మన ఊరు.. మన బస్తీ.. మన బడి
ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో మన ఊరు- మన బడి, పట్టణాల్లో మన బస్తీ- మన బడి పేరిట ఆధునికీకరించనుంది. మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు డిజిటలీకరణ చేయనుంది.
రూ. 7,290 కోట్లతో పాఠశాలల అభివృద్ధి
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో మన ఊరు- మన బడి, పట్టణాల్లో మన బస్తీ- మన బడి పేరిట ఆధునికీకరించనుంది. మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు డిజిటలీకరణ చేయనుంది. రానున్న మూడేళ్లలో రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో రూ.7289.54కోట్ల ఖర్చుతో సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది. తొలి విడతలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9,123 బడుల్లో రూ.3497.62కోట్లతో పనులు చేపట్టనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలం యూనిట్గా అధిక ప్రవేశాలున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్ని ఎంపికచేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. ఈ పనుల మంజూరు బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించిన ప్రభుత్వం.. ఒక మండలానికి ఒక ఏజెన్సీ ఉండాలని స్పష్టం చేసింది. పనుల నిర్వహణ బాధ్యతను అనుమతించి ఆర్థిక పరిమితికి లోబడి పాఠశాల యాజమాన్య కమిటీలు చేపట్టాలని, ప్రజాభాగస్వామ్యం తీసుకోవాలని సూచించింది. యాజమాన్య కమిటీలు ముందుకు రాకుంటే జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకోనున్నారు.
యాజమాన్య కమిటీలకు బాధ్యతలు
ఈ పథకానికి అవసరమైన నిధులను సమగ్ర శిక్షాఅభియాన్, ఉపాధిహామీ, ఏసీడీపీ, జిల్లా గ్రంథాలయ సంస్థ, నాబార్డు, జిల్లా, మండల పరిషత్ ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. నిధుల సమీకరణకు ఆర్థికశాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటూ అవసరమైనవాటిని పాఠశాల విద్యాశాఖ కమిషనర్కు అందుబాటులో పెట్టనుందని తెలిపింది. నిధుల ఖర్చుకు సంబంధించిన చెక్కులపై పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్, ప్రిన్సిపల్, సహాయ ఇంజినీర్, సర్పంచి సంతకాలు తప్పనిసరి. ఎవరైనా దాత రూ.2లక్షలు ఈ కార్యక్రమం కింద ఇస్తే కమిటీలో సభ్యుడిగా చేర్చుకోవచ్చు. రూ.10లక్షలు అంతకు ఎక్కువగా విరాళం ఇస్తే పాఠశాలలో ఒక తరగతి గదికి దాత సూచించిన పేరు పెడుతారు.
* మన ఊరు, మన బస్తీ, మన బడి కార్యక్రమం కింద చేపట్టే పనులపై ప్రభుత్వం సామాజిక తనిఖీని తప్పనిసరి చేసింది.
* దాతలు ఇచ్చే విరాళాలతో చేపట్టే పనులను పర్యవేక్షించేందుకు ప్రతి బడిలో పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేయాలని సూచించింది. సంఘంలోని ఇద్దరు సభ్యులు, సర్పంచితో కలిసి కమిటీగా ఏర్పాటు కావాలి. ఈ కమిటీతో పాటు పాఠశాల యాజమాన్య కమిటీలోని ఇద్దరు సభ్యులు, ప్రధానోపాధ్యాయుడు.. దాతలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు, నిర్వహణ బాధ్యతలు పరిశీలించాలి. దాతలు ఇచ్చే నిధులను పూర్వ విద్యార్థుల సంఘంలోని ఇద్దరు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యయుడితో కూడిన సంయుక్త ఖాతాలో జమ చేయాలి. ఈ నిధులను జిల్లా కలెక్టరు అనుమతితో ఖర్చుచేయాలి. వీటిపై వచ్చే వడ్డీని పాఠశాల నిర్వహణ కోసం వినియోగించాలి.
పాఠశాలల్లో చేపట్టే పనులు...
* నీటివసతితో మరుగుదొడ్లు
* విద్యుదీకరణ, తాగునీటి సరఫరా
* విద్యార్థులు, అధ్యాపకుల కోసం ఫర్నీచర్
* ఉన్నత పాఠశాలల్లో లైబ్రరీ, కంప్యూటర్, సైన్స్ల్యాబ్లు
* పాఠశాలకు మొత్తం రంగులు వేయడం
* పెద్ద, చిన్న మరమ్మతులు, గ్రీన్చాక్ బోర్డులు
* ప్రహరీగోడలు, కిచెన్ షెడ్లు
* శిథిల గదుల స్థానంలో కొత్తవి నిర్మాణం
* ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లు
* డిజిటల్ విద్యకు అవసరమైన మౌలిక సదుపాయాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.