మధ్యాహ్న భోజనం మరో 5 ఏళ్లు
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మరో అయిదేళ్లు కొనసాగించాలని ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
ఈనాడు, దిల్లీ: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మరో అయిదేళ్లు కొనసాగించాలని ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది. 2021-22 నుంచి 2025-26 వరకు ఇది కొనసాగుతుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.54,061.73 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.31,733.17 కోట్లు ఖర్చు చేయనున్నాయి. కేంద్రం ఆహార ధాన్యాలపై అదనంగా రూ.45వేల కోట్లు వెచ్చించనుంది. దీంతో అయిదేళ్ల కాలానికి ఈ పథకంపై ప్రభుత్వాలు చేసే మొత్తం ఖర్చు రూ.1,30,794.90 కోట్లకు చేరనుంది. ఈ పథకం కింద అయిదేళ్ల పాటు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు పిల్లలకు తాజాగా వండిన వేడివేడి భోజనం అందిస్తారు. దేశవ్యాప్తంగా 11.20 లక్షల పాఠశాలల్లో చదివే 11.80 కోట్ల మంది పిల్లలకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మధ్యాహ్న భోజన పథకం ఇకపై పీఎం పోషణ్ శక్తి నిర్మాణ్ స్కీమ్(పీఎం పోషణ్)గా కొనసాగనుంది.
* ప్రభుత్వ, ప్రభుత్వ సహాయంతో నడిచే పూర్వ ప్రాథమిక, బాలవాటికల్లో చదివే పిల్లలకూ దీన్ని వర్తింపజేస్తారు. ‘తిథి భోజనం’ పేరుతో స్థానిక ప్రజలను భాగస్వాములను చేసి ప్రత్యేక సందర్భాలు, పండుగల సమయంలో పిల్లలకు ప్రత్యేక భోజనం అందించేలా చూస్తారు.
* పాఠశాలల్లో పోషకాహార పంట తోటలను అభివృద్ధి చేస్తారు. విద్యార్థులకు తోటల పెంపకంతో పాటు, ప్రకృతితో మమేకమయ్యే విధానాన్ని ప్రోత్సహిస్తారు. ఈ తోటల నుంచి వచ్చే ఆకు కూరలు, కూరగాయల ద్వారా పిల్లలకు మరిన్ని సూక్ష్మ పోషకాలు అందించడానికి వీలవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే 3 లక్షల పాఠశాలల్లో ఇలాంటి తోటలు ఉన్నట్లు తెలిపింది.
* అన్ని జిల్లాల్లో ఈ పథకానికి సామాజిక ఆడిట్ను తప్పనిసరి చేసింది.
* రక్తహీనత సమస్య అధికంగా ఉన్న జిల్లాలు, ఆకాంక్షిత జిల్లాల్లో పిల్లలకు అనుబంధ పోషకాలు అందిస్తారు.
* సంప్రదాయ వంటకాలు, స్థానికంగా అందుబాటులో ఉండే దినుసులు, కూరగాయలతో సరికొత్త వంటకాలను ప్రోత్సహించడానికి గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వంటల పోటీలు నిర్వహిస్తారు.
* పథకం అమలులో రైతు ఉత్పత్తి సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలకు భాగస్వామ్యం కల్పిస్తారు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు స్థానిక సంప్రదాయ వంటకాలను ప్రోత్సహిస్తారు.
* ప్రముఖ విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన విద్యార్థులు, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (డైట్)కు చెందిన ట్రెయినీ టీచర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ పథకం అమలుతీరును పరీక్షించనున్నట్లు తెలిపింది.
రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లకు రూ.13,165 కోట్లు
కేంద్ర ప్రభుత్వం రూ.13,165 కోట్లతో రక్షణ ఉత్పత్తులను కొనుగోలుచేయాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్ నేతృత్వంలో బుధవారం దిల్లీలో సమావేశమైన రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి ఇందుకు ఆమోదముద్ర వేసింది. ఇందులో రూ.11,486 కోట్ల విలువైన ఉత్పత్తులను (87%) పూర్తిగా దేశీయ సంస్థల నుంచే సేకరించనున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది. భారత సాయుధ దళాల ఆధునికీకరణ, నిర్వహణ అవసరాల కోసం వీటిని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో రూ.3,850 కోట్లతో 25 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) నుంచి సేకరించనున్నారు. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లక్ష్యసాధన కోసం దేశీయ సంస్థల నుంచి వీటిని సేకరించాలని నిర్ణయించారు. అలాగే దేశీయంగా రూపకల్పన చేసి, అభివృద్ధి చేసిన ఆయుధాలకు ఊతమివ్వడం కోసం రూ.4,962 కోట్లతో రాకెట్ ఆయుధాల కొనుగోలుకు రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి ఆమోదం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
కార్టూన్
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు.