లక్షణాలు లేకున్నా ఏకాంతమే
కొవిడ్ బాధితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో గృహ ఏకాంతవాసం (హోం ఐసొలేషన్)లో ఉండేవారి కోసం కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం తాజా మార్గదర్శకాలను జారీచేసింది. గత ఏడాది జులై 2 తర్వాత వీటిని
Home Isolationపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
కరోనా బాధితులకు, సంరక్షకులకు సూచనలు
ఈనాడు, దిల్లీ: కొవిడ్ బాధితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో గృహ ఏకాంతవాసం (హోం ఐసొలేషన్)లో ఉండేవారి కోసం కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం తాజా మార్గదర్శకాలను జారీచేసింది. గత ఏడాది జులై 2 తర్వాత వీటిని సవరించడం ఇదే తొలిసారి. కరోనా బారినపడిన వారిలో లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలున్న వారు ఇంట్లోనే ఉండి చికిత్స పొందడం మంచిదని సూచించింది. పరీక్షల్లో పాజిటివ్గా తేలి, ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకుండా, 94%పైన ఆక్సిజన్ స్థాయి ఉన్నవారు లక్షణాల్లేని బాధితుల కిందికి వస్తారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందుల్లేనప్పటికీ కేవలం జ్వరం, జలుబు, ముక్కు కారడం, గొంతులో ఇబ్బందులు (అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లక్షణాలు) మాత్రమే ఉండి, 94%కి పైగా ఆక్సిజన్ స్థాయి ఉన్నవారు స్వల్ప లక్షణాలున్న వారి పరిధిలోకి వస్తారు.
హోం ఐసొలేషన్ ఎవరికి?
* కరోనా పాజిటివ్గా తేలి.. లక్షణాలేవీ లేవని లేదా స్వల్ప లక్షణాలున్నాయని వైద్యాధికారి ధ్రువీకరించాలి. ఇంట్లో ఏకాంతంగా ఉండటానికి వీలైనంత స్థలం ఉండాలి.
* 24 గంటలూ చూసుకునే సంరక్షకులుండాలి. బాధితులు హోం ఐసొలేషన్లో ఉన్నంతకాలం వారు అవసరమైనప్పుడు వైద్యులతో సంప్రదింపులు జరుపుతుండాలి.
* 60 ఏళ్లు పైబడిన వారితో పాటు రక్తపోటు, మధుమేహం; గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, సెరెబ్రోవాస్కులర్కు సంబంధించిన దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారిని మాత్రం వైద్యాధికారులు తగినవిధంగా పరీక్షించిన తర్వాతే హోం ఐసొలేషన్కు అనుమతించాలి.
* హెచ్ఐవీ, అవయవ మార్పిడి, క్యాన్సర్లాంటి సమస్యలున్న వారిని హోం ఐసొలేషన్కు సిఫార్సు చేయకూడదు. అవసరమైతే డాక్టర్లు వారి పరిస్థితులను సూక్ష్మంగా పరిశీలించిన తర్వాతే అనుమతివ్వాలి.
* హోం ఐసొలేషన్లో ఉన్నవారి సంరక్షకులు ముందు జాగ్రత్తగా డాక్టర్లు సూచించిన విధంగా హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులు తీసుకోవాలి.
చికిత్స ఏమిటి?
* డాక్టర్ను సంప్రదించిన మీదట తనకున్న ఇతరత్రా అనారోగ్య సమస్యలకు సంబంధించిన మందులను కొనసాగించాలి.
* జ్వరం, జలుబు, దగ్గు సమయాల్లో లక్షణాలకు అనుగుణంగా మందులు తీసుకోవాలి.
* రోజుకు రెండుసార్లు నీటితో గార్గిల్ చేయడం, ఆవిరి తీసుకోవడం మంచిది.
* రోజుకు 4 సార్లు పారాసిటమాల్ 650 ఎంజీ తీసుకున్నప్పటికీ జ్వరం అదుపులోకి రాకపోతే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. అలాంటి సమయంలో వైద్యులు నాన్స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫలమేటరీ డ్రగ్స్ (ఉదాహరణకు నాప్రాక్సిన్ 250 ఎంజీ రోజుకు రెండుసార్లు) సిఫార్సు చేయొచ్చు.
* ఖాళీ కడుపుతో రోజుకోసారి ఐవర్మెక్టిన్ 200 ఎంసీజీ ట్యాబ్లెట్ కూడా 3 నుంచి 5 రోజులపాటు ఉపయోగించవచ్చు.
* లోపలికి పీల్చుకొనే బ్యూడెసొనైడ్ (ఇన్హేలర్స్ ద్వారా ఒక్కోసారి 800 ఎంసీజీ చొప్పున రోజుకు రెండుసార్లు) 5-7 రోజులు ఉపయోగించవచ్చు. అయితే లక్షణాలు కనిపించిన 5 రోజుల తర్వాత కూడా జ్వరం, దగ్గులాంటివి ఉన్నప్పుడు మాత్రమే ఇది వాడాలి.
* రెమ్డెసివిర్తోపాటు, ఇతర ఇన్వెస్టిగేషనల్ థెరఫీ మందులన్నీ వైద్యుల సూచనలతో, ఆసుపత్రుల్లో ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఇంట్లో ఉండగా రెమ్డెసివిర్ తీసుకొనే ప్రయత్నం చేయొద్దు.
* తేలికపాటి లక్షణాలున్న వారికి ఓరల్ స్టెరాయిడ్స్ ఇవ్వకూడదు. 7 రోజుల తర్వాత కూడా జ్వరం, తీవ్రమైన దగ్గు లాంటి లక్షణాలు ఉంటే డాక్టర్ను సంప్రదించిన తర్వాతే తక్కువ మోతాదులో ఓరల్ స్టెరాయిడ్స్ ఉపయోగించాలి.
* ఆక్సిజన్ స్థాయి తగ్గుతున్నా, ఊపిరి అందని పరిస్థితి ఉన్నా వెంటనే డాక్టర్ను సంప్రదించి ఆసుపత్రిలో చేర్చాలి.
* ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు.. గది వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి 94% కంటే తగ్గిపోయినప్పుడు.. ఛాతిలో నిరంతరం నొప్పి, ఒత్తిడి ఉన్నప్పుడు.. మానసిక అయోమయం, లేవడానికి చేతకానప్పుడు.. వెంటనే వైద్యులను సంప్రదించాలి.
హోం ఐసొలేషన్ ఎప్పుడు ముగించాలి?
లక్షణాలు కనిపించడం మొదలైన నాటి నుంచి కనీసం 10 రోజుల తర్వాత, వరుసగా 3 రోజులు జ్వరం రాకపోయినప్పుడే రోగి హోం ఐసొలేషన్ను ముగించాలి. ఒకసారి హోం ఐసొలేషన్ సమయం ముగిసిన తర్వాత మళ్లీ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు.
బాధితులకు సూచనలు
* ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా, ఒక ప్రత్యేక గదికే పరిమితం కావాలి. ఆ గదిలోకి మంచి గాలి, వెలుతురు వచ్చేలా ఉండాలి.
* బాధితులు నిరంతరం 3 పొరల మెడికల్ మాస్క్ ధరించి ఉంచాలి. 8 గంటలల్లోపు ఆ మాస్క్ను తొలగించాలి. సంరక్షకులు ఆ గదిలోకి వెళ్లాల్సి వస్తే ఇద్దరూ ఎన్ 95 మాస్క్ వాడాలి.
* 1% సోడియం హైపోక్లోరైట్తో శుభ్రం చేసిన తర్వాతే మాస్క్ని పడేయాలి.
* శరీరంలో తగినంత శక్తి ఉండేందుకు వీలుగా బాధితులు విశ్రాంతి తీసుకోవడంతో పాటు, ఎక్కువ మొత్తంలో నీరు, ద్రవాలు తీసుకోవాలి.
* తుమ్ము, దగ్గు, ఉమ్ము, చీదే సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
* తరచూ చేతులను కనీసం 40 సెకెన్ల పాటు సబ్బుతో కడుక్కోవాలి.. లేదంటే ఆల్కాహాల్ ఆధారిత శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలి.
* గదిలో తరచూ వాడే వస్తువులను 1% హైపోక్లోరైట్ సొల్యూషన్తో శుభ్రం చేసుకోవాలి.
* ఆక్సీమీటర్తో ఎప్పటికప్పుడు ఆక్సిజన్ స్థాయిని పరీక్షించుకోవాలి. శరీర ఉష్ణోగ్రతలనూ నిరంతరం పరీక్షించుకుంటూ ఉండాలి. ప్రతి 4 గంటలకు లక్షణాలను గమనిస్తూ రాసిపెట్టుకోవాలి. పరిస్థితులు దిగజారుతున్నట్లు ఏమాత్రం అనిపించినా వెంటనే డాక్టర్కు చెప్పాలి.
సంరక్షకులిలా చేయాలి
* ఇంట్లో 3 పొరల మెడికల్ మాస్క్ ధరించడం తప్పనిసరి. మాస్క్ పైభాగాన్ని తాకడం లేదా చేతులతో సరిచేసుకోవడం చేయకూడదు. మాస్క్ తడిచిపోయినా, అపరిశుభ్రంగా మారినా మార్చేయాలి. అనంతరం చేతులను శుభ్రం చేసుకోవాలి. ముఖాన్ని తాకడాన్ని మానుకోవాలి.
* చేతులు సబ్బుతో శుభ్రం చేసుకున్న తర్వాత ఒక్కసారి వాడిపడేసే టిష్యూ పేపర్లతో తుడుచుకోవడం మేలు. అవి లేకపోతే ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న టవల్స్ని మాత్రమే వాడాలి.
* బాధితులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు దూరంగా ఉండాలి. వారిని ఎప్పుడైనా తాకాల్సి వస్తే.. వాడిపడేసే చేతితొడుగులు ఉపయోగించాలి.
* బాధితులు వాడే సిగరెట్లు, వంట పాత్రలు, తిండి పదార్థాలు, పానీయాలు, టవళ్లు, దుప్పట్లు లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ వినియోగించరాదు.
* బాధితులున్న గదిలోకే ఆహారం అందించాలి. చేతి తొడుగులు వేసుకుని ఆ పాత్రలను డిటర్జెంట్ సబ్బుతో శుభ్రం చేయాలి.
* కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం మాస్కులు, ఫుడ్ ప్యాకెట్లు, ఇతర వస్తువులను పడేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.