TS News: బడ్జెట్లో నిధులు కేటాయించండి.. కేంద్ర ఆర్థిక మంత్రికి కేటీఆర్ లేఖ
రాష్ట్రంలో పురపాలకశాఖ తరఫున చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా ...
హైదరాబాద్: రాష్ట్రంలో పురపాలకశాఖ తరఫున చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్కు ఆయన లేఖ రాశారు. కేపీహెచ్బీ నుంచి కోకాపేట మీదుగా నార్సింగి వరకు 30 కిలోమీటర్ల మేర ఎమ్మార్టీస్ మెట్రో నియో నెట్ వర్క్ ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్నట్టు తెలిపిన మంత్రి.. ప్రతిపాదిత ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ను ప్రస్తుత మెట్రో రైలు నెట్ వర్క్ను అనుసంధానిస్తుందని తెలిపారు. 2030 నాటికి రోజుకు 5లక్షల మంది ప్రయాణిస్తారని భావిస్తున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యవయమైన రూ.3,050 కోట్లలో 15 శాతాన్ని రూ.450 కోట్లు మంజూరు చేయాలని కోరారు.
వరంగల్లో మెట్రో నియో ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని, ప్రాజెక్టు వ్యయంలో 20శాతంగా రూ.184 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్కు అనుగుణంగా రాష్ట్రంలో మెట్రో నియో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును పరిశీలిస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్, పరిసరాల్లో మొత్తం 104 మిస్సింగ్ లింక్ రోడ్ల కారిడార్లకు రూ.2,400 కోట్ల వ్యయం అవుతుందని, అందులో మూడో వంతు రూ.800 కోట్లు ఇవ్వాలని కోరారు. రూ.9వేల కోట్ల వ్యయంతో నిర్మించే ప్యారడైజ్ కూడలి నుంచి షామీర్పేట ఓఆర్ఆర్ కూడలి, కండ్లకోయ వరకు ఆరులేన్ల ఎలివేటెడ్ కారిడార్లకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రూ.11,500 కోట్ల వ్యయంతో స్కైవేలతో కలిపి మూసీ వెంట ఇరువైపులా తూర్పు-పశ్చిమ కారిడార్ల అనుసంధానానికి నిధులు ఇవ్వాలని, ఎస్సార్డీపీ రెండో దశకు రూ.14వేల కోట్ల వ్యయం అవుతుందని లేఖలో పేర్కొన్నారు. రానున్న కేంద్ర బడ్జెట్ లో ఈ మేరకు ఆయా ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి