గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది.
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. కానీ క్వాంటమ్ కంప్యూటర్లలో అతి ముఖ్యమైన క్యూబిట్ల సున్నిత స్వభావమే పెద్ద సవాలుగా నిలుస్తోంది. జపాన్ శాస్త్రవేత్తల పుణ్యమాని త్వరలోనే ఈ పరిస్థితి మారనుంది. క్యూబిట్లను గది ఉష్ణోగ్రత వద్ద స్థిరంగా ఉంచగల విధానాన్ని జపాన్లోని క్యూషూ యూనివర్సిటీ, కోబ్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించారు మరి.
మనం వాడుకునే డిజిటల్ కంప్యూటర్లు బిట్స్ (0 లేదా 1) రూపంలో సమాచారాన్ని నిల్వ చేసుకుంటాయి, విడమరుస్తాయి. కానీ క్వాంటమ్ కంప్యూటర్లు ఇందుకోసం ఎలక్ట్రాన్ లేదా ఫోటాన్ వంటి క్వాంటమ్ వ్యవస్థతో తయారైన క్యూబిట్స్ను వాడుకుంటాయి. ఇవీ 0, 1 స్థితిలోనే ఉన్నప్పటికీ ఒకే సమయంలో రెండు స్థితుల్లోనూ ఉండొచ్చు. ఇతర క్యూబిట్లతోనూ అనుసంధానమై ఉండొచ్చు. అందువల్ల అతి వేగంగా సమాచారాన్ని విశ్లేషించగలవు. మామూలు కంప్యూటర్లకు సంవత్సరాలు పట్టే పనిని క్వాంటమ్ పరిజ్ఞానాలు కేవలం కొన్ని నిమిషాల్లోనే సాధించగలవు. అందుకే శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు అంత ఆసక్తి. అయితే ఇవి చుట్టుపక్కల వాతావరణానికి తీవ్రంగా స్పందిస్తాయి. విపరీతంగా ప్రవర్తిస్తాయి. కాబట్టే అతి శీతల ఉష్ణోగ్రతల్లోనే క్యూబిట్లను ఉంచాల్సి వస్తోంది. వీటి సున్నిత స్వభావం మూలంగానే క్వాంటమ్ కంప్యూటర్లను వాణిజ్యపరంగా, విస్తృతంగా వాడుకోవటం కష్టమవుతోంది. ఇక్కడే జపాన్ పరిశోధకుల తాజా విధానం ఉత్సుకత కలిగిస్తోంది.
ఎలా పనిచేస్తుంది?
కాంతిని సంగ్రహించుకునే క్రోమోస్ఫోర్ అణువులను లోహ-కర్బన చట్రంలో అమర్చటం ద్వారా క్యూబిట్లను గది ఉష్ణోగ్రత వద్ద స్థిరంగా ఉంచటం సాధ్యమైంది. ఇది క్యూబిట్లను చుట్టుపక్కల అస్తవ్యస్త పరిస్థితులకు లోనుకాకుండా నిలువరిస్తుంది. క్రోమోస్ఫోర్ అణువులు కాంతిని సంగ్రహించి, క్యూబిట్లకు శక్తిని సరఫరా చేస్తాయి. ఇక లోహ-కర్బన చట్రమేమో చుట్టుపక్కల వాతావరణం నుంచి వాటిని వేరు చేసి, రక్షణ కవచంగా నిలుస్తుంది. దీంతో గది ఉష్ణోగ్రత వద్ద క్యూబిట్లు స్థిరంగా ఉండటానికి వీలవుతుంది. ఈ విధానం క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీలను మరింత ఆచరణీయం చేయనుంది. వాటిని విస్తృతంగా అందుబాటులోకి తేనుంది.
ఎన్నో ప్రయోజనాలు
గది ఉష్ణోగ్రత వద్ద క్యూబిట్లు స్థిరంగా ఉంటే కంప్యూటింగ్ సామర్థ్యాలు గణనీయంగా మెరుగవుతాయి. వేగమూ పుంజుకుంటుంది. ఇది మందుల ఆవిష్కరణ దగ్గరి నుంచి భూ వాతావరణాన్ని కంప్యూటర్ మీద సిమ్యులేట్ చేయటం, కృత్రిమ మేధ పరిజ్ఞానాల వరకూ రకరకాల రంగాల్లో ఉపయోగపడుతుంది. మొత్తమ్మీద వినూత్న టెక్నాలజీల ఆవిష్కరణ, పురోగతిలో కొత్త యుగానికి దారితీయగలదని చెప్పుకోవచ్చు. దీంతో క్వాంటమ్ కంప్యూటింగ్ ఉజ్వల భవిష్యత్తు త్వరలోనే సాకారమయ్యేలా కనిపిస్తోంది.
ఏంటీ క్రోమోస్ఫోర్?
క్రోమ్స్ఫోర్లు కాంతిని శోషించుకుంటాయి. అదే సమయంలో మిగిలిన కాంతిని ప్రతిఫలింప జేస్తాయి. ఇలా వస్తువులు రంగురంగుల్లో శోభిల్లేలా చేస్తాయి. ప్రకృతిలో మనకు కనిపించే రంగులన్నింటికీ ఇవే మూలం. పువ్వుల్లోని వర్ణద్రవ్యాలు, దుస్తుల్లో రంగులు.. అన్నింటికీ ఇవే కారణం. రంగులు, ప్లాస్టిక్స్, వస్త్రాల తయారీ వంటి పలు పరిశ్రమల్లోనూ వీటిని వాడుకుంటారు. కాంతిని సంగ్రహించటం, ప్రతిఫలింప జేయటం వల్ల రకరకాల టెక్నాలజీల్లో క్రోమోస్ఫోర్లు అత్యవసర భాగాలుగానూ ఉపయోగపడుతున్నాయి. సోలార్ సెల్స్, డిస్ప్లే స్క్రీన్లు, సెన్సర్లు, లేజర్ల వంటి వాటి తయారీకి తోడ్పడుతున్నాయి. క్రోమోస్ఫోర్ల ప్రవర్తనను అర్థం చేసుకోవటం పదార్థ విజ్ఞానం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం, వైద్యం వంటి అధునాతన రంగాలకు చాలా కీలకం. ఇది పునరుత్పాదక ఇంధనం, పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త విధానాల తయారీకి దోహదం చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూత్రాన్ని తాగు నీరుగా మార్చే స్పేస్సూట్
మూత్రాన్ని తాగే నీరులా మారిస్తే? ఇదేం చోద్యమనుకోకండి. మున్ముందు అంతరిక్షంలో సుదీర్ఘకాలం నడిచే వ్యోమగాములకు ఇదెంతో అవసరం. -
జింక్ సూక్ష్మక్రిములు!
వరి పండించే రైతులకు శుభవార్త. పంట పొలాల్లో జింక్ లోపాన్ని తగ్గించటానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్-బనారస్ హిందూ యూనివర్సిటీ (ఏఐఎస్-బీహెచ్యూ) పరిశోధకులు వినూత్న మార్గాన్ని కనుగొన్నారు. -
కాలేయంలో నాయక కణాలు
అవయవాల్లో కాలేయం తీరే వేరు. ఎప్పుడైనా దెబ్బతిన్నా తిరిగి తానే మరమ్మతు అవుతుంది. దీనికి కారణం కొత్త కణాలు పుట్టుకురావటమేనని ఇప్పటివరకూ భావిస్తున్నారు. -
సాలెగూడు మైక్రోఫోన్
సాలెగూళ్లంటే శాస్త్రవేత్తలకే కాదు.. ఇంజినీర్లకూ ఆసక్తే. దీని దారాలు సన్నగా ఉన్నప్పటికీ చాలా దృఢంగా ఉంటాయి. వీటి స్ఫూర్తితోనే తేలికైన, గాలి ఆడే పదార్థాలను రూపొందించి.. వాటిని విమాన భాగాల తయారీకీ వాడుకుంటున్నారు. -
మరో బొటనవేలు
బొటన వేలు గొప్పతనమేంటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇది లేకపోతే దేన్నీ గట్టిగా పట్టుకోలేం. మహా భారతంలో ఏకలవ్యుడి కథ తెలుసుగా. ద్రోణాచార్యుడు తన శిష్యుడైన అర్జునుడికి పోటీ రావొచ్చనే భావనతో ఏకలవ్యుడి -
తల కిందుల చెట్టు పుట్టుక గుట్టు రట్టు
బావోబ్యాబ్ చెట్ల ఆకర్షణే వేరు. ‘తల కిందుల చెట్లు’ అని పేరొందిన ఇవి చూడగానే ఆకర్షిస్తాయి. వేలాది ఏళ్ల పాటు జీవించే ఇవి స్థానిక సంస్కృతి, సంప్రదాయాల్లోనూ భాగమమయ్యాయి -
ఆకాశ దేశాన అద్భుత కాంతులు!
రాత్రిపూట ఆకాశం ఎలా ఉంటుంది? ఇంకెలా.. నల్లగా. నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ ఉంటాయి. చంద్రుడు ప్రకాశిస్తే తెల్లటి వెన్నెల కాస్తుంది. -
3డీ ముద్రణతో రాకెట్ ఇంజిన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనతను సాధించింది. 3డీ ముద్రణతో రూపొందించిన ద్రవ రాకెట్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించి సంచలనం సృష్టించింది. -
మాట్లాడే పరికరం!
మాటలను గుర్తించే స్పీచ్ రికగ్నిషన్ పరిజ్ఞానంలో ఐఐటీ గువహటి పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. నేరుగా స్వరపేటిక కంపన సంకేతాల నుంచి మాటలను సృష్టించే పద్ధతిని సృష్టించారు. -
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి