రేపు అల్పపీడనం

బంగాళాఖాతంలో ఈ నెల 19న(శుక్రవారం) అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో

Published : 18 Aug 2022 05:07 IST

ఈనాడు, హైదరాబాద్‌ : బంగాళాఖాతంలో ఈ నెల 19న(శుక్రవారం) అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. బుధవారం పగలు కొన్నిచోట్ల స్వల్పంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా వరంగల్‌ జిల్లా కాశీబుగ్గలో 2, ఊరుగొండలో 1.8, గీసుకొండలో 1.5, చెన్నూరు(మంచిర్యాల)లో 1.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉష్ణోగ్రత సాధారణంకన్నా 3 నుంచి 4 డిగ్రీలు అదనంగా పెరగడంతో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని