కొక్కొరొకోతో కోట్లు
బీటెక్ పూర్తవగానే ఏదో ఒక సంస్థలో రూ.లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాలని చాలామంది ఇంజినీరింగ్ విద్యార్థులు లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ గోమారం అచ్యుత్రెడ్డి (26) మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు.
సొంత బ్రాండ్తో నాటుకోడి గుడ్లు, మాంసం విక్రయాలు
దళారుల ప్రమేయం లేకుండా ప్రముఖ సంస్థలకు సరఫరా
యువ రైతు విజయ సూత్రం
ఈనాడు - సంగారెడ్డి
అచ్యుత్రెడ్డి ఫాంలో పెంచుతున్న నాటుకోళ్లు
బీటెక్ పూర్తవగానే ఏదో ఒక సంస్థలో రూ.లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాలని చాలామంది ఇంజినీరింగ్ విద్యార్థులు లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ గోమారం అచ్యుత్రెడ్డి (26) మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివిన ఆయన.. నాటుకోళ్ల పెంపకంపై దృష్టి సారించారు. రుచికరమైన, నాణ్యమైన మాంసం, గుడ్లు అందిస్తే వ్యాపారానికి ఢోకా ఉండదని భావించారు. దళారుల చేతికి చిక్కకుండా సొంత బ్రాండ్లతో అమ్మకాలు సాగిస్తూ ఏటా రూ.కోట్ల టర్నోవర్తో విజయపథంలో పయనిస్తున్నారు. నాటుకోళ్ల పెంపకంపై ఇతర రైతులకు సైతం తన వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ ఇస్తూ.. వారికీ గిట్టుబాటు అయ్యేలా చొరవ తీసుకుంటున్నారు.
2015లో మొదలుపెట్టి..
అచ్యుత్రెడ్డి హైదరాబాద్కు సుమారు 40 కి.మీ.ల దూరంలోని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చండీ గ్రామంలో మూడెకరాల్లో 2015లో 5 వేల కోళ్ల పెంపకం మొదలుపెట్టారు. దళారుల ప్రమేయం ఉండొద్దన్న ఉద్దేశంతో సొంతంగా ‘న్యూట్రీఫ్రెష్’, ‘ఎపీక్యూర్’ బ్రాండ్ల పేరుతో గుడ్లు, మాంసం విక్రయాలు ప్రారంభించారు. ప్రచారానికి వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లనూ ఉపయోగించుకున్నారు. బుధ, శుక్ర, ఆదివారాల్లో ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేస్తే ఇంటి వద్దకే తెచ్చి సరఫరా చేస్తారు. మాంసం విక్రయానికి లీషియస్, ఫిపొలా, టెండర్ కట్స్తో పాటు మరో మూడు సంస్థలతో అచ్యుత్రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రతినెలా 1,500 కిలోల మాంసం, దాదాపు 10 లక్షల గుడ్లు సరఫరా చేస్తున్నారు. 250 మంది రైతులతోనూ ఒప్పందం చేసుకున్నారు. వారు సరఫరా చేసే కోళ్ల మాంసాన్ని తన బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నారు.
ప్రాసెసింగ్ చేసిన నాటుకోడి మాంసాన్ని చూపుతున్న అచ్యుత్రెడ్డి
సరైన మార్కెటింగ్ తోనే మంచి రాబడి
* కోళ్ల మార్కెటింగే అత్యంత కీలకం. ఇప్పటికే కోళ్లను పెంచుతున్న రైతుల అనుభవాలను తెలుసుకోవాలి. అవగాహనలేకుండా ప్రారంభిస్తే నష్టాలు తప్పవు.
* 5 వేల నాటుకోళ్లకు షెడ్డు ఏర్పాటు కోసం రూ.6.50 లక్షల నుంచి రూ.7.50 లక్షల ఖర్చవుతుంది. కోళ్లు సహజ వాతావరణంలో బయట తిరిగేందుకు కనీసం ఎకరా నుంచి మూడెకరాల వరకు స్థలం అవసరం.
* ఒక్కో కోడిపిల్ల ధర రూ.20 నుంచి రూ.40 వరకు ఉంటుంది. 5 వేల పిల్లల కొనుగోలుకు, వాటిని 90 నుంచి 100 రోజుల పాటు పెంచేందుకు రూ.9 లక్షల వరకు ఖర్చవుతుంది. అప్పటికి కిలోన్నర బరువు పెరుగుతాయి. దాదాపు 8,500 కిలోల కోళ్లు తయారవుతాయి. మార్కెట్లో కిలో కోడి(లైవ్) రూ.180 చొప్పున అమ్మినా దాదాపు రూ.15 లక్షలు వస్తాయి. రెండో విడత నుంచి పెట్టుబడి తిరిగివచ్చి.. లాభాల ఆర్జన మొదలవుతుందని అచ్యుత్రెడ్డి తెలిపారు.
అందిపుచ్చుకుంటే అవకాశాలెన్నో
- అచ్యుత్రెడ్డి
నాటుకోడి గుడ్లు, మాంసానికి ఉన్న డిమాండ్నే నేను అందిపుచ్చుకున్నా. సొంత బ్రాండ్లతో అమ్మకాలు చేపట్టడం కలిసొచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.3 కోట్ల మార్కును దాటాం. ఈసారి రూ.10 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నాం. 30 మందికి ఉపాధి కల్పిస్తున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. -
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది