Subhash Chandra Bose: బ్రిటిష్ను బోల్తా కొట్టించిన బోస్
కాంగ్రెస్లో అంతఃకలహాలతో విసిగి వేసారిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విదేశీ సాయంతో ఆంగ్లేయులపై సాయుధ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తెలివిగా తెల్లవారి కళ్లుగప్పి గృహనిర్బంధం నుంచి తప్పించుకోవడమే కాకుండా..
కాంగ్రెస్లో అంతఃకలహాలతో విసిగి వేసారిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విదేశీ సాయంతో ఆంగ్లేయులపై సాయుధ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తెలివిగా తెల్లవారి కళ్లుగప్పి గృహనిర్బంధం నుంచి తప్పించుకోవడమే కాకుండా.. ఏకంగా దేశం సరిహద్దులు దాటేశారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వదులుకున్న తర్వాత దాదాపు ఒంటరైనా.. తన పోరాటాన్ని ఆపలేదు నేతాజీ. విదేశీ సాయం లేనిదే బ్రిటిష్వారిని పారదోలలేమని నమ్మిన ఆయన- రష్యా, జర్మనీ, జపాన్ల సహకారం కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. సరైన సమయం కోసం వేచిచూస్తున్నారంతే! మరోవైపు నేతాజీ విప్లవ పంథా గురించి తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను ఎప్పుడెప్పుడు అరెస్టు చేయాలా అని ఎదురుచూస్తోంది. కోల్కతాలో నిరసన ప్రదర్శనను సాకుగా చూపుతూ... 1940 జులై 2న ఆయన్ను అరెస్టు చేసి జైల్లో వేశారు. రాజద్రోహ నేరం కూడా మోపారు. విచారణ మొదలవటానికి ముందే.. వ్యూహాత్మకంగా బోస్ జైల్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీక్ష వారం రోజులు దాటి... ఆయన ఆరోగ్యం పాడవుతుండటంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి. బోస్కేమైనా అయితే బెంగాల్తో పాటు యావద్దేశం ఎలా ప్రతిస్పందిస్తుందో తెలిసిన ఆంగ్లేయులు డిసెంబరులో ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు. కోల్కతాలోని తన ఇంట్లోనే గృహనిర్బంధంలో ఉంచారు.
ఆ మాత్రం అవకాశం చాలనుకున్న నేతాజీ తన వ్యూహాలకు మరింత పదును పెట్టారు. తొలుత అఫ్గానిస్థాన్కు, తర్వాత సోవియట్ యూనియన్ మీదుగా జర్మనీకి వెళ్లాలనుకున్నారు. దీనికి అనుగుణంగా పావులు కదపటం మొదలెట్టారు. తప్పించుకోవటానికి కొద్దివారాల ముందు నుంచే... సందర్శకులను, బంధువులను కలవటం ఆపేశారు. ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడుతున్నారనే భావన కలిగించారు. బ్రిటిష్ గార్డులను చూడటానికీ ఇష్టపడేవారు కాదు. తన అన్న కుమారుడు శిశిర్ బోస్ ఒక్కడే రోజూ వచ్చి రాత్రిదాకా ఆయనతో గడిపి వెళ్లేవాడు. ఇదే సమయంలో.. తన రూపు రేఖలు మారేలా గడ్డం పెంచారు. చాలారోజులుగా చూడనివారు ఒక్కసారిగా చూస్తే ఈయన బోస్ అని గుర్తుపట్టలేనంతగా! ఇలా... శిశిర్ తప్ప మరెవరినీ కలవకుండా ఏకాంతంగా ఉండటం నిత్యకృత్యమైంది. ఆంగ్లేయ భద్రతాసిబ్బంది కూడా దీనికి అలవాటు పడ్డారు.
అలా అంతా రోజువారీ తంతులో మునిగితేలుతున్న వేళ... 1941 జనవరి 16న - తప్పించుకునే ప్రణాళికకు బోస్ ముహూర్తం పెట్టేశారు. నల్లని జర్మన్ వాండరర్ కారులో శిశిర్ రాత్రిపూట బోస్ను కలిసేందుకు ఎప్పటిలాగే వచ్చారు. ముస్లింలు ధరించే టోపీ, దుస్తులతో బోస్ సిద్ధంగా ఉన్నారు. రాత్రి ఒకటిన్నర సమయంలో బయటకు వచ్చిన శిశిర్.. డ్రైవర్ సీటులో కూర్చొని తనవైపు డోర్ను సెంట్రీలకు వినిపించేలా బలంగా వేశారు. ఒకే డోర్ శబ్దం వినిపించిన సెంట్రీలు ఒక్కరే ఎక్కారనుకొని నిర్లిప్తంగా ఉండిపోయారు. వెనక డోర్లోంచి బోస్ సైతం నక్కి కూర్చున్నారనే సంగతి గుర్తించలేదు. డోర్ను పూర్తిగా వేయకుండా కాస్త దూరం వెళ్లేదాకా అలాగే పట్టుకొని కూర్చున్న బోస్ ఇక బయటపడ్డాం అనుకున్నాక ఊపిరిపీల్చుకున్నారు. దారిలో తమ బంధువు అశోక్నాథ్ బోస్ ఇంట భోజనం చేసి... బిహార్లోని గోమోహ్ (ప్రస్తుతం ఝార్ఖండ్లో ఉంది) రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ కల్కా మెయిల్ రైలు ఎక్కారు బోస్. స్టేషన్లో పోలీసులున్నా... మారిన వేషంలో ఆయన్ను గుర్తించలేకపోయారు. రైల్లో పెషావర్ చేరుకున్న నేతాజీ సులభంగానే అఫ్గానిస్థాన్లోకి ప్రవేశించారు. అక్కడి నుంచి సోవియట్కు వెళ్లాలనేది ఆలోచన. కానీ అఫ్గాన్లో తనకు పాష్టో భాష రాకపోవటంతో పట్టుబడే పరిస్థితి ఎదురైంది. దీంతో... అప్పటికప్పుడు స్థానిక గిరిజనుడిగా వేషం మార్చి.. బధిరుడిగా నటించి బయటపడ్డారు. ఆగాఖాన్-3 అనుచరులు ఆయన సోవియట్లోకి అడుగుపెట్టడానికి సహకరించారని చెబుతుంటారు.
బ్రిటిష్వారి నిఘా గురించి తెలిసిన బోస్... తన ఆనుపానులు మార్చేశారు. ఇటాలియన్ పాస్పోర్టుతో మాస్కోకు ప్రయాణించారు. అక్కడి నుంచి రోమ్కు వెళ్లి... 1941 ఏప్రిల్లో జర్మనీ చేరుకున్నారు. 1942లో జర్మన్ నియంత హిట్లర్ను కలుసుకున్నారు. బ్రిటిష్పై దుష్ప్రచారానికే తనను హిట్లర్ వాడుకోవటానికి ప్రయత్నిస్తున్నారని గుర్తించి... జపాన్కు వెళ్లారు. ఆ దేశ సైన్యం సాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పాటుచేశారు. ఆంగ్లేయులపై దాడులు ఆరంభించారు. అండమాన్ నికోబార్ దీవులు కొంతకాలం నేతాజీ ఫౌజ్ స్వాధీనంలోకి వచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధానంతరం మళ్లీ చేజారాయి. ఆంగ్లేయులను ఫౌజ్ ప్రత్యక్షంగా ఓడించకున్నా... వారిలో భయాన్ని నింపి, పరోక్షంగా వారి నిష్క్రమణకు కీలకమైందనేది వాస్తవం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. -
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM