సరిహద్దుల్లోకి ఏనుగుల మంద
మహారాష్ట్ర నుంచి ఇరవై రోజుల క్రితం రాష్ట్రంలోకి వచ్చిన ఏనుగు ఇద్దరు రైతుల ప్రాణాల్ని బలిగొంది. అది సంచరించిన గ్రామాల్లో.. ప్రజలను భయాందోళనలకు గురిచేసింది.
రాష్ట్రంలోకి ప్రవేశిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అటవీశాఖ వర్క్షాప్
అవి సంచరించే గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయం
వెనక్కి పంపడంపై దృష్టి
ఈనాడు, హైదరాబాద్: మహారాష్ట్ర నుంచి ఇరవై రోజుల క్రితం రాష్ట్రంలోకి వచ్చిన ఏనుగు ఇద్దరు రైతుల ప్రాణాల్ని బలిగొంది. అది సంచరించిన గ్రామాల్లో.. ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. అధికారులు అతికష్టమ్మీద ఆ ఏనుగును తిరిగి మహారాష్ట్రకు పంపించారు. అలా వెళ్లిన ఏనుగు ఇప్పుడు ఓ పెద్ద గుంపును తీసుకొస్తోంది. ప్రస్తుతం తెలంగాణ సరిహద్దుల్లో ఈ మంద సంచరిస్తున్నట్లు రాష్ట్ర అటవీశాఖకు మహారాష్ట్ర అధికారుల నుంచి సమాచారం వచ్చింది. ఈ మంద రాష్ట్రంలో ప్రవేశించే అవకాశాలు అధికంగా ఉండడంతో అటవీశాఖ అప్రమత్తమైంది. ఆ మంద వస్తే ఏర్పడే సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై హైదరాబాద్ దూలపల్లిలోని అటవీ అకాడమీలో సోమవారం అటవీ ముఖ్య సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్ అధికారులతో వర్క్షాప్ నిర్వహించారు. సరిహద్దు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాత్రివేళ అధిక సంచారం
ఏనుగులు రాత్రి వేళలోనే ఎక్కువగా తిరిగే అవకాశం ఉన్న దృష్ట్యా.. అవి సంచరించే గ్రామాల్లో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ప్రజలు పంటపొలాల్లోకి వెళ్లకుండా ప్రచారం చేయాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనట్లు తెలిసింది. ప్రజలు, రైతులకు ఎలాంటి హాని చేయకముందే వాటిని తిరిగి మహారాష్ట్రకు ఏ విధంగా పంపించాలన్న విషయంపై పలువురు అధికారులు సూచనలు చేశారు. ఏనుగుల కదలికల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అధునాతన సాంకేతిక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆర్.ఎం.డోబ్రియాల్ స్పష్టం చేశారు. ఒడిశాలో పెద్దసంఖ్యలో ఉన్న ఏనుగుల్లో కొన్ని ఛత్తీస్గఢ్కు వెళ్లి అక్కడ సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఎదురైన అనుభవాలను ఛత్తీస్గఢ్ రిటైర్డ్ పీసీసీఎఫ్ నర్సింహారావు వర్క్షాప్లో వివరించారు. ఏనుగులను ఎలా నియంత్రించాలి? ఎలాంటి రక్షణ వాహనాలు ఉపయోగించాలి.. వంటి వివరాల్ని తెలిపారు. శబ్దాలతో భయపెట్టే ప్రత్యేక బృందంతోనే సమస్య పరిష్కారం కాదని, ఆ చర్యలు ఏనుగుల్ని పక్కకు పంపించడానికే ఉపయోగకరమని.. అవి వెనక్కి వస్తే ఏం చేయలేమని స్పష్టంచేశారు. ఇతర విధానాలపైనా దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్, ప్రొటెక్షన్-విజిలెన్స్, కంపా)లు ఎంసీ ఫర్గయిన్, ఈలుసింగ్ మేరు, సువర్ణ, అదనపు పీసీసీఎఫ్ సునీతా భగవత్, జిల్లాల అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
నాలుగో రోజూ 46 డిగ్రీలపైనే..
రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. శుక్రవారం 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. -
రిజిస్ట్రార్ కోర్టు ముందు లిస్ట్ కావాల్సిన కేసు ఇక్కడికెలా వచ్చింది?
ప్రస్తుతం తెలంగాణలో విచారణ జరుగుతున్న ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ భారాస నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జులైకి వాయిదా వేసింది. -
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. -
‘టానిక్’కు మినహాయింపుల్లోనే మతలబు!
రాష్ట్రంలో ఎలైట్ వైన్షాప్ ‘టానిక్’ ఏర్పాటు సమయంలో ఇచ్చిన వెసులుబాట్లలోనే మతలబు ఉన్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ధారణకు వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
ఆరు రోజులుగా నక్కి.. ఎరకు చిక్కి
శంషాబాద్ విమానాశ్రయ రన్వే మైదానంలోకి గత నెల 27న చొరబడి అందరినీ కంగారుకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. -
వామనరావు దంపతుల హత్య కేసు.. సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని హైవేలో 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యకేసు దర్యాప్తును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
కోర్టులో నేరుగా హాజరుపరచాలని కవిత దరఖాస్తు
ప్రస్తుతం దిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ముందు విచారణ జరిగే సమయంలో తనను నేరుగా హాజరుపరచాలంటూ భారాస ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు దాఖలుచేశారు. -
సులభతర వాణిజ్య విధానంలో మరిన్ని సంస్కరణలు
సులభతర వాణిజ్య విధానం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-ఈఓడీబీ)లో అత్యుత్తమ సేవలు కొనసాగించాలని, ఇందుకోసం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశించారు. -
నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై చర్యలు
తెలంగాణలో నిబంధనలను ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. ఇంటర్ విద్యామండలి ఆదేశాలను విస్మరించి వేసవి సెలవుల్లో కళాశాలలను నిర్వహించడం, ప్రవేశాలు కల్పించినందుకుగాను ఒక్కో కళాశాలపై రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వం కోరితే.. పదోన్నతులకు టెట్ మినహాయింపునిస్తాం
తెలంగాణలో 2010 కన్నా ముందు నియమితులై 1 నుంచి 5 తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే ఉత్తర్వులిస్తామని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఛైర్మన్ యోగేశ్ సింగ్ తెలిపారు. -
టెట్ పరీక్షల షెడ్యూలు విడుదల
ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 షెడ్యూలును విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. -
6న ఈసెట్
టీఎస్ ఈసెట్-2024 ప్రవేశ పరీక్ష మే 6వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. -
ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు
ఎండల తీవ్రత దృష్ట్యా జాతీయ ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. -
ఆర్టీసీ రిజర్వేషన్ ఛార్జీలపై మినహాయింపు
దూరప్రాంత బస్ సర్వీసుల్లో రిజర్వేషన్ ఛార్జీలపై టీఎస్ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. -
40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.32 వేలు, గరిష్ఠంగా రూ.2,95,460 ఉండాలని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర గెజిటెడ్ అధికారుల (టీజీవోల) సంఘం కోరింది. -
రోహిత్ వేముల ఆత్మహత్య కేసు పునర్విచారణ
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో ముఖ్య పరిమాణం చోటుచేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో కీలక మలుపు తిరిగింది. -
హెచ్సీయూ వీసీ, నేతలపై నమోదైన కేసులో ఆధారాల్లేవు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!