Subhash Chandra Bose: కాలేజీ గలాటా... మారిన బోస్ బాట
సంపన్న కుటుంబం. తండ్రి బ్రిటిష్ ప్రభుత్వ న్యాయవాది! ఆంగ్లేయులకు విశ్వాసపాత్రుడు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా బాల్యమంతా... దాదాపు తెల్లవారిలా పెరిగాడు. వారితోనే కలసి చదివాడు.
సంపన్న కుటుంబం. తండ్రి బ్రిటిష్ ప్రభుత్వ న్యాయవాది! ఆంగ్లేయులకు విశ్వాసపాత్రుడు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా బాల్యమంతా... దాదాపు తెల్లవారిలా పెరిగాడు. వారితోనే కలసి చదివాడు. అలాంటి సుభాష్చంద్ర బోస్... ఆంగ్లేయులకెలా వ్యతిరేకమయ్యాడనేది ఆసక్తికరం! కాలేజీ రోజుల్లో జరిగిన ఓ ఘటన బోస్ బాటను మళ్లించింది.
ప్రభావతీబోస్, జానకీనాథ్ బోస్ల 14 మంది సంతానంలో తొమ్మిదోవాడు సుభాష్చంద్ర బోస్. 1897 జనవరి 23న ఆయన పుట్టే నాటికి జానకీనాథ్ బ్రిటిష్ ప్రభుత్వ ప్లీడర్గా కటక్లో పనిచేసేవారు. పండగలకు తమ సొంతూరు కోల్కతాకు వెళ్లేవారు. సుభాష్ బాల్యమంతా కటక్లోనే సాగింది. ప్రొటెస్టెంట్ యూరోపియన్ స్కూల్లో... ఇంగ్లిష్, లాటిన్, బైబిల్, బ్రిటిష్ చరిత్ర చదువుకున్నాడు. ఇంట్లో తల్లి ద్వారా మహాభారతం, రామాయణం, బెంగాలీ కథలు, దుర్గా, కాళీ, రామకృష్ణ పరమహంస, వివేకానందుడి గురించి తెలిసింది. 12 ఏళ్ల వయసులో బడి మారటంతో అక్కడ బెంగాలీ, సంస్కృతాలతో పరిచయమైంది. మెట్రిక్యులేషన్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో అగ్రశ్రేణిలో నిలిచాడు. ఈ క్రమంలో తండ్రి ఆయన్ను సంపన్నులు చదివే కోల్కతాలోని ప్రఖ్యాత ప్రెసిడెన్సీ కళాశాలలో పాశ్చాత్య తత్వశాస్త్ర కోర్సులో చేర్చారు.. అలా బోస్ పయనం తండ్రి కోరుకున్న బాటలోనే కొనసాగింది.
నోరుజారిన ప్రొఫెసర్..
1916 ఫిబ్రవరిలో ఓ రోజు... చరిత్ర ఆచార్యుడు ఎడ్వర్డ్ ఫేర్లీ ఓటెన్ పాఠం చెబుతూ.. భారతీయ సంస్కృతి, భారతీయుల గురించి నీచంగా మాట్లాడాడు. కొంతమంది భారతీయ విద్యార్థులపై చేయి కూడా చేసుకున్నాడు. ఇది 19 ఏళ్ల బోస్తో పాటు అనేక మంది భారతీయ విద్యార్థుల రక్తాన్ని ఉడికించింది. కొద్దిరోజుల తర్వాత విద్యార్థులంతా ఓటెన్ను కాలేజీ మెట్లపై నుంచి తోసేసి... దాడిచేసినంత పనిచేశారు. గాయాలేమీ కానప్పటికీ తనను కొట్టిందెవరో ఓటెన్ గుర్తించలేకపోయాడు. కాలేజీ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. చివరకు.. ఆ రోజు సంఘటన తర్వాత బోస్ అక్కడి నుంచి పారిపోతుంటే చూశామంటూ అటెండర్ సాక్ష్యం చెప్పటంతో... ఆయనే ఈ దాడికి సూత్రధారి, పాత్రధారి అని బోస్ను కాలేజీ నుంచే కాకుండా... కోల్కతా యూనివర్సిటీ నుంచే బహిష్కరించారు. బోస్లో ఈ సంఘటన జాతీయ భావనలను రేకెత్తించగా... ఆయన తండ్రి దీన్ని అవమానంగా భావించారు. అప్పటికే జాతీయోద్యమం, విప్లవవాదం బెంగాల్లో విస్తృతమయ్యాయి. ఉడుకురక్తం ఎటు పరుగులు పెడుతుందోననే ఆందోళనతో జానకీనాథ్ తన మిత్రుడైన కోల్కతా వర్సిటీ వైస్ ఛాన్స్లర్ అశుతోష్ ముఖర్జీతో మాట్లాడారు. చివరకు బోస్కు మరో కాలేజీలో (స్కాటిష్ చర్చ్ కాలేజీ) మళ్లీ సీటు ఇప్పించారు. 1918లో తత్వశాస్త్రంలో బీఏ(ఆనర్స్)ను ప్రథమశ్రేణిలో పాసైన ఆయన్ను తండ్రి వెంటనే ఇంగ్లాండ్కు పంపించారు. అక్కడ ఇండియన్ సివిల్ సర్వీసెస్ (ఐసీఎస్) పరీక్షకు కూర్చోబెట్టారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరటంతో పాటు... ఐసీఎస్కూ సిద్ధమయ్యాడు బోస్. ఆ ఏడాది (1920) ఐసీఎస్లో కేవలం ఆరు సీట్లు మాత్రమే ఉండగా... ఓపెన్ కాంపిటేషన్లో నాలుగోస్థానంలో నిలిచి ఐసీఎస్ ప్రొబెషనర్గా ఎంపికయ్యాడు. మరో రెండు సబ్జెక్ట్లు, గుర్రపు స్వారీ పరీక్ష పూర్తి చేస్తే ఐసీఎస్ అధికారిగా భారత్కు వచ్చేయటమే మిగిలి ఉందిక!
నాకొద్దు ఐసీఎస్
ఈ దశలో... బోస్లో మళ్లీ జాతీయ భావనలు పురివిప్పాయి. తండ్రికి, అన్నయ్య శరత్చంద్రబోస్కు లేఖలు రాశారు. తన ప్రగతిశీల ఆలోచనలకు ఇది పొసగదని... ఈ ఐసీఎస్ సంకెళ్లతో దేశానికి సేవ చేయలేనని తన అశక్తతను వ్యక్తంజేశారు. చివరకు 1921 ఏప్రిల్లో ఐసీఎస్ తుది పరీక్ష రాయబోనని నిర్ణయించుకున్నారు. అదే విషయం కుటుంబంతో పాటు బ్రిటన్లో భారత వ్యవహారాల మంత్రి ఎడ్విన్ మాంటెగూకు సైతం స్పష్టం చేశారు. ‘నా పేరును ఐసీఎస్ ప్రొబెషనర్ల జాబితా నుంచి తొలగించండి. ఇప్పటిదాకా నాపై బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ఖర్చును తిరిగి ఇచ్చేస్తాను’ అంటూ మాంటెగూకు లేఖ రాశారు బోస్. చివరకు కేంబ్రిడ్జిలో కూడా తన చదువును పూర్తి చేయకుండానే భారత్కు తిరిగి వచ్చి జాతీయోద్యమంలో చేరారు.
1945లో విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ చనిపోయారనే విషయం తెలిశాక... కాలేజీ నుంచి తన బహిష్కరణకు కారణమైన ప్రొఫెసర్ ఎడ్వర్డ్ ఓటెన్ సంతాప సందేశం పంపటం విశేషం. బోస్ సేవలను, ధైర్యాన్ని, పోరాట స్ఫూర్తిని కీర్తిస్తూ.. గ్రీకు వీరుడితో ఆయన్ను పోలుస్తూ.. ఇంగ్లాండ్లో విశ్రాంత జీవితం గడుపుతున్న ఓటెన్ ఘన నివాళి అర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?