అమరావతే రాజధానిగా ఉండేలాసిఫారసు చేయండి: ఎంపీ కనకమేడల
‘అమరావతిని రాజధానిగా అంగీకరించిన వారు అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల బిల్లు పెట్టి ప్రజలను గందరగోళంలో పడేశారు. ఇప్పుడు ఆ బిల్లులు ఉపసంహరించుకోవడంతో అనిశ్చితి ఏర్పడింది. పునర్విభజన చట్టం ప్రకారం
ఈనాడు, దిల్లీ: ‘అమరావతిని రాజధానిగా అంగీకరించిన వారు అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల బిల్లు పెట్టి ప్రజలను గందరగోళంలో పడేశారు. ఇప్పుడు ఆ బిల్లులు ఉపసంహరించుకోవడంతో అనిశ్చితి ఏర్పడింది. పునర్విభజన చట్టం ప్రకారం రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసినందున అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం గట్టిగా సిఫారసు చేయాలి’ అని కోరినట్లు తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. లేకుంటే రాష్ట్రప్రభుత్వంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడిన విషయాలను ఆయన విలేకరులకు వివరించారు. శాసనసభలో తమ పార్టీ అధ్యక్షుడి కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సభలో లేవనెత్తుతామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్