London: లండన్ గోడలపై మూత్రం.. వెనక్కు చిమ్మడం ఖాయం!
బహిరంగ మూత్ర విసర్జన.. జనావాసాల్లో ఇదొక తీవ్ర సమస్య. పరిసరాల అపరిశుభ్రతతోపాటు స్థానికులకు ఎంతో అసౌకర్యం. ముఖ్యంగా రేయింబవళ్లు జనసంచారం ఉండే నగరాలకు ఇది రోజూ తలనొప్పి వ్యవహారమే.
బహిరంగ మూత్ర విసర్జన.. జనావాసాల్లో ఇదొక తీవ్ర సమస్య. పరిసరాల అపరిశుభ్రతతోపాటు స్థానికులకు ఎంతో అసౌకర్యం. ముఖ్యంగా రేయింబవళ్లు జనసంచారం ఉండే నగరాలకు ఇది రోజూ తలనొప్పి వ్యవహారమే. ఈ నేపథ్యంలో.. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జనను కట్టడి చేసేందుకు గ్రేటర్ లండన్ పరిధి వెస్ట్ మినిస్టర్ సిటీ కౌన్సిల్ వినూత్న పరిష్కార మార్గాన్ని అవలంబిస్తోంది. ఇక్కడి సోహో ప్రాంతంలోని ఇళ్లు, కార్యాలయాలు, ఇతర ముఖ్య ప్రదేశాల్లోని బయటి గోడలపై నీటిని వికర్షించే పారదర్శక పెయింట్ను పిచికారీ చేయిస్తున్నారు. ఈ పూత గల ఉపరితలాలపై నీళ్లు పడినప్పుడు.. వెంటనే మళ్లీ వెనక్కు చిమ్ముతాయి. సోహోలోని 10 ముఖ్య ప్రాంతాల్లో పాలనా యంత్రాంగం ఈ మేరకు చర్యలు తీసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రణరంగంగా తైవాన్ పార్లమెంటు
ఓ బిల్లుపై చర్చ సందర్భంగా తైవాన్ పార్లమెంటులో అధికార, విపక్ష ఎంపీలు పరస్పర దాడులకు దిగారు. ఒకరినొకరు ఎత్తిపడేసి.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. -
సింగపూర్లో మళ్లీ కొవిడ్ అలజడి
కొవిడ్-19 మహమ్మారి సింగపూర్లో మరోసారి కలకలం రేకెత్తిస్తోంది. ఈ నెల 5 నుంచి 11 మధ్య 25,900కుపైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆంగ్ యె కుంగ్ తెలిపారు. -
సంక్షిప్త వార్తలు (4)
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వెళుతున్న మినీ ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఓ ఉమ్మడి కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు సహా 14 మంది మృతి చెందారు. -
కిర్గిజ్స్థాన్లో విదేశీ విద్యార్థులపై మూకదాడులు
కిర్గిజ్స్థాన్లోని భారత విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. రాజధాని బిష్కెక్లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగడంతో.. ఎవరూ బయటకు రావొద్దని సూచించింది.