుంటాయి. ఆఫ్రికాలో కనిపించే బావోబ్యాబ్ చెట్ల తీరే వేరు. పరిమాణం, జీవితకాలం, పండ్లు, బెరడు విషయంలో ఇవి ప్రత్యేకం. అంతేకాదు.. బోలెడన్ని కొమ్మలు కలిసిపోతూ నిరంతరం ఎదుగుతూ వస్తాయి. బెరడు మూలంగా ఈ కొమ్మల మధ్య ఖాళీలు ఏర్పడతాయి. చివరికివి కలిసిపోయి పెద్దగా అవుతాయి.
జన జీవనంలో
బావోబ్యాబ్ పండ్ల గుజ్జును స్థానికులు తింటారు. నీటిలో నానబెట్టి పానీయంగానూ తాగుతారు. నిల్వ చేసుకొని జామ్గా ఉపయోగిస్తారు. వేయించి, పొడి చేసి కాఫీగానూ సేవిస్తారు. బెరడుతోనైతే తాళ్లు, చాపలు, బుట్టలు అల్లుతారు. కాగితం, వస్త్రాల తయారీకీ ఉపయోగిస్తారు. ఆకులను సైతం ఉడకబెట్టి, తింటారు. పూల పుప్పొడి నుంచి జిగురు తయారచేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూత్రాన్ని తాగు నీరుగా మార్చే స్పేస్సూట్
మూత్రాన్ని తాగే నీరులా మారిస్తే? ఇదేం చోద్యమనుకోకండి. మున్ముందు అంతరిక్షంలో సుదీర్ఘకాలం నడిచే వ్యోమగాములకు ఇదెంతో అవసరం. -
జింక్ సూక్ష్మక్రిములు!
వరి పండించే రైతులకు శుభవార్త. పంట పొలాల్లో జింక్ లోపాన్ని తగ్గించటానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్-బనారస్ హిందూ యూనివర్సిటీ (ఏఐఎస్-బీహెచ్యూ) పరిశోధకులు వినూత్న మార్గాన్ని కనుగొన్నారు. -
కాలేయంలో నాయక కణాలు
అవయవాల్లో కాలేయం తీరే వేరు. ఎప్పుడైనా దెబ్బతిన్నా తిరిగి తానే మరమ్మతు అవుతుంది. దీనికి కారణం కొత్త కణాలు పుట్టుకురావటమేనని ఇప్పటివరకూ భావిస్తున్నారు. -
సాలెగూడు మైక్రోఫోన్
సాలెగూళ్లంటే శాస్త్రవేత్తలకే కాదు.. ఇంజినీర్లకూ ఆసక్తే. దీని దారాలు సన్నగా ఉన్నప్పటికీ చాలా దృఢంగా ఉంటాయి. వీటి స్ఫూర్తితోనే తేలికైన, గాలి ఆడే పదార్థాలను రూపొందించి.. వాటిని విమాన భాగాల తయారీకీ వాడుకుంటున్నారు. -
మరో బొటనవేలు
బొటన వేలు గొప్పతనమేంటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇది లేకపోతే దేన్నీ గట్టిగా పట్టుకోలేం. మహా భారతంలో ఏకలవ్యుడి కథ తెలుసుగా. ద్రోణాచార్యుడు తన శిష్యుడైన అర్జునుడికి పోటీ రావొచ్చనే భావనతో ఏకలవ్యుడి -
ఆకాశ దేశాన అద్భుత కాంతులు!
రాత్రిపూట ఆకాశం ఎలా ఉంటుంది? ఇంకెలా.. నల్లగా. నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ ఉంటాయి. చంద్రుడు ప్రకాశిస్తే తెల్లటి వెన్నెల కాస్తుంది. -
3డీ ముద్రణతో రాకెట్ ఇంజిన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనతను సాధించింది. 3డీ ముద్రణతో రూపొందించిన ద్రవ రాకెట్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించి సంచలనం సృష్టించింది. -
మాట్లాడే పరికరం!
మాటలను గుర్తించే స్పీచ్ రికగ్నిషన్ పరిజ్ఞానంలో ఐఐటీ గువహటి పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. నేరుగా స్వరపేటిక కంపన సంకేతాల నుంచి మాటలను సృష్టించే పద్ధతిని సృష్టించారు. -
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి