ఓడినా.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
తేజస్వి యాదవ్.. ఈ యువ నేత పేరు ఇప్పుడు దేశంలో తెలియని వారు లేరు. మూడు పదుల వయసున్న తేజస్వి బిహార్ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు. గత ఎన్నికల్లోనే రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించినా అప్పుడు ...
ఒంటి చేత్తో మహాకూటమిని నడిపించిన తేజస్వి
ఉద్ధండులకు దీటుగా పోరాడిన యువనేత
తేజస్వి యాదవ్.. ఈ యువ నేత పేరు ఇప్పుడు దేశంలో తెలియని వారు లేరు. మూడు పదుల వయసున్న తేజస్వి బిహార్ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు. గత ఎన్నికల్లోనే రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించినా అప్పుడు తండ్రి లాలూ చురుగ్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన జైల్లో ఉండటంతో తేజస్వి అన్నీ తానే అయి నడిపించారు. మహాకూటమి గెలిచి ఉంటే 31 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి అయ్యి రికార్డు సృష్టించేవారు. మహాకూటమి గెలవకున్నా ఆయన్ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా పిలవవచ్చు. ఎందుకంటే ప్రత్యర్థి కూటమిలో ఉన్నది ప్రధాని మోదీ, నీతీశ్, సుశీల్కుమార్ మోదీ, మాంఝీ లాంటి అతిరథ మహారథులు. ఇటు చూస్తే బలహీనంగా ఉన్న కాంగ్రెస్, బలమైన పట్టులేని వామపక్షాలు. రాజకీయంగా ఎత్తులు వేయడంలో దిట్ట అయిన తండ్రి అందుబాటులో లేరు. సోదరుడు తేజ్ ప్రతాప్ ఉన్నా ఆయనకు రాజకీయ చాతుర్యం అంతంతే. దీంతో తెరవెనక ఎత్తులు వేసి మంత్రాంగం నడపాలన్నా, తెరముందు ప్రత్యర్థులపై వాగ్దాటితో విరుచుకుపడి ప్రజలను ఆకట్టుకోవాలన్నా అన్నీ తేజస్వినే. ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడంతో ఈ యువనేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన సభలకు పోటెత్తారు. ప్రసంగాలకు కరతాళ ధ్వనులతో సభలు మార్మోగాయి.
మహాకూటమి ఏర్పాటు చేస్తున్న తొలినాళ్లలో తేజస్వి నాయకత్వాన్ని కాంగ్రెస్, ఉపేంద్ర కుశ్వాహా నేతృత్వంలోని ఆర్ఎల్ఎస్పీ, జితన్రామ్ మాంఝీ నేతృత్వంలోని హెచ్ఏఎం అంగీకరించలేదు. సమష్టి నాయకత్వం ఉండాలని ఆ పార్టీలు పట్టుబట్టాయి. అయితే వారి డిమాండ్లకు తేజస్వి తలొగ్గలేదు. చివరకు కుశ్వాహా, మాంఝీ బయటకు వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్కు తేజస్వి నాయకత్వాన్ని అంగీకరించక తప్పలేదు. బిహార్ రాజకీయాల్లో చక్రం తిప్పే లాలూ అందుబాటులో లేకున్నా ఆర్జేడీ గణనీయమైన సంఖ్యలో స్థానాలు గెల్చుకుందంటే ప్రధాన కారణం తేజస్వినే. శాసనసభ సమరం మొత్తం ఆయన కేంద్రంగానే నడిచింది. ప్రత్యర్థులు విమర్శించడానికి ఆయన తప్ప మరో నేత కనిపించలేదు. మోదీ, నడ్డా, రాజ్నాథ్, యోగి, నీతీశ్ ఇలా ఎన్డీయే తరఫున ప్రచారానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తేజస్వి లక్ష్యంగానే విమర్శలు కురిపించారు. ఆయన పేరు లేకుండా ప్రసంగాన్ని పూర్తి చేయలేదు. వారందరికీ యువనేత దీటుగా బదులిచ్చారు. ఎన్డీఏ నేతలను ఇరుకున పెట్టే ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ ఉద్యోగాల హామీ సహా వివిధ హామీలతో యువతను ఆకట్టుకున్నారు. సొంత పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేస్తూనే రాహుల్గాంధీతో కాంగ్రెస్ సభల్లోనూ పాల్గొన్నారు. కానీ కాంగ్రెస్ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదు. దీంతో తేజస్వి అన్నీ తానై పోరు సాగించాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.