Sirivennela Seetharama Sastry: పాట.. తరలిపోయింది!
‘‘తేనెలొలికే పూలబాలలకు మూణ్నాళ్ల ఆయువిచ్చినవాడినేది కోరేది.. బండరాలను చిరాయువుగా జీవించమని ఆనతిచ్చినవాడినేది కోరేది!!’’ అని ప్రశ్నించారాయన.తేనెలొలికే తెలుగు పదాలతో కొండంత భావాన్ని పలికించి
ముగిసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు
ఫిలింఛాంబర్లో భౌతికకాయానికి ప్రముఖుల నివాళి
కడసారి చూసేందుకు వచ్చిన అభిమానులు
సిరివెన్నెల పార్ధివదేహంతో మహాప్రస్థానానికి బయలుదేరిన వాహనం
‘‘తేనెలొలికే పూలబాలలకు మూణ్నాళ్ల ఆయువిచ్చినవాడినేది కోరేది.. బండరాలను చిరాయువుగా జీవించమని ఆనతిచ్చినవాడినేది కోరేది!!’’ అని ప్రశ్నించారాయన.
తేనెలొలికే తెలుగు పదాలతో కొండంత భావాన్ని పలికించి.. తీయటి పాటలను పేటికలకొద్దీ అందించిన ఆయన కూడా తెలుగువారికి ఆ ముచ్చటను మూణ్నాళ్లకే ముగించి వెళ్లిపోయారు.
ఈనాడు డిజిటల్, హైదరాబాద్, రాయదుర్గం, ఫిలింనగర్, న్యూస్టుడే: బతుకు నేర్పిన పాట నేలకొరిగింది.. భరోసానిచ్చిన మాట మూగబోయింది.. ప్రశ్నించిన గొంతు ఆగిపోయింది.. కనిపించని తీరాలకు తరలిపోయింది.. అది ఇక తిరిగి రాదని తెలిసిన మనసులెన్నో మూగగా విలపించాయి.. ఆ కట్టె కాలిపోతుంటే ఇదంతా అబద్ధమైతే బావుండని అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. సినీ రచయిత, పాటల రేడు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం బుధవారం ఉదయం ఫిలింఛాంబర్లో ఉంచారు. కడసారి చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున అభిమానులు బారులు తీరారు. సినీ, రాజకీయ ప్రముఖులు సీతారాముడికి ఘనంగా నివాళులర్పించి కుటుంబసభ్యులకు ఓదార్చారు. తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్రావు ఆయన పార్ధివదేహానికి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రి పేర్ని నాని హాజరై సిరివెన్నెల కుటుంబాన్ని ఓదార్చారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్ధివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రులు హరీశ్, తలసాని
అడుగడుగునా నీరాజనం
రాయదుర్గం మహాప్రస్థానంలో సిరివెన్నెలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఫిలింఛాంబర్ నుంచి పద్మాలయ స్టూడియో రోడ్డు, నార్నే రోడ్డు మీదుగా పెద్దఎత్తున తరలివచ్చిన అభిమానుల నడుమ అంతిమయాత్ర సాగింది. పెద్దకుమారుడు యోగేశ్వర్ తండ్రి చితికి నిప్పంటించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, తమ్మారెడ్డి భరద్వాజ, ప్రజాగాయకులు గద్దర్, విమలక్క, గాయకుడు మనో, పలువురు కవులు, సినీ ప్రముఖులు అంత్యక్రియలు పూర్తయ్యే దాకా అక్కడే ఉన్నారు.
ఎందరికో స్ఫూర్తి: మంత్రి తలసాని
తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ విషాదకరమైన రోజిది. ఆయన ప్రతి పాటా అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తి.
చైతన్యం రగిలించిన వ్యక్తి: మంత్రి హరీశ్రావు
ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు, సాహిత్య రంగానికి తీరని లోటు. ఆయన పండితులను, పామరులను మెప్పించగలిగిన గొప్ప వ్యక్తి. ద్వంద్వార్థాలు లేకుండా పాటలు రాసిన మంచి వ్యక్తి. సమాజంలో గొప్ప చైతన్యం రగిలించిన ధీశాలి.
చెరగని ముద్ర: ఏపీ మంత్రి పేర్ని నాని
తెలుగు అక్షరాలు 56. తెలుగు నేర్పిన ప్రతి వాడికీ అవే మూలం. అలాంటి అక్షరాలతో పద విన్యాసం చేసి ప్రతి తెలుగువాడి మదిలో చెరగని ముద్రవేసిన వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్రెడ్డి తరఫున ఘన నివాళి అర్పిస్తున్నాం.
సిరివెన్నెల కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండ
ఈనాడు, అమరావతి: సిరివెన్నెల సీతారామశాస్త్రి చికిత్సకైన ఖర్చు రూ.27 లక్షలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించనుంది. ఇంటి స్థలమూ కేటాయించి, ఆ కుటుంబానికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు.
తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నివాళి
సిరివెన్నెల సీతారామశాస్త్రి లేరనే విషయం వింటేనే ఎంతో బాధ కలుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన సీతారామశాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళుర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
నాలుగో రోజూ 46 డిగ్రీలపైనే..
రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. శుక్రవారం 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. -
రిజిస్ట్రార్ కోర్టు ముందు లిస్ట్ కావాల్సిన కేసు ఇక్కడికెలా వచ్చింది?
ప్రస్తుతం తెలంగాణలో విచారణ జరుగుతున్న ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ భారాస నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జులైకి వాయిదా వేసింది. -
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. -
‘టానిక్’కు మినహాయింపుల్లోనే మతలబు!
రాష్ట్రంలో ఎలైట్ వైన్షాప్ ‘టానిక్’ ఏర్పాటు సమయంలో ఇచ్చిన వెసులుబాట్లలోనే మతలబు ఉన్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ధారణకు వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
ఆరు రోజులుగా నక్కి.. ఎరకు చిక్కి
శంషాబాద్ విమానాశ్రయ రన్వే మైదానంలోకి గత నెల 27న చొరబడి అందరినీ కంగారుకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. -
వామనరావు దంపతుల హత్య కేసు.. సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని హైవేలో 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యకేసు దర్యాప్తును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
కోర్టులో నేరుగా హాజరుపరచాలని కవిత దరఖాస్తు
ప్రస్తుతం దిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ముందు విచారణ జరిగే సమయంలో తనను నేరుగా హాజరుపరచాలంటూ భారాస ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు దాఖలుచేశారు. -
సులభతర వాణిజ్య విధానంలో మరిన్ని సంస్కరణలు
సులభతర వాణిజ్య విధానం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-ఈఓడీబీ)లో అత్యుత్తమ సేవలు కొనసాగించాలని, ఇందుకోసం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశించారు. -
నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై చర్యలు
తెలంగాణలో నిబంధనలను ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. ఇంటర్ విద్యామండలి ఆదేశాలను విస్మరించి వేసవి సెలవుల్లో కళాశాలలను నిర్వహించడం, ప్రవేశాలు కల్పించినందుకుగాను ఒక్కో కళాశాలపై రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వం కోరితే.. పదోన్నతులకు టెట్ మినహాయింపునిస్తాం
తెలంగాణలో 2010 కన్నా ముందు నియమితులై 1 నుంచి 5 తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే ఉత్తర్వులిస్తామని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఛైర్మన్ యోగేశ్ సింగ్ తెలిపారు. -
టెట్ పరీక్షల షెడ్యూలు విడుదల
ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 షెడ్యూలును విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. -
6న ఈసెట్
టీఎస్ ఈసెట్-2024 ప్రవేశ పరీక్ష మే 6వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. -
ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు
ఎండల తీవ్రత దృష్ట్యా జాతీయ ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. -
ఆర్టీసీ రిజర్వేషన్ ఛార్జీలపై మినహాయింపు
దూరప్రాంత బస్ సర్వీసుల్లో రిజర్వేషన్ ఛార్జీలపై టీఎస్ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. -
40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.32 వేలు, గరిష్ఠంగా రూ.2,95,460 ఉండాలని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర గెజిటెడ్ అధికారుల (టీజీవోల) సంఘం కోరింది. -
రోహిత్ వేముల ఆత్మహత్య కేసు పునర్విచారణ
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో ముఖ్య పరిమాణం చోటుచేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో కీలక మలుపు తిరిగింది. -
హెచ్సీయూ వీసీ, నేతలపై నమోదైన కేసులో ఆధారాల్లేవు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!