సుద్దముక్క అక్షరాలతో జాతీయ గీతం..!

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్నూర్‌కు చెందిన మధుకర్‌(28) సుద్దముక్కలనే అక్షరాలుగా చేసి జాతీయ గీతాన్ని మూడు భాష(హిందీ, తెలుగు, ఆంగ్లం)ల్లో బ్లాక్‌బోర్డులపై అతికించారు.

Published : 26 Jan 2023 04:24 IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్నూర్‌కు చెందిన మధుకర్‌(28) సుద్దముక్కలనే అక్షరాలుగా చేసి జాతీయ గీతాన్ని మూడు భాష(హిందీ, తెలుగు, ఆంగ్లం)ల్లో బ్లాక్‌బోర్డులపై అతికించారు. ఇందుకోసం ఆయన 15 రోజులు శ్రమించారు. చిత్రలేఖనం, వ్యర్థాలతో సుందర అలంకరణ, ఒకేసారి రెండు చేతులతో రాయడం తదితర కళలను ప్రదర్శిస్తూ రాష్ట్రస్థాయిలో మధుకర్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

న్యూస్‌టుడే, మద్నూర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని