నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు.
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది నాచు (ఆల్గే) కణంలో భాగంగా (ఆర్గనెల్) మారటమే కాకుండా.. నత్రజనిని ఉపయోగపడే విధంగా మారుస్తున్నట్టూ తేలింది. ఒక జీవి కణభాగం ఇలాంటి పని చేస్తున్నట్టు బయటపడటం ఇదే తొలిసారి. వాతావరణంలోని నత్రజనిని గ్రహించి, దాన్ని తమకు తామే ఉపయోగపడేలా మార్చుకునే విధంగా మొక్కలను రూపొందించటానికిది తోడ్పడగలదని ఆశిస్తున్నారు. అంటే తక్కువ ఎరువుతోనే ఎక్కువ దిగుబడి అందించే పంటల సాగుకు దారితీయగలదన్నమాట.
వాతావరణంలో బోలెడంత నత్రజని ఉంటుంది. దీన్ని బ్యాక్టీరియా, ఆర్కాయియా వంటివి అమ్మోనియా, నైట్రేట్ల రూపాల్లోకి మారుస్తాయి. వీటిని మొక్కలు, సూక్ష్మక్రిములు వాడుకుంటాయి. అయితే ఆల్గేలోని ఒక కణభాగం కూడా ఇలాంటి పని చేస్తున్నట్టు బయటపడటం విశేషం. అందుకే దీన్ని నైట్రోప్లాస్ట్ అని పిలుచుకుంటున్నారు. సముద్రంలోని బ్రారుడోస్ఫేరియా బిగెలోవీ అనే ఆల్గే తన కణాల లోపల, మీద నివసించే యూసీన్-ఏ బ్యాక్టీరియాతో చర్య జరుపుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన జనాథన్ జెహ్ర్ గతంలోనే గుర్తించారు. యూసీన్-ఏ బ్యాక్టీరియానే నత్రజనిని అమ్మోనియా వంటి రసాయన మిశ్రమాలుగా మార్చి ఆల్గే ఎదగటానికి దోహదం చేస్తోందని ఆయన ఊహించారు. బ్యాక్టీరియా దీనికి బదులుగా ఆల్గే నుంచి కర్బన ఆధారిత శక్తిని పొందుతుండొచ్చని భావించారు. అయితే తాజా అధ్యయనంలో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. యూసీన్-ఏ అనేది ప్రత్యేక ప్రాణి కాదని, అది ఆల్గేలో అభిన్న అంశమని తేలింది. వీటి జన్యువులను విశ్లేషించగా.. ఆల్గే, బ్యాక్టీరియా రెండూ సుమారు 10కోట్ల సంవత్సరాల క్రితం పరస్పర సహకార బంధం ఏర్పరచుకున్నట్టు, ఇదే క్రమంగా నైట్రోప్లాస్ట్ ఏర్పడటానికి పురికొల్పినట్టు బయటపడింది.
రెండూ వేర్వేరని ఎలా గుర్తించారు?
ఒక బ్యాక్టీరియా తనకు ఆతిథ్యమిచ్చిన ప్రాణిలో కణభాగంగా మారటం విచిత్రమే. దీన్ని ఎలా నిర్ణయిస్తారన్నదీ ఆసక్తికరమైన విషయమే. ఇందుకు శాస్త్రవేత్తలు రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకటి- ఆ కణ నిర్మాణం తరతరాలుగా జీవికి సంక్రమిస్తూ రావటం. రెండు- జీవి అందించే ప్రొటీన్ల మీద ఆధారపడటం. అందుకే శాస్త్రవేత్తలు ఆల్గే కణ విభజనను వివిధ దశల్లో సునిశితంగా పరిశీలించారు. మొత్తం ఆల్గే కణం విభజన చెందుతున్నప్పుడు నైట్రోప్లాస్ట్ రెండుగా విడిపోతున్నట్టు గుర్తించారు. ఇలా ఇతర కణ నిర్మాణాల మాదిరిగానే ఒక్కో నైట్రోప్లాస్ట్ తల్లి కణం నుంచి పిల్ల కణానికి సంక్రమిస్తుందన్నమాట. అలాగే ఇవి ఎదగటానికి అవసరమైన ప్రొటీన్లను పెద్ద ఆల్గే కణం నుంచి పొందుతున్నట్టూ తేలింది. ఆల్గే కణంలో ఈ నైట్రోప్లాస్ట్ 8% ఆక్రమించినప్పటికీ కిరణజన్య సంయోగక్రియ, జన్యు పదార్థానికి అవసరమైన ప్రొటీన్లు ఇందులో లేనే లేవు. వీటిని నైట్రోప్లాస్ట్లు ఆల్గే పెద్ద కణం నుంచే పొందుతున్నాయి. వాటి జీవక్రియకు తోడ్పడుతున్నాయి.
ఏంటీ ప్రయోజనం?
ఆతిథ్య ప్రాణి కణంతో నైట్రోప్లాస్ట్ ఎలా చర్య జరుపుతోందనేది అర్థం చేసుకుంటే తమ నత్రజని అవసరాలను తామే తీర్చుకునేలా మొక్కలను రూపొందించొచ్చు. నత్రజని ఆధారిత ఎరువుల వాడకాన్ని తగ్గించొచ్చు. పర్యావరణానికి జరిగే హానిని కొంతవరకైనా నివారించొచ్చు. ఇదే శాస్త్రవేత్తలను బాగా ఆకట్టుకుంటోంది. పంటల దిగుబడి చాలావరకూ నత్రజని అందుబాటులో ఉండటం మీదే ఆధారపడి ఉంటుంది. మొక్కలు తమకు తామే వాతావరణంలోని నత్రజనిని సంగ్రహించి, దాన్ని తమకు అవసరమైన విధంగా మార్చుకోవటమనే ఊహే అద్భుతంగా ఉంటుంది. అది కార్యరూపం ధరిస్తే నిజంగా గొప్ప మార్పులే సంభవిస్తాయి. అయితే ఇదంత తేలికైన పనేమీ కాదనుకోండి. నైట్రోప్లాస్ట్కు అవసరమైన జన్యు సమాచారాన్ని వృక్ష కణాలు తరతరాలకూ స్థిరంగా సంక్రమించేలా మొక్కల జన్యువులను మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టమైన పని. అలాగని అసాధ్యమేమీ కాకపోవచ్చు. ఏదేమైనా మొక్కలు తమ ఎదుగుదలకు తామే ఎరువులను సృష్టించుకోవటానికి తోడ్పడగల విధానాన్ని అర్థం చేసుకోవటంలో తాజా అధ్యయనంతో గొప్ప ముందడుగైతే పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి. -
బొగ్గు దాణా!
బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్