పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే. వ్యాధికారక క్రిముల డీఎన్ఏ లేదా ఆర్ఎన్ఏలను గుర్తించటం ద్వారా ఇన్ఫెక్షన్ జబ్బులను త్వరగా, కచ్చితంగా నిర్ధరించటానికిది తోడ్పడుతుంది. ఇంతకీ పీసీఆర్ ఆవిష్కరణకు బీజమేంటో తెలుసా? ఒక శాస్త్రవేత్త వేసవి సెలవుల సరదా పర్యటన.
అన్ని అతిగొప్ప శాస్త్ర ఆవిష్కరణల మాదిరిగానే పీసీఆర్ సైతం ప్రశ్నతోనే మొదలైంది. అది 1964. ఇండియానా యూనివర్సిటీకి చెందిన మైక్రోబయాలజిస్ట్ టామ్ బ్రాక్ సరదాగా సెలవుల్లో పర్యటనకు బయలుదేరారు. దారిలో ఎల్లోస్టోన్ నేషనల్ పార్కు వద్ద ఆగారు. అది వేడి నీటిబుగ్గలకు ప్రసిద్ధి. అక్కడ రంగులను చూసి ముచ్చటపడ్డారు. నిజానికి ఆ రంగులన్నీ సూక్ష్మక్రిములు. వేడి నీటి బుగ్గల్లోంచి పైకి ఎగిసిన నీరు కొలనుల్లోంచి బయటకు వస్తున్నకొద్దీ చల్లబడుతూ వస్తుంది. దీంతో ఉష్ణోగ్రతల్లో మార్పులు తలెత్తుతుంటాయి. ఇది బ్యాక్టీరియా వృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇవే అక్కడి రంగులకు కారణం. సాధారణంగా వేడి నీటిబుగ్గల్లో అత్యధిక వేడిగా ఉండే చోట ఉష్ణోగ్రతలు 70 డిగ్రీల సెల్షియస్ నుంచి 100 డిగ్రీల సెల్షియస్కు పైగా ఉంటాయి. అక్కడ నీరు స్పష్టంగా ఉంటుంది. అంటే బ్యాక్టీరియా జీవించి ఉండటం అసాధ్యమని అనుకునేవారు. అయితే చుట్టుపక్కల మాదిరిగానే అంత వేడిలోనూ బ్యాక్టీరియా నివసించే అవకాశం ఉండొచ్చు కదా? ఈ ప్రశ్నకు జవాబును కనుగొనే ప్రయత్నమే పీసీఆర్ విధానం ఆవిష్కరణకు దారితీసింది.
సుదీర్ఘ అధ్యయనంతో..
ఏడాది తర్వాత బ్రాక్ అక్కడికి కొందరు విద్యార్థి పరిశోధకులను వెంటబెట్టుకొచ్చారు. ఆ పరిశోధన చాలా కాలమే సాగింది. రెండేళ్ల తర్వాత వీరి కృషి ఫలించింది. బ్రాక్, మరో పరిశోధక విద్యార్థి సంయుక్తంగా 70 సెల్షియస్ డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలోనూ జీవించే కొత్తరకం బ్యాక్టీరియాను గుర్తించారు. దానికి థర్మస్ అక్వాటికస్ అని పేరు పెట్టారు. ఇది జీవశాస్త్ర, వైద్యరంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలదని అప్పుడు వారు అనుకోలేనే లేదు.
జబ్బుల నిర్ధరణకే కాదు..
పీసీఆర్ విధానం జబ్బుల నిర్ధరణకే కాదు.. క్యాన్సర్ కణాలను గుర్తించటానికీ ఉపయోగపడుతుంది. అలాగే నేరాలు జరిగిన చోట నేరగాళ్ల డీఎన్ఏ ఆనవాళ్లను గుర్తించటానికి, జన్యుక్రమాన్ని విశ్లేషించటానికి, వైరస్ల జన్యుమార్పులను తెలుసుకోవటానికి, వ్యక్తుల వారసత్వాన్ని ధ్రువీకరించటానికి కూడా పీసీఆర్ విధానం తోడ్పడుతుంది.
ఎలా సాధ్యం?
అంత వేడిలో బ్యాక్టీరియా ఎలా జీవించగలుగుతోంది? ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల్లో తలెత్తిన ప్రశ్న ఇది. దీన్ని గుర్తించటం మీదా బ్రాక్ అధ్యయనం ఆరంభించారు. బ్యాక్టీరియాలోని ఎంజైమ్లు (ప్రొటీన్లు) వాటి కణాల్లో రసాయనిక ప్రతిచర్యలను కలిగించటం దీనికి కారణమని గుర్తించారు. నీరు మరిగే ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ వేడి ఉన్నప్పటికీ ఆ ఎంజైమ్లు పనిచేస్తుండటం విచిత్రం. నిజానికి ఇతర ప్రాణుల ఎంజైమ్లేవీ అంత వేడిని తట్టుకోలేవు. వేడి పెనం మీద గుడ్డు వేస్తే అట్టుగా మారినట్టుగా ఎంజైమ్ల ఆకృతులు మారిపోతాయి. వాటి పని ఆగుతుంది. కానీ థర్మస్ అక్వాటిస్ బ్యాక్టీరియా ఎంజైమ్లు చెక్కుచెదరవు. ఇలాంటి చిత్రమైన ఎంజైమ్ల్లో ఒకటే పాలిమరేజ్. ఇప్పుడు పీసీఆర్ పరీక్షలో కీలకంగా ఉపయోగపడుతోంది ఇదే. ఈ ఎంజైమ్ను నిర్ధరణ పరీక్షకు వాడుకోవచ్చని కేరీ ములిస్ అనే శాస్త్రవేత్త 80ల్లో నిరూపించారు. దీని ఆధారంగానే ఆయన పీసీఆర్ పరీక్షను రూపొందించారు.
పీసీఆర్ ఎలా పనిచేస్తుంది?
లాలాజలం, రక్తం, కణజాలం వంటి నమూనాల్లో ఆయా వ్యక్తుల డీఎన్ఏ ఉంటుంది. వీటిల్లో వ్యాధికారక క్రిముల డీఎన్ఏ కూడా ఉండొచ్చు. నమూనాలను ఒక పరికరంలో వేసి, పాలిమరేజ్ ఎంజైమ్ను జతచేస్తారు. అప్పుడు నమూనాల ప్రతులు పెద్దఎత్తున పుట్టుకొస్తాయి. వ్యాధికారక క్రిమి ఉన్నట్టయితే బయటపడుతుంది. కొవిడ్-19 విజృంభించినప్పుడు జబ్బు నిర్ధరణకు విస్తృతంగా ఉపయోగపడింది ఇదే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి. -
బొగ్గు దాణా!
బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు