అంతర్రాష్ట్ర మార్గాలు మరింత సుగమం
దేశంలోని వివిధ రాష్ట్రాలతో తెలంగాణ రహదారి అనుసంధానత మరింత విస్తరించనుంది. వివిధ రాష్ట్రాల మధ్య సరకు, ప్రజారవాణాను మరింత పెంచేందుకు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గతిశక్తి పథకంతో తెలంగాణలోని అయిదు జాతీయ రహదారుల విస్తరణకు మార్గం సుగమమైంది
తెలంగాణలో 848 కిలోమీటర్ల మేర అనుసంధానత
రూ. 24,053 కోట్లతో రహదారుల విస్తరణ
పీఎం గతిశక్తి పథకంలో అయిదు దారులు
ఈనాడు - హైదరాబాద్
దేశంలోని వివిధ రాష్ట్రాలతో తెలంగాణ రహదారి అనుసంధానత మరింత విస్తరించనుంది. వివిధ రాష్ట్రాల మధ్య సరకు, ప్రజారవాణాను మరింత పెంచేందుకు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గతిశక్తి పథకంతో తెలంగాణలోని అయిదు జాతీయ రహదారుల విస్తరణకు మార్గం సుగమమైంది. ఈ దిశగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రణాళిక రూపొందించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెలంగాణ మీదుగా వివిధ రాష్ట్రాలను అనుసంధానిస్తూ ఉన్న రహదారులను ఎక్స్ప్రెస్వేలుగా మార్చనుంది. ఆయా మార్గాల్లో సరకు రవాణా ఇప్పటికే భారీగా సాగుతోంది. ఈ రహదారుల విస్తరణతో రవాణా సదుపాయాలు మెరుగవనున్నాయి. కేంద్రం అధ్యయనం చేసి దేశంలో సరకు రవాణా పెద్ద ఎత్తున సాగే అయిదు మార్గాలను ఎంపిక చేసింది. వాటన్నిటినీ నాలుగు/ఆరు వరుసలకు విస్తరించనున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రెండు నుంచి నాలుగు వరుసల రహదారులున్నాయి.
ఆర్థిక కారిడార్లు
పీఎం గతిశక్తి పథకానికి ఎంపిక చేసిన మార్గాలను తెలంగాణలోని వివిధ ప్రాంతాల మీదుగా 848 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. వీటి వ్యయ అంచనా రూ. 24,053 కోట్లు. వాటిలో నాగ్పుర్-విజయవాడ కారిడార్ కీలకం. మంచిర్యాల, వరంగల్, ఖమ్మం మీదుగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దునున్న విజయవాడ రహదారిలో ఇది విలీనమవుతుంది. అయిదు ప్యాకేజీలుగా ఈ విస్తరణ పనులు పూర్తి చేయనున్నారు. వరంగల్-ఖమ్మం, ఖమ్మం-విజయవాడ మార్గాల విస్తరణ ప్రణాళిక తుది దశలో ఉంది. ఈ కారిడార్లోని మంచిర్యాల-రేపల్లెవాడ మీదుగా మహారాష్ట్ర సరిహద్దు వరకు గతంలో చేపట్టిన విస్తరణ పనులను ఈ పథకంలో కలిపారు. సుమారు 95 కిలోమీటర్లున్న ఈ మార్గం పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి కానున్నాయి. మిగిలిన మూడు ప్యాకేజీల సవివర నివేదికలు త్వరలో కొలిక్కి రానున్నాయి. హైదరాబాద్-విశాఖపట్నం కారిడార్లోని 59 కిలోమీటర్లున్న సూర్యాపేట-ఖమ్మం రహదారి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఖమ్మం నుంచి దేవరపల్లి రహదారి విస్తరణకు వీలుగా భూ సేకరణ కసరత్తు సాగుతోంది. తెలంగాణలోని బెల్లంపల్లి నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 65 కిలోమీటర్ల మేర విస్తరణకు వీలుగా అలైన్మెంటును కన్సల్టెన్సీ సంస్థ సిద్ధం చేస్తోంది. ఇండోర్-హైదరాబాద్ మార్గాన్ని మూడు ప్యాకేజీలుగా సిద్ధం చేస్తున్నారు.
ఎకనామిక్ కారిడార్
ఆర్థికంగా విస్తృత అవకాశాలున్న మార్గాలను కేంద్రం ఎకనామిక్ కారిడార్గా గుర్తించింది. రానున్న అయిదేళ్ల వ్యవధిలో ఈ మార్గాల్లో 25 శాతం మేర సరకు రవాణా పెరుగుతుందని అంచనా. తొలిదశలో దేశవ్యాప్తంగా తొమ్మిది వేల కిలోమీటర్ల మేర రహదారులను విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో తెలంగాణలోని 548 కిలోమీటర్లను ఎంపిక చేసింది.
ఇంటర్ కారిడార్ రూట్
రెండు రాష్ట్రాలు లేదా రెండు కారిడార్ల మధ్య భారీగా ట్రాఫిక్ రద్దీ ఉన్న వాటిని ఇంటర్ కారిడార్ రూట్లుగా కేంద్రం గుర్తించింది. ఇందులో దేశవ్యాప్తంగా ఎనిమిది వేల కిలోమీటర్ల రహదారులను గుర్తించింది. తొలిదశలో ఆరు వేల కిలోమీటర్ల మేర విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో తెలంగాణలోని మూడు వందల కిలోమీటర్ల మార్గాన్ని ఎంపిక చేసింది.
మార్చి నాటికి ప్రాంతీయ రింగ్ రోడ్డు పనులు ప్రారంభం!
హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు అవతల నుంచి నిర్మించనున్న ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు జాతీయ రహదారుల సంస్థ కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి గుత్తేదారును ఎంపిక చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలన్న యోచనలో ఉంది. ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్)ను రెండు భాగాలుగా నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. 158 కిలోమీటర్ల ఉత్తర భాగాన్ని తొలుత నిర్మించేందుకు అవసరమైన భూ సేకరణకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఆ మేరకు భూసేకరణ నోటిఫికేషన్లు సైతం ఒకదాని తరవాత మరొకటి జారీ అవుతున్నాయి. తెలంగాణలో వచ్చే మార్చి నాటికి మొత్తం 715 కిలోమీటర్లకు సంబంధించిన రహదారుల విస్తరణ పనులు చేపట్టాలన్నది జాతీయ రహదారుల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంతో సహా పది మార్గాలున్నాయి. ఈ రహదారుల నిర్మాణానికి సుమారు రూ.28,615 కోట్ల వ్యయం అవుతుందన్నది అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. -
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్