Rishi Sunak: సునాక్ సతీమణి వాటాలపై వివాదం
ఓ బాలల సంరక్షణాలయంలో బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ సతీమణి అక్షతా మూర్తి పెట్టుబడుల గురించి తలెత్తిన వివాదంలో సునాక్ సిబ్బంది వ్యవహరించిన తీరును పార్లమెంటు ప్రమాణాల సంఘం ఆక్షేపించింది.
లండన్: ఓ బాలల సంరక్షణాలయంలో బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ సతీమణి అక్షతా మూర్తి పెట్టుబడుల గురించి తలెత్తిన వివాదంలో సునాక్ సిబ్బంది వ్యవహరించిన తీరును పార్లమెంటు ప్రమాణాల సంఘం ఆక్షేపించింది. బాలల సంరక్షణ బాధ్యత తీసుకునేవారికి 600 పౌండ్ల చొప్పున నగదు ప్రోత్సాహకం ఇవ్వడానికి బ్రిటన్ ప్రభుత్వం వసంతకాల బడ్జెట్లో ఓ ప్రయోగాత్మక ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. ఏదైనా సంస్థ ద్వారా చేరే సంరక్షకులకు 1,200 పౌండ్లను చెల్లించడానికి ఈ కార్యక్రమంలో వెసులుబాటు ఉంది. ప్రభుత్వ వెబ్సైట్లో పేర్కొన్న ఆరు బాలల సంరక్షణ సంస్థల్లో కోరు కిడ్స్ ఒకటి. అందులో ప్రధాని భార్య అక్షతా మూర్తికి వాటాలు ఉన్నాయి. ఈ సంగతిని ప్రధాని రిషి సునాక్ సాధికారంగా పేర్కొనకపోవడం సందిగ్ధం వల్ల జరిగిన పొరపాటు అని ఈ వ్యవహారంపై ఆంతరంగికంగా దర్యాప్తు జరుపుతున్న పార్లమెంటు ప్రమాణాల సంఘం గత నెలలో తేల్చింది. తమ పొరపాటును సునాక్ కూడా అంగీకరించినందున ఎటువంటి చర్య తీసుకోనక్కర్లేదని పేర్కొంది. అయితే ప్రధాని కార్యాలయ సిబ్బంది ఈ దర్యాప్తు గురించి బహిర్గతం చేయకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ప్రధానమంత్రి, ఆయన మంత్రివర్గ సభ్యులు, పార్లమెంటు సభ్యులు జాగ్రత్త పాటించాలని కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.
తాజా వార్తలు (Latest News)
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి