ఆమె గళానికి ఐరాస గుర్తింపు!
కర్ణాటకకు చెందిన దళిత కుటుంబంలో పుట్టింది అశ్విని. తండ్రి ప్రసన్నకుమార్, తల్లి జయమ్మ. ‘అమ్మానాన్నా విద్యావంతులు. కులాన్ని సమస్యగా వాళ్లెప్పుడూ భావించలేదు. రాజకీయ, సామాజిక కోణాల్లో నన్ను నేను అర్థం చేసుకునేలా మార్గనిర్దేశం చేశారు. వివక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని చాలామంది దళితులు కులం పేరు చెప్పరు. నేనలా కాదు.
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్(యూఎన్హెచ్ఆరీసీ)కు ప్రత్యేక దూతగా ఇటీవల ఎంపికైంది కేపీ అశ్విని. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలే కాదు, ఆసియా నుంచి ఎంపికైన మొదటి దళిత మహిళ కూడా.
కర్ణాటకకు చెందిన దళిత కుటుంబంలో పుట్టింది అశ్విని. తండ్రి ప్రసన్నకుమార్, తల్లి జయమ్మ. ‘అమ్మానాన్నా విద్యావంతులు. కులాన్ని సమస్యగా వాళ్లెప్పుడూ భావించలేదు. రాజకీయ, సామాజిక కోణాల్లో నన్ను నేను అర్థం చేసుకునేలా మార్గనిర్దేశం చేశారు. వివక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని చాలామంది దళితులు కులం పేరు చెప్పరు. నేనలా కాదు. ఈ క్రమంలో సమస్యల్నీ ఎదుర్కొన్నా. ఆ అనుభవాలే కుల వివక్షపై పోరాడేలా ప్రేరేపించాయి’ అంటుంది అశ్విని. కులమతాలకు అతీతంగా వ్యవహరించాలన్న అంబేడ్కర్ సిద్ధాంతాల్ని నమ్ముతూ పెరిగింది. ‘దిల్లీ జేఎన్యూలో పీహెచ్డీ చేస్తున్నప్పుడు దళిత విద్యార్థి విభాగ నాయకత్వంలో భాగమయ్యా. పీహెచ్డీ కోసం భారత్-నేపాల్లలో దళితుల హక్కులపైన పరిశోధించా. అప్పుడు జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్న దళిత నాయకుల్ని, విద్యావేత్తల్ని కలిశా. వీరిద్వారా దళిత హక్కులు, కుల వివక్ష విషయాలు లోతుగా తెలుసుకున్నా’ అనే అశ్విని ప్రస్తుతం బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్. మరోవైపు ‘అమ్నెస్టీ ఇంటర్నేషనల్’ భాగస్వామ్యంతో ఛత్తీస్గఢ్, ఒడిశాల్లోని ఆదివాసీ తెగల భూముల హక్కుల కోసం పోరాడుతోంది. ఈమె కృషిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి.. యూఎన్హెచ్ఆర్సీకు ప్రత్యేక దూతగా ఆమెను నియమించింది. నవంబరులో బాధ్యతలు చేపట్టనున్న అశ్విని.. ఆ పదవిలో మూడేళ్లు కొనసాగుతుంది. దీన్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జాత్యాహంకారం, జాతి వివక్ష, వలసదారులు, మైనార్టీల పట్ల విద్వేషం.. మొదలైన అంశాల్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఈ కౌన్సిల్కు నివేదికను పంపాలి. ‘దళిత మహిళలకు నైపుణ్యాలున్నా లింగ వివక్ష కారణంగా ఉన్నత స్థానాల్ని చేరుకోలేకపోయారు. నాకు అప్పగించిన బాధ్యతలతో ఇకపై వారికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నా. అమెరికాలో భారతీయులపై జాత్యాహంకార కేసులు, పశ్చిమాసియాలో వలసదారులు ఎదుర్కొనే వివక్షలపైన ప్రత్యేకంగా దృష్టి పెడతా’ అంటున్న 36 ఏళ్ల అశ్విని.. ‘జరియా’ స్వచ్ఛంద సంస్థను స్థాపించి భారత్లో దళిత, ముస్లిం మహిళల హక్కుల కోసం ఉద్యమిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- పాదాలు పదిలంగా
- స్లిట్... మరింత స్టైల్గా!
- చల్లటి పాలతో..!
- Makeup: ఈ పొరపాట్లు వద్దు!
- మ్యాచింగ్ పోట్లీ మస్తుంది!
ఆరోగ్యమస్తు
- కోపాన్ని తగ్గించే శశాంకాసనం!
- పోషకాల ‘పుట్ట’... ఆరోగ్యానికి ‘గొడుగు’
- అలసట లేకుండా పని చేయాలంటే..!
- ఎత్తును బట్టే..!
- Nayanthara : నచ్చిందే తింటా.. నోరు కట్టేసుకోను!
అనుబంధం
- మీరైతే ఏం చేస్తారు?
- కొలీగ్తో రెండో పెళ్లి.. పేరెంట్స్ వద్దంటున్నారు!
- ‘777’ నియమంతో... బంధం బలోపేతం!
- పిల్లలకు ఎలాంటి పుస్తకం కొంటున్నారు..?
- వాళ్ల ప్రేమ నిజమా? నకిలీనా?
యూత్ కార్నర్
- ఒలింపిక్స్ బరిలో... బిహార్ ఎమ్మెల్యే!
- Paris Olympics: అందుకే ఈసారి వీళ్లు ప్రత్యేకం!
- పాపులారిటీ కోసం ప్రాణాలెందుకు రిస్క్లో పెడతారు?!
- తెలుగమ్మాయి... బ్రిటన్లో మెరిసింది!
- వాళ్లున్నప్పుడు మారిపోతాడు!
'స్వీట్' హోం
- వర్షాలకు మొక్కలు పాడవకుండా..!
- మొక్కలకు కాఫీ పొడి వేస్తున్నారా?
- తగిలిస్తే... పిల్లి వచ్చే!
- నూరు వరహాలతో నిండుగా
- వ్యాపారమా... ఉద్యోగమా?
వర్క్ & లైఫ్
- కత్రినా ‘స్లిమ్’ బాడీ.. ఆ సీక్రెట్స్ ఇవే!
- Flower Truck Business: అందమైన పూల బొకేలతో.. లక్షలు సంపాదిస్తూ..!
- బరువెక్కుతున్న తెలుగు రాష్ట్రాలు!
- ఈ అలవాట్లే మనల్ని ధనవంతుల్ని చేస్తాయట!
- కేర్ టేకర్లు... కోట్లలో కావలెను!