Published : 24/02/2023 00:20 IST

Jharkhand: ఈ నృత్యం.. దానికి గుర్తు

‘బొగ్గు దొంగలు’.. ఈ అమ్మాయిలకున్న ముద్దు పేరు! సూర్యోదయానికి ముందు గంపలను తీసుకొని అధికారుల కళ్లు గప్పి బొగ్గు నింపుకొని పరుగెత్తడమే వీరి పని! ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వారూ ఎంతోమంది! ఝార్ఖండ్‌లోని సహనా పహాడి ఈ అమ్మాయిలది. అక్కడంతా ఓపెన్‌ కోల్‌ మైనింగ్‌ గనులే! ఇంట్లో పొయ్యి వెలగాలన్నా.. నాలుగు ముద్దలు కడుపులోకి వెళ్లాలన్నా.. ఈ అమ్మాయిలు తెచ్చే బొగ్గే ఆధారం. చిన్న శరీరం.. ఇరుకు దారుల్లో నడవడం, చిన్న సొరంగాల్లో దూరడం సులువు. ఇంకా.. అమ్మాయి అయితే దొరికినా తిట్లు, తన్నులు తప్పుతాయి. ఒకవేళ మట్టిపెళ్లలు కూలి చనిపోయినా.. అంతకు మించిన హాయి ఏముందన్నది అక్కడివాళ్ల అభిప్రాయం. కటిక పేదరికంలో చదువుకు ఆస్కారమేది? అలాంటి వాళ్లని కూడదీసి పినాకి రాయ్‌ అనే వ్యక్తి..తన భార్య, మరికొందరితో కలిసి అయిదేళ్లుగా ఓ విదేశీ ఎన్‌జీఓ సాయంతో చదువు చెప్పించడమే కాదు.. పుస్తకాలు, తిండి, దుస్తులు వంటివీ సమకూరుస్తున్నారు. ‘కోల్‌ఫీల్డ్‌ చిల్డ్రన్‌ క్లాసెస్‌’ పేరుతో డ్యాన్స్‌, ఆర్ట్స్‌.. నచ్చిన వాటిల్లో శిక్షణిప్పిస్తున్నారు. మసి నిండిన ముఖాలు, దుస్తులతో ఉండే వాళ్లలో ఇప్పుడిప్పుడే మార్పు మొదలైంది. ఉన్నతవిద్య దిశగా వందల మంది అమ్మాయిలు అడుగులు వేస్తున్నారు. బాగా చదివి భవిష్యత్‌లో తమ తలరాతను తాము మార్చుకోగలమన్న ఆశ వారిలో చిగురిస్తోంది! అందుకు చిహ్నమే ఈ నృత్యం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి