నేడు ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో మంత్రుల పర్యటన

పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీ రామారావు, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి సోమవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు.

Published : 26 Sep 2022 04:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీ రామారావు, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి సోమవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 9 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా బయల్దేరి జైనథ్‌ మండలం దీపాయిగూడకు చేరుకుంటారు. అక్కడ మాతృవియోగంతో ఉన్న ఎమ్మెల్యే జోగు రామన్నను పరామర్శిస్తారు. అనంతరం ఆదిలాబాద్‌లోని బీడీఎన్‌టీ డాటా సొల్యూషన్‌ను సందర్శించి అక్కడి ఉద్యోగులతో మాట్లాడతారు. తర్వాత నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీని సందర్శించి విద్యార్థులతో భేటీ అవుతారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశాక మంత్రి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని