మాట్లాడే పరికరం!
మాటలను గుర్తించే స్పీచ్ రికగ్నిషన్ పరిజ్ఞానంలో ఐఐటీ గువహటి పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. నేరుగా స్వరపేటిక కంపన సంకేతాల నుంచి మాటలను సృష్టించే పద్ధతిని సృష్టించారు.
మాటలను గుర్తించే స్పీచ్ రికగ్నిషన్ పరిజ్ఞానంలో ఐఐటీ గువహటి పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. నేరుగా స్వరపేటిక కంపన సంకేతాల నుంచి మాటలను సృష్టించే పద్ధతిని సృష్టించారు. దీని పేరు ‘ఎల్ఓక్యూయూ’. అంటే లాటిన్లో ‘మాట్లాడటానికి’ అని అర్థం. దీనిలోని సెన్సర్లు గొంతు వెలుపలి నుంచే స్వరతంత్రుల కదలికలను పసిగట్టి, వాటి ఆధారంగా మాటలను సృష్టిస్తుండటం గమనార్హం. మాట్లాడటంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారికి, మాటలు పీలగా వచ్చేవారికి, ఆసుపత్రుల వంటి వాతావరణాల్లో ఇది ఎంతగానో ఉపయోగపడగలదని భావిస్తున్నారు. మనం అలవోకగా తేలికగా మాట్లాడేస్తుంటాం గానీ దీని వెనక పెద్ద కథే నడుస్తుంది. ఊపిరితిత్తుల నుంచి శ్వాసనాళం ద్వారా గాలి ప్రవహించి, స్వర పేటికను కదిలించటంతో మాట ప్రక్రియ మొదలవుతుంది. స్వరపేటికలోని స్వరతంత్రుల కంపనాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని ఊపిరితిత్తులు, నోరు మధ్య గాలి ప్రవాహాన్ని పర్యవేక్షించే గ్లోటిస్ అనే భాగం నియంత్రిస్తుంది. ఇవన్నీ ఒక సమన్వయంతో పనిచేస్తుంటాయి. స్వరతంత్రుల మధ్య ఖాళీలను అవసరానికి అనుగుణంగా స్వరపేటిక సరిచేస్తూ శబ్దాలను పుట్టిస్తుంది. ఇవి స్వర మార్గం ద్వారా ప్రయాణిస్తూ తీవ్రత, స్థాయిని మార్చుకుంటూ మాటల రూపంలో బయటకు వస్తాయి. కొన్నిసార్లు స్వరతంత్రులు కంపించినా నాలుక, గొంతు కండరాల సమన్వయం లోపించటం వల్ల మాట ఉత్పత్తి కాకపోవచ్చు. ఇలాంటి కారణాలతో మాట్లాడటంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారికి ఎల్ఓక్యూయూ బాగా ఉపయోగపడగలదు. దీని ద్వారా ఉత్పత్తయిన మాట స్పష్టంగా ఉండటం వల్ల మైక్రోఫోన్ల వంటి సంప్రదాయ పరిజ్ఞానాలకు ప్రత్యామ్నాయం కాగలదనీ ఆశిస్తున్నారు. ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ పరికరం ఖరీదు రూ.2వేల లోపే ఉండటం గమనార్హం. పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తే ఇంకా చవకగా లభించొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆకాశ దేశాన అద్భుత కాంతులు!
రాత్రిపూట ఆకాశం ఎలా ఉంటుంది? ఇంకెలా.. నల్లగా. నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ ఉంటాయి. చంద్రుడు ప్రకాశిస్తే తెల్లటి వెన్నెల కాస్తుంది. -
3డీ ముద్రణతో రాకెట్ ఇంజిన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనతను సాధించింది. 3డీ ముద్రణతో రూపొందించిన ద్రవ రాకెట్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించి సంచలనం సృష్టించింది. -
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్