మధ్యాహ్న భోజనం మరో 5 ఏళ్లు
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మరో అయిదేళ్లు కొనసాగించాలని ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
ఈనాడు, దిల్లీ: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మరో అయిదేళ్లు కొనసాగించాలని ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది. 2021-22 నుంచి 2025-26 వరకు ఇది కొనసాగుతుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.54,061.73 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.31,733.17 కోట్లు ఖర్చు చేయనున్నాయి. కేంద్రం ఆహార ధాన్యాలపై అదనంగా రూ.45వేల కోట్లు వెచ్చించనుంది. దీంతో అయిదేళ్ల కాలానికి ఈ పథకంపై ప్రభుత్వాలు చేసే మొత్తం ఖర్చు రూ.1,30,794.90 కోట్లకు చేరనుంది. ఈ పథకం కింద అయిదేళ్ల పాటు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు పిల్లలకు తాజాగా వండిన వేడివేడి భోజనం అందిస్తారు. దేశవ్యాప్తంగా 11.20 లక్షల పాఠశాలల్లో చదివే 11.80 కోట్ల మంది పిల్లలకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మధ్యాహ్న భోజన పథకం ఇకపై పీఎం పోషణ్ శక్తి నిర్మాణ్ స్కీమ్(పీఎం పోషణ్)గా కొనసాగనుంది.
* ప్రభుత్వ, ప్రభుత్వ సహాయంతో నడిచే పూర్వ ప్రాథమిక, బాలవాటికల్లో చదివే పిల్లలకూ దీన్ని వర్తింపజేస్తారు. ‘తిథి భోజనం’ పేరుతో స్థానిక ప్రజలను భాగస్వాములను చేసి ప్రత్యేక సందర్భాలు, పండుగల సమయంలో పిల్లలకు ప్రత్యేక భోజనం అందించేలా చూస్తారు.
* పాఠశాలల్లో పోషకాహార పంట తోటలను అభివృద్ధి చేస్తారు. విద్యార్థులకు తోటల పెంపకంతో పాటు, ప్రకృతితో మమేకమయ్యే విధానాన్ని ప్రోత్సహిస్తారు. ఈ తోటల నుంచి వచ్చే ఆకు కూరలు, కూరగాయల ద్వారా పిల్లలకు మరిన్ని సూక్ష్మ పోషకాలు అందించడానికి వీలవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే 3 లక్షల పాఠశాలల్లో ఇలాంటి తోటలు ఉన్నట్లు తెలిపింది.
* అన్ని జిల్లాల్లో ఈ పథకానికి సామాజిక ఆడిట్ను తప్పనిసరి చేసింది.
* రక్తహీనత సమస్య అధికంగా ఉన్న జిల్లాలు, ఆకాంక్షిత జిల్లాల్లో పిల్లలకు అనుబంధ పోషకాలు అందిస్తారు.
* సంప్రదాయ వంటకాలు, స్థానికంగా అందుబాటులో ఉండే దినుసులు, కూరగాయలతో సరికొత్త వంటకాలను ప్రోత్సహించడానికి గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వంటల పోటీలు నిర్వహిస్తారు.
* పథకం అమలులో రైతు ఉత్పత్తి సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలకు భాగస్వామ్యం కల్పిస్తారు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు స్థానిక సంప్రదాయ వంటకాలను ప్రోత్సహిస్తారు.
* ప్రముఖ విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన విద్యార్థులు, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (డైట్)కు చెందిన ట్రెయినీ టీచర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ పథకం అమలుతీరును పరీక్షించనున్నట్లు తెలిపింది.
రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లకు రూ.13,165 కోట్లు
కేంద్ర ప్రభుత్వం రూ.13,165 కోట్లతో రక్షణ ఉత్పత్తులను కొనుగోలుచేయాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్ నేతృత్వంలో బుధవారం దిల్లీలో సమావేశమైన రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి ఇందుకు ఆమోదముద్ర వేసింది. ఇందులో రూ.11,486 కోట్ల విలువైన ఉత్పత్తులను (87%) పూర్తిగా దేశీయ సంస్థల నుంచే సేకరించనున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది. భారత సాయుధ దళాల ఆధునికీకరణ, నిర్వహణ అవసరాల కోసం వీటిని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో రూ.3,850 కోట్లతో 25 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) నుంచి సేకరించనున్నారు. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లక్ష్యసాధన కోసం దేశీయ సంస్థల నుంచి వీటిని సేకరించాలని నిర్ణయించారు. అలాగే దేశీయంగా రూపకల్పన చేసి, అభివృద్ధి చేసిన ఆయుధాలకు ఊతమివ్వడం కోసం రూ.4,962 కోట్లతో రాకెట్ ఆయుధాల కొనుగోలుకు రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి ఆమోదం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
ప్రతి మెడికల్ కళాశాలకు ఆసుపత్రి అత్యవసరం. అలాంటిది ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే కళాశాల భవనం, హాస్టల్ గదులకు 2023 సెప్టెంబరులో సీఎం జగన్ హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. -
వరదాయినికి జగన్ శాపం
ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి... ‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి... 2021 జూన్ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి... మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు! -
1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్ కుట్రకు మరో ఏడుగురి బలి
నెలనెలా కొండంత ఆసరానిచ్చే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ఉసురు తీస్తోంది. జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది. -
వసూల్ బ్రదర్స్
ఏ నియోజకవర్గానికైనా.. ఒక ప్రజాప్రతినిధి ఉంటారు.. కానీ ఆ నియోజకవర్గానికి ఇద్దరు! ఒకరు గిల్లితే.. మరొకరు జోల పాడినట్లు నటిస్తారు. ఇద్దరి దారి ఒకటే... అక్రమార్జన. ఇందులో సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీలనే తేడా లేదు. -
రైతన్న నెత్తిన శని.. జగనన్న!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు! -
పంచాయతీల్లో పందేరానికి.. ‘నరేగా’ నిధులు
పోలింగ్కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్’ నిధులు గుమ్మరిస్తోంది. -
ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు?
దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి. -
7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో ఈనెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ సంస్థ పేర్కొంది. -
ఇక్కడి ఘటనలు చూసి అమెరికాలో చలించిపోతున్నాం
‘ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు చూసి అమెరికాలో ఉండి కూడా మేం చలించిపోతున్నాం. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రైతుల బలవన్మరణాలు ఎక్కువయ్యాయి. -
జగన్ మార్కు కట్టుకథలు..!
అణువణువునా అతిశయం, అహంభావం.. నోరు తెరిస్తే అబద్ధం.. మూర్తీభవించిన ఫ్యూడల్ స్వభావం.. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు గోడమీద పిల్లివాటం... కొన్ని ప్రశ్నలకు మౌనం, విచిత్ర హావభావాలే సమాధానం..!. -
రోడ్డు గుంతలో పడి సైనికుడికి గాయాలు
సెలవును సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం సరిహద్దులకు బయలుదేరిన సైనికుడిని గుంతల రోడ్డు గాయాలపాలు చేసింది. -
తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్ పట్టుపడటం కలకలం రేపింది. -
జిల్లాల వారీగా సీఎఫ్డీ ఎన్నికల పరిశీలకులు
ఎన్నికల్లో అక్రమాలు, క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున 13 ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల పరిశీలకుల్ని నియమించినట్లు సీఎఫ్డీ ఛైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ తెలిపారు. -
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒకరోజు సెలవు
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలట్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి