స్కీములే స్కాములు!
మాటలే పెట్టుబడి.. మోసమే వ్యాపారం.. సామాన్యుల ఆశలతో అవకాశవాదులు సాగిస్తున్న మోసాలెన్నో! దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే తీరు. ముఖ్యంగా తెలంగాణలో మిగతా నేరాలు తగ్గుముఖం పడుతుండగా చీటింగ్ కేసులు మాత్రం పెరుగుతున్నాయి...
నిత్యం వెలుగుచూస్తున్న అనేక మోసాలు
సామాన్యుల ఆశే మోసగాళ్లకు పెట్టుబడి..
అంతకంతకూ పెరుగుతున్న ఆర్థిక నేరాలు
ఈనాడు, హైదరాబాద్: మాటలే పెట్టుబడి.. మోసమే వ్యాపారం.. సామాన్యుల ఆశలతో అవకాశవాదులు సాగిస్తున్న మోసాలెన్నో! దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే తీరు. ముఖ్యంగా తెలంగాణలో మిగతా నేరాలు తగ్గుముఖం పడుతుండగా చీటింగ్ కేసులు మాత్రం పెరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2018లో 10,390 చీటింగ్ కేసులు నమోదవగా 2020 నాటికి అవి 12,985కు పెరిగాయి. దేశవ్యాప్తంగా పోలిస్తే రాష్ట్రంలో ప్రతి లక్షమంది జనాభాలో మోసపోతున్న వారి సగటు 34.6గా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో అస్సాం (28), కేరళ (25) ఉన్నాయి. తెలంగాణలో నూటికి 29 కేసులలో మాత్రమే శిక్ష పడుతోంది. ఒకే తరహా మోసాలు పదేపదే జరుగుతున్నా ప్రతిసారీ కొత్త బాధితులు పుట్టుకొస్తూనే ఉండడం గమనార్హం. ఇలాంటి రకరకాల మోసాలపై ‘ఈనాడు’ అందిస్తున్న వరుస కథనాల్లో ఇది మొదటిది.
1 గొలుసు కట్టు మోసాలు
‘ముందు సభ్యుడిగా చేరు. మరికొందరిని చేర్చు.. సభ్యులు పెరుగుతున్న కొద్దీ నీ లాభం రెట్టింపవుతుంది’.. దశాబ్దాలుగా జరుగుతున్న గొలుసుకట్టు మోసాల స్కీముల్లోని మూలసూత్రమిది. ఎన్ని కుంభకోణాలు బయటపడుతున్నా, ఎంతమంది మోసపోతున్నా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
* దేశవ్యాప్తంగా ఇండస్ వివా అనే సంస్థ ఇలాగే 10 లక్షలమంది నుంచి రూ. 1500 కోట్లు, ఈ బిజ్ సంస్థ 7 లక్షల మంది నుంచి రూ.వెయ్యి కోట్లు వసూలు చేశాయి.
2 పెట్టుబడితో బురిడీ
అధిక వడ్డీ ఇస్తామని చెబుతూ కొన్ని సంస్థలు పెద్దఎత్తున డిపాజిట్లు సేకరిస్తున్నాయి. ఆ సొమ్మును ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టి లాభాలు జేబులో వేసుకుంటాయి. డిపాజిటర్లకు మాత్రం కుచ్చుటోపీ పెడతాయి.
* స్వధాత్రి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ప్రజల నుంచి ఇలాగే డిపాజిట్లు వసూలు చేసి మోసం చేసింది. రూ.లక్ష అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే నెలకు 9 శాతం వడ్డీ చెల్లిస్తామని, సంవత్సరంలో అసలు తిరిగి ఇచ్చేస్తామని చెప్పింది. ఈ మాటలకు బోల్తాపడి 950 మంది రూ. 87 కోట్లు కట్టారు.
* సన్ పరివార్ గ్రూప్ రూ.లక్ష కడితే నెలకు రూ.6 వేల చొప్పున 25 నెలలపాటు తిరిగి చెల్లిస్తామని, 26వ నెలలో అసలు (రూ.లక్ష) కూడా ఇచ్చేస్తామని చెప్పింది. రూ.5 లక్షలు మించి డిపాజిట్ కట్టిస్తే వారికి 9 నెలలపాటు 3 శాతం కమీషన్ ఇస్తామంది. కొత సభ్యుల్ని చేర్పిస్తే 3 శాతం కమీషన్ ఇస్తామంటూ రూ. 158 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది.
* రూ.300 కడితే 90 రోజుల్లో రూ. 1,350, రూ.3,000 చెల్లిస్తే రూ.13,500, రూ.15,000 చెల్లిస్తే రూ.67,500 తిరిగి చెల్లిస్తామని చెబుతూ సిసిసియో డాట్కాం దేశవ్యాప్తంగా 20 వేల మంది నుంచి రూ. 50 కోట్లు వసూలు చేసింది.
3 అనుమతిలేని చిట్ఫండ్స్తో జాగ్రత్త
ఎలాంటి అనుమతిలేని చిట్ఫండ్ సంస్థల మోసాలు కొత్తకాదు. వీటికి బలయ్యేది మధ్యతరగతి ప్రజలే. కాలనీల్లో, అపార్ట్మెంట్లలో ప్రైవేటుగా చిట్టీల వ్యాపారం నడుస్తుంటుంది. మోసపోతే చట్టపరంగా రక్షణ ఉండదు. నిర్వాహకులు కొందరు చిట్టీల ద్వారా వచ్చిన డబ్బుతో స్థిరాస్తి లాంటి వ్యాపారంలో పెట్టుబడులుగా పెడుతుంటారు. దాంతో పాడుకున్న వారికి డబ్బు ఇవ్వలేక బోర్డు తిప్పేస్తుంటారు.
* రిషబ్ చిట్ ఫండ్స్ రూ.200 కోట్ల మోసానికి పాల్పడ్డట్లు హైదరాబాద్ సీసీఎస్లో 2018 డిసెంబరులో కేసు నమోదైంది.
* రూ.10 కోట్లు మోసం చేసినట్లు కేకేఆర్ చిట్ఫండ్స్పై హైదరాబాద్ పోలీసులు 2020 డిసెంబరులో కేసు నమోదు చేశారు.
4 షేర్ మార్కెట్ పేరుతో
ఫలానా సంస్థ షేర్ మరో వారంలో రెట్టింపు కాబోతోంది. కాస్త పెట్టుబడి పెట్టండి. వారం రోజుల్లోనే రూ.లక్షలు కళ్ల చూడండి అంటూ షేర్మార్కెట్ పేరిట జరుగుతున్న మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. ముంబయికి చెందిన అనుగ్రహ షేర్ ట్రేడింగ్ అనే సంస్థ పెట్టుబడులపై 4 శాతం కమిషన్ ఇస్తామంటూ ప్రజలను ఆకర్షించి దేశవ్యాప్తంగా రూ. 1500 కోట్లు వసూలు చేసింది. ఆ సంస్థపై ఈ ఏడాది జనవరిలో కేసు నమోదైంది. వందలమంది మోసపోయారు.
సభ్యుల్ని చేర్చినవారిపైనా కేసు
ముందు కొంతమంది సభ్యులను చేర్పించి, తర్వాత వారి ద్వారా వారి మిత్రులకు ఎర వేయిస్తుంటారు. గొలుసుకట్ట పథకాలు చట్ట విరుద్ధం. ఆశకుపోయి వీటిలో చేరితే ఆర్థికంగా నష్టపోవడమే కాదు నిందితులుగా నిలబడాల్సి ఉంటుంది. సభ్యులకు జరిగే నష్టానికి వారిని చేర్పించిన వారు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఫిర్యాదుకు ఆస్కారమేది?
ఇలాంటి సంస్థ ఏదైనా మన వీధిలో కనిపిస్తే.. మోసానికి తెరలేస్తోందని తెలిసినా ఫిర్యాదు చేయడానికి అవకాశం లేకపోవడం విశేషం. ఎందుకంటే.. ఏదైనా మోసం జరిగినప్పుడు మాత్రమే కేసు నమోదుకు వీలు ఉంటుంది. దీంతో ఫిర్యాదు అందేసరికే వందలమంది బాధితులుగా మారి ఉంటారు. అప్పటికే పెద్దమొత్తంలో నిధులు దారి మళ్లి ఉంటాయి. ఇటువంటి సంస్థ ఏదైనా బోర్డు పెట్టగానే పోలీసులు కేసు నమోదు చేసేందుకు వెళితే తమకు రకరకాల అనుమతులు ఉన్నాయని బుకాయిస్తారు.
జాగ్రత్త పడితేనే మేలు
* చిన్నచిన్న సంస్థలు ఆశపెట్టే అధిక వడ్దీకి ఆశపడే ముందు పెద్ద బ్యాంకులు ఎందుకంత ఇవ్వలేకపోతున్నాయో గమనించాలి.
* గుర్తింపు పొందిన చిట్ఫండ్స్లో చేరితే పెట్టిన డబ్బు ఎక్కడికీ పోదు. కానీ అనధికారిక చిట్స్ పరిస్థితి అలా కాదు.
* లాభాలకు ఆశపడి.. బోగస్ సంస్థల ప్రకటనలను నమ్మితే బోల్తా పడడం ఖాయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. -
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్