Published : 27/02/2023 00:11 IST

గడ్డకట్టే చలిలో గిన్నిస్‌ రికార్డ్‌!

భూమికి వేల అడుగులెత్తులో ఉన్న ఆ సరస్సు ప్రాంతమంతా గడ్డకట్టిన మంచు. అడుగేస్తే జారిపోయే ఆ మంచుపై 30 ఏళ్ల స్తుతి భక్షి సాహసంతో మారథాన్‌ పూర్తి చేసి రికార్డు సాధించారు.  ఈ సాహసం వెనుక... ఆమె కృషిని తెలుసుకుందామా!  

ముద్రానికి 13,862 అడుగులెత్తులో ఉండే పాంగాంగ్‌ ప్రపంచంలోనే అతిఎత్తైన గడ్డకట్టే సరస్సుగా పేరుంది. లద్ధాఖ్‌లో ఉన్న ఈ సరస్సులో నిర్వహించే ‘పాంగాంగ్‌ ఫ్రోజన్‌ లేక్‌ మారథాన్‌’లో ఈ ఏడాది పాల్గొన్న 100మందిలో తొమ్మిదిమంది మహిళలు కాగా, వీరిలో గుజరాత్‌కు చెందిన స్తుతి భక్షి ఒకరు. 21.9 కిలోమీటర్ల దూరాన్ని నాలుగు గంటల్లో పూర్తిచేసి విజేతగా నిలిచారీమె. దీంతో తక్కువ సమయంలో అతిఎత్తైన ప్రాంతంలో హాఫ్‌ మారథాన్‌ పూర్తిచేసిన మహిళగా గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్తుతి స్థానాన్ని పొందారు. గతంలో నాలుగు హాఫ్‌ మారథాన్‌లు పూర్తిచేసిన ఈమెకు ఇలా అతి ఎత్తైన ప్రాంతంలో మారథాన్‌ చేయడం మాత్రం మొదటిసారి. ‘ఇది నిజంగా నాకో పెద్ద సవాల్‌. ఎత్తైన ఈ ప్రాంతంలో అడుగుతీసి అడుగేయడమే సాహసం. అతి చల్లని ఈ వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులొస్తుంటాయి. వెనుక నుంచి చల్లని ఈదురుగాలులు వేగంగా ముందుకు నెడుతుంటాయి.

ఇలాంటప్పుడు ఏటవాలుగా పేరుకున్న మంచుపై బ్యాలెన్స్‌ చేసుకుంటూ పరుగెత్తడం చాలా కష్టం. ఆ సమయంలో వెనుక నుంచి వీచే బలమైన గాలికి కిందపడిపోతామా అనిపిస్తుంది. ప్రతికూల వాతావరణాన్ని, పరిస్థితుల్ని తట్టుకోవడమెలాగో ఈ మారథాన్‌ నుంచి నేర్చుకొన్నా. ఇందులో పాల్గొనేందుకు చేసిన ఎంపిక కూడా క్లిష్టమైన ప్రక్రియే. ఇందుకు గతంలో మారథాన్‌ చేసిన అనుభవం ఉంటే మాత్రమే సరిపోదు. అతి చల్లని, ఎత్తైన ప్రాంతాల్లో అనుభవాలనూ లెక్కలోకి తీసుకుంటారు. నాకు మారథాన్‌లతోపాటు హిమాలయాల్లో ట్రెక్కింగ్‌ చేసిన అనుభవం ఉంది. యోగా శిక్షకురాలిని కూడా. గతంలో చాలా రకాల సాహసక్రీడల్లో పాల్గొన్నా. ఇవన్నీ ఇందులో పాల్గొనడానికి అర్హతను సాధించిపెట్టి, గిన్నిస్‌ రికార్డులో చోటునూ అందించాయి’ అని వివరించారు స్తుతి భక్షి. ఈ హాఫ్‌ మారథాన్‌ను లద్ధాఖ్ అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌, అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ సంయుక్తంగా నిర్వహించగా, ఇండియన్‌ ఆర్మీ, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీసు విభాగాలు నేతృత్వం వహించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి