ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు

ఎండల తీవ్రత దృష్ట్యా జాతీయ ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ అనితా రామచంద్రన్‌ ఆదేశించారు.

Published : 04 May 2024 05:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎండల తీవ్రత దృష్ట్యా జాతీయ ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ అనితా రామచంద్రన్‌ ఆదేశించారు. శుక్రవారం ఆమె జిల్లా పంచాయతీ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  ఉపాధి హామీ కూలీలకు నీడ, తాగునీరు అందించాలని సూచించారు. ఆశా కార్యకర్తలు  ఆరోగ్య కేంద్రాల సమన్వయంతో కూలీలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను పంపిణీ చేయాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని