Fake News: చూడగానే నమ్మకండి!
పాత తరానికి చెందిన ప్రముఖ నటి తీవ్ర అస్వస్థతతో కన్నుమూత. ధ్రువీకరించిన వైద్యులు ఫేస్బుక్, వాట్సప్ సహా సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వచ్చిన వార్త ఇది.
సామాజిక మాధ్యమాల్లో అసత్యాల ప్రచారం
మొబైల్యాప్లతో నమ్మించేలా వక్రీకరణ
వ్యక్తులు, సంస్థలపై తీవ్ర ప్రభావం
సుమోటోగా పోలీసుల దర్యాప్తు
ఈనాడు - హైదరాబాద్
పాత తరానికి చెందిన ప్రముఖ నటి తీవ్ర అస్వస్థతతో కన్నుమూత. ధ్రువీకరించిన వైద్యులు.. ఫేస్బుక్, వాట్సప్ సహా సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వచ్చిన వార్త ఇది. ఒక ఛానల్లో ప్రసారమైందంటూ గుర్తుతెలియని వ్యక్తులు దానిని వాట్సప్ బృందాలకు పంపించారు. అది నిమిషాల్లో వేలమందికి చేరింది. సినీ ప్రముఖులు, పత్రికా విలేకరులు ఆరా తీస్తే తాను బతికే ఉన్నానని ఆమె స్వయంగా ప్రకటించారు.
ఆ చిత్రం చూస్తే అచ్చం టీవీలో వచ్చినట్లే ఉంటుంది. అందులోని విషయం అందరూ నమ్మేలా ఉంటుంది. అది ప్రముఖుల మరణ వార్త కావొచ్చు. ప్రమాద సమాచారం కావొచ్చు. అది కొందరిని ఆందోళనకు గురిచేస్తుంది. మరికొందరిని అయోమయంలోకి నెట్టేస్తుంది. వ్యక్తులపైనే కాదు సంస్థలపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. అది నిజమేనా అని నిర్ధారించుకునేలోగానే అది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టి చేయాల్సిన నష్టం చేసేస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా వార్తలు క్రమంగా పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. మొబైల్ యాప్స్ సహాయంతో సైబర్ నేరగాళ్లు ఇలాంటి బోగస్ వార్తలు సృష్టించి జనంలోకి వదులుతున్నారని తెలిపారు. హైదరాబాద్లో ఇలాంటివారిని 10 నెలల్లో 15 మందిని అరెస్ట్ చేశామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఏ వార్తనూ వెంటనే నమ్మవద్దని, విశ్వసనీయ వార్తా సంస్థల వెబ్సైట్లను, ఛానళ్లను పరిశీలించి నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.
ఇలా తెలుస్తుంది..
ఏదైనా వార్త, వీడియో నకిలీదని, అసత్యమైందని అనుమానం వచ్చిన వెంటనే సామాజిక మాధ్యమాల పరిశోధన, అభివృద్ధి విభాగం వెంటనే ఫ్యాక్ట్చెక్ పేరుతో ఆ వార్త, వీడియో నకిలీదని, దాని మూలం ఫలానాచోట ఉందని వివరిస్తుంది.
గూగుల్: వార్తలు, వీడియోలు, కార్టూన్లు, ఫొటోలను రివర్స్ ఇమేజ్, సెర్చింగ్ ద్వారా క్షణాల్లో ఆయా వార్తలు, వీడియోలు, ఫొటోల వివరాలను తెలుపుతుంది. అభ్యంతరాలపై వేగంగా నిర్ణయం తీసుకుంటుంది.
ట్విటర్: వివాదాస్పద ప్రకటనలు, మాటలు, చేష్టలు, వీడియోలను ఎవరైనా పోస్ట్ చేస్తే చాలా సందర్భాల్లో ట్విటర్ ప్రతినిధులు స్వయంగా తొలగించడంతో పాటు ఆ హ్యాండిల్పై నిషేధం విధిస్తున్నారు.
ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్: బాధితులు, వ్యక్తులు, పోలీసులు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే తొలగిస్తున్నాయి.
యూట్యూబ్: తాను అనుమతించిన కొన్ని ఛానళ్లలో అసభ్య కథనాలు, ఫొటోలు, రాజకీయ వార్తల వీడియోలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. వెంటనే తొలగించడంతోపాటు ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఎవరు అప్లోడ్ చేశారన్న సమాచారాన్ని ఇస్తోంది.
స్వయంగా వీక్షిస్తున్న సైబర్క్రైమ్ పోలీసులు
నెటిజన్ల నుంచి అందుతున్న సమాచారం, సామాజిక మాధ్యమాలను స్వయంగా వీక్షించడం ద్వారా పోలీసులు అసత్య వార్తలు, కథనాల రూపకర్తలను పట్టుకుంటున్నారు. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాల ప్రతిష్ఠకు భంగం కలిగేలా వార్తలు, కథనాలపై సైబర్ క్రైమ్ పోలీసులు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారని సంయుక్త కమిషనర్ (నేర పరిశోధన) అవినాష్ మహంతి వివరించారు. ప్రచారంతో పరువుకు భంగం కలిగిన వారు 9490616555 నంబరుకు వాట్సప్ చేయాలని తెలిపారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.
మొబైల్ యాప్ల మాయాజాలం
* అసత్య కథనాలు, వార్తలను సైబర్ నేరగాళ్లు కొన్ని మొబైల్ యాప్లతో సృష్టిస్తున్నారు. టీవీ ఛానళ్లలో వచ్చే వార్తలను ఫొటోలు తీసి, వివాదాస్పదంగా మార్చి ప్రచారం చేస్తున్నారు.
* జేఎన్టీయూ ఇంజినీరింగ్ పరీక్షలను వాయిదా వేయనందుకు నిరసనగా సునీత అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటూ వాట్సప్లో కథనాలొచ్చాయి. ట్విటర్లో మంత్రులు కేటీఆర్, సబితారెడ్డికి ట్యాగ్ చేసినట్టూ ఉంది. సునీత అంటూ పోస్ట్ చేసిన ఫొటో మరో యువతిది. ఆమె ఇంజినీరింగ్ చదవలేదని తేలింది.
* అసత్య వార్తలు, కథనాలను రూపొందిస్తున్న నిందితులు పోలీసులకు దొరక్కుండా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాల్లో అసత్య వార్తలు, కథనాలు 70 శాతం ఉన్నాయని అక్కడి సైబర్ భద్రత విభాగం అధికారులు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM