China: ఆస్ట్రేలియాకు షాకిచ్చిన చైనా..!
ఆస్ట్రేలియాకు షాకిస్తూ.. చైనా-సాల్మన్ ఐలాండ్స్ ఓ రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. చైనా విదేశాఖ ప్రతినిధి వాంగ్వెన్బిన్ ఈ విషయంపై ప్రకటన విడుదల చేశారు. ‘‘చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ, సాల్మన్ ఐలాండ్స్ విదేశాంగ శాఖ మంత్రి జర్మేహ్ మనెలె రక్షణ సహకార ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు ప్రజా భద్రత, సామాజిక సురక్షిత, ప్రజల ఆస్తులను కాపాడటం
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియాకు షాకిస్తూ.. చైనా-సాల్మన్ ఐలాండ్స్ ఓ రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్వెన్బిన్ ఈ విషయంపై ప్రకటన విడుదల చేశారు. ‘‘చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ, సాల్మన్ ఐలాండ్స్ విదేశాంగ శాఖ మంత్రి జర్మేహ్ మనెలె.. రక్షణ సహకార ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు ప్రజా భద్రత, సురక్షిత సమాజం కోసం, ప్రజల ఆస్తులను కాపాడటంలో, ప్రకృతి విపత్తుల సమయంలో మానవీయ సాయం చేసుకొనేలా సహకరించుకొంటాయి. అంతేకాదు.. సాల్మన్ ఐలాండ్స్ తనను తాను రక్షించుకొనేలా సామర్థ్యాలను పెంచేందుకు చైనా సహకరిస్తుంది’’ అని పేర్కొన్నారు.
చైనాతో ఒప్పందంపై ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై సాల్మన్ ఐలాండ్స్ స్పందిస్తూ.. తాజాగా జరిగిన ఒప్పందంలో చైనా సైనిక స్థావరాన్ని సాల్మన్ ద్వీపాల్లో నెలకొల్పే అంశం ఏమీ లేదని వెల్లడించింది. కొత్త ఒప్పందానికి సంబంధించిన ఎటువంటి వివరాలు మాత్రం వెల్లడించలేదు. సాల్మన్ ద్వీపాలకు చైనా ఎటువంటి సహకారం అందిస్తుందనే అంశంపై కూడా స్పష్టత లేదు. ఈ ఒప్పందంపై ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి మారిస్ పైన్ మాట్లాడుతూ ‘‘ ఆస్ట్రేలియా తీవ్ర నిరాశ చెందింది. ఒప్పందంలో పారదర్శకత లోపించడం ఆందోళన కలిగిస్తోంది’’ అని పేర్కొంది. ఈ వారం అమెరికాకు చెందిన సీనియర్ దౌత్యవేత్తల బృందం కూడా సాల్మన్లో పర్యటించనుంది. అక్కడ అమెరికా రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరిచే అంశంపై చర్చలు జరపనున్నారు. ఈ రాయబార కార్యాలయాన్ని 29 ఏళ్ల క్రితం మూసివేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.