Delhi liquor policy case: అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఈ కేసులో ఏ-7గా ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్ పెనక శరత్చంద్రారెడ్డి (వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు) అప్రూవర్గా మారారు.
దిల్లీ మద్యం కేసులో ప్రత్యేక న్యాయస్థానం క్షమాభిక్ష
ఆయన సాక్ష్యాల ఆధారంగా ఇకపై విచారణ
ప్రముఖుల పాత్రను నిరూపించే ఎత్తుగడ
ఈనాడు - దిల్లీ
దిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఈ కేసులో ఏ-7గా ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్ పెనక శరత్చంద్రారెడ్డి (వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు) అప్రూవర్గా మారారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలను స్వచ్ఛందంగా వెల్లడించడానికి తాను సిద్ధమేనని, అప్రూవర్గా మారేందుకు అనుమతించాలని శరత్చంద్రారెడ్డి సమర్పించిన అభ్యర్థనను ఇక్కడి రౌజ్ అవెన్యూలోని సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఆమోదించి క్షమాభిక్ష ప్రసాదించింది. ఫలితంగా ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, వారి పాత్రలేంటి, నేరం జరిగిన విధానం తదితర అంశాలపై ఆయన దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇవ్వనున్నారు. దాని ఆధారంగా భవిష్యత్తులో కీలక పరిణామాలు చోటుచేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. శరత్చంద్రారెడ్డి, వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ్, భారాస ఎమ్మెల్సీ కవితలు సౌత్గ్రూప్ను తెరవెనుక ఉండి నడిపించారని.. ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపులిచ్చి, మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారు చేయించుకున్నారన్నది ప్రధాన అభియోగం. ఇందులో మనీల్యాండరింగ్ జరిగిందని ఆరోపిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. మద్యం కుంభకోణంలో శరత్ కీలక వ్యక్తి అని ఈడీ ఇదివరకు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది.‘దిల్లీ మద్యం విధానం ప్రకారం ఏ వ్యక్తీ రెండు రిటైల్ జోన్లకు మించి నియంత్రించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా శరత్చంద్రారెడ్డి తన సొంత, బినామీ సంస్థల ద్వారా తొమ్మిది రిటైల్జోన్లను నియంత్రిస్తున్నారు. తయారీదారులు, టోకు, చిల్లర వ్యాపారులతో కలిపి సౌత్గ్రూప్ పేరుతో ఏర్పాటైన అతిపెద్ద సిండికేట్లో శరత్చంద్రారెడ్డి ప్రధాన భాగస్వామి’ అని ఈడీ పేర్కొంది.
అత్యున్నతస్థాయి వ్యూహంతోనే!
దిల్లీ మద్యం కేసులో వివిధ రాజకీయపార్టీలకు చెందిన పెద్ద నేతల ప్రమేయాన్ని బలంగా నిరూపించడానికే అత్యున్నతస్థాయి వ్యక్తుల ప్రోద్బలంతో శరత్రెడ్డి అప్రూవర్గా మారినట్లు కథనాలు వినిపిస్తున్నాయి.
నవంబరులో అరెస్టు.. తర్వాత బెయిల్
2022 నవంబరు 10వ తేదీ అర్ధరాత్రి 12.20 గంటలకు శరత్రెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. 2023 మే 8న దిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు జనవరి 27న ఆయన నాయనమ్మ అంత్యక్రియల కోసం 14 రోజులపాటు మధ్యంతర బెయిల్ పొందారు. తర్వాత భార్య అనారోగ్యం కారణంగా ఏప్రిల్ 1న కోర్టు నాలుగు వారాల బెయిల్ ఇచ్చింది. తర్వాత తనకు అనారోగ్య సమస్యలున్నాయంటూ అపోలో ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా శరత్ దిల్లీ హైకోర్టులో దరఖాస్తు చేసుకుని.. పూర్తిస్థాయి బెయిల్ పొందారు. దిల్లీ మాజీ మంత్రి సత్యేంద్రజైన్ అనారోగ్య సమస్యలపై బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు దిల్లీలోని ప్రభుత్వాసుపత్రులు ఇచ్చిన ధ్రువీకరణపత్రాలపై తమకు అనుమానం ఉందని, అందువల్ల ఎయిమ్స్లో పరీక్షలు చేయించి.. నిర్ణయం తీసుకోవాలని ఈడీ న్యాయవాదులు వాదించారు. కానీ అంతకుముందు దిల్లీ హైకోర్టులో శరత్రెడ్డి బెయిల్ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించారు. అనారోగ్య కారణాల వల్ల నిందితులకు బెయిల్ ఇవ్వడం సాధారణమేనని, కోర్టు సంతృప్తి చెందితే తగిన ఉత్తర్వులు జారీచేయొచ్చని చెప్పారు. ఆయన మధ్యంతర బెయిల్పై ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేయలేదని, సాక్ష్యాలను చెరిపేసేందుకూ ప్రయత్నించలేదని కూడా సమర్థించారు.
అప్రూవర్గా మారితే..
శరత్రెడ్డిని ఇకపై నిందితుడిగా కాకుండా సాక్షిగా/అప్రూవర్గా చూపుతారు. ప్రాసిక్యూషన్ సమయంలో మిగతా నిందితులకు వ్యతిరేకంగా ఈయన సాక్ష్యం చెప్పే వీలు ఉంటుంది. నేరంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాల్గొన్న వారు అప్రూవర్గా మారినప్పుడు సీఆర్పీసీ సెక్షన్ 306 కింద చట్టపరంగా క్షమాభిక్ష ప్రసాదిస్తారు. ఇందుకు ప్రతిఫలంగా ఆ వ్యక్తి.. నేరం జరిగిన తీరు, అందులో వ్యక్తుల ప్రమేయం, అందుకు సాక్ష్యాలు, ఇతర అంశాలను దర్యాప్తు సంస్థలకు అందించి సహకరించాల్సి ఉంటుంది. దర్యాప్తు, విచారణ ఏ దశలో ఉన్నప్పుడైనా క్షమాభిక్ష ప్రసాదించొచ్చు. నేరానికి సంబంధించి సంపూర్ణమైన వాస్తవాలు వెల్లడించాలన్న షరతుతోనే కోర్టు అప్రూవర్లకు క్షమాభిక్ష ప్రసాదిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం