S Jaishankar: ఈ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు..: కెనడా వివాదంపై జైశంకర్ ఘాటు రిప్లై
కెనడా(Canada) ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) భారత్పై చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా వీటిని మరోసారి ఖండించిన కేంద్రమంత్రి ఎస్ జైశంకర్(S Jaishankar).. ఆ దేశంపై ఘాటు విమర్శలు చేశారు.
న్యూయార్క్: ‘ఖలిస్థానీ’ అంశం భారత్-కెనడా(India-Canada) మధ్య దౌత్యపరమైన చిచ్చుపెట్టింది. దాంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఐరాస 78వ సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా న్యూయార్క్ వెళ్లిన విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ (S Jaishankar).. ఈ వివాదంపై కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్(CFR)లో మాట్లాడారు.
ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చంటూ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) చేసిన ఆరోపణలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను జైశంకర్ మరోసారి ఖండిస్తూ.. తన విధానాల ప్రకారం భారత్ అలాంటి చర్యలకు పాల్పడదని స్పష్టం చేశారు. ట్రూడో(Justin Trudeau) ప్రభుత్వం చేసిన ఆరోపణలకు సంబంధించి ఇంతవరకు వారివైపు నుంచి ఎటువంటి ఆధారాలు అందలేదని, నిజ్జర్ హత్యకు సంబంధించి తగిన సమాచారం అందిస్తే.. భారత్ చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
రాజకీయ అవసరాల కోసం తీవ్రవాదంపై నిర్లక్ష్యమొద్దు
ఫైవ్ఐస్ కూటమిలో పంచుకున్న సమాచారం ఆధారంగానే ట్రూడో ఆ ఆరోపణలు చేసుండొచ్చని యూఎస్ దౌత్యవేత్త చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ముదిరింది. దీనిపై రిపోర్టర్ మంత్రిని ప్రశ్నించగా.. ఆయన ఘాటుగా బదులిచ్చారు. ‘నేను ఆ ఫైవ్ ఐస్(Five Eyes intelligence Alliance)లో భాగం కాదు. అలాగే ఎఫ్బీఐకి చెందిన వ్యక్తినీ కాను. మీరు ఈ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదనుకుంటున్నా’ అని సమాధానమిచ్చారు. ఫైవ్ఐస్.. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల సమాహారం. విశ్వసనీయ సమాచార మార్పిడి దీని ప్రధాన లక్ష్యం.
అలాగే, రాజకీయ లబ్ధి కోసం వేర్పాటువాద శక్తులు, హింస, తీవ్రవాదానికి సంబంధించి వ్యవస్థీకృత నేరాలపై కొందరు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ట్రూడో సర్కారుపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ నేరాల గురించి భారత ప్రభుత్వం కెనడాకు పెద్ద మొత్తంలో సమాచారాన్ని అందించిందని, అలాగే అప్పగింతల కోసం ఎన్నో అభ్యర్థనలు చేసిందని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
New Zealand: పొగాకు అమ్మకాల నిషేధంపై వెనక్కి.. విమర్శలపాలవుతున్న న్యూజిలాండ్ కొత్త ప్రధాని నిర్ణయం
గతంలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని న్యూజిలాండ్ కొత్త ప్రధాని నిర్ణయించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
China: సివిల్స్ పరీక్షకు లక్షల్లో చైనా యువత.. ఆ భయాలే కారణమా?
China: చైనాలో ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. తాజాగా జరిగిన సివిల్స్ పరీక్షకు ఏకంగా 22 లక్షల మందికి పైనే హాజరవ్వడం.. ‘ఆర్థిక మాంద్యం’ భయాలకు అద్దం పడుతుంది. -
Hamas: నేటితో ముగియనున్న కాల్పుల విరమణ.. పొడిగింపునకు రంగం సిద్ధం
హమాస్-ఇజ్రాయెల్ మధ్య మరికొంత కాలం కాల్పుల విరమణ కొనసాగే అవకాశాలున్నాయి. ఆదివారం రాత్రి హమాస్ నుంచి కాల్పుల విరమణ పొడిగింపు ప్రతిపాదన రాగా.. ఇజ్రాయెల్ ప్రధాని కూడా కొంత సానుకూలంగానే స్పందించారు. -
North Korea: సరిహద్దుల్లో టెన్షన్.. సైన్యాన్ని దించిన కిమ్!
ఉత్తర కొరియా తన సరిహద్దుల్లో గస్తీ కేంద్రాలను పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ కొరియా ఆరోపించింది. -
USA: టీనేజర్ల వ్యక్తిగత సమాచార సేకరణ ఆరోపణలు.. మెటాపై 33 రాష్ట్రాలు దావా
ఇన్స్టాగ్రామ్ (Instagram), ఫేస్బుక్ల (Facebook) మాతృసంస్థ ‘మెటా’ (Meta).. 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచాన్ని సేకరించిందని ఆరోపిస్తూ అమెరికాలో పలు రాష్ట్రాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. -
Wedding: రన్వేపై బారాత్.. విమానంలో వివాహం.. ‘అంబరాన్ని’ అంటిన వేడుక
యూఏఈకి చెందిన ఓ వ్యాపారవేత్త ఆకాశవీధుల్లో తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఓ ప్రైవేటు విమానంలో అతిథుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. -
Wedding: రూ.490 కోట్ల పెళ్లివేడుక.. వైరల్గా దృశ్యాలు..!
కొద్దిరోజుల క్రితం పారిస్లో కళ్లు మిరుమిట్లు గొలిపే రీతిలో ఓ వ్యాపార కుటుంబంలో వివాహం(wedding) జరిగింది. ఇప్పుడు ఆ వివాహ వేదిక దృశ్యాలు, ఖర్చు వివరాలు వైరల్ అవుతున్నాయి. -
సాయుధ తిరుగుబాటు అంచున సియర్రా లియోన్.. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ..!
మరో ఆఫ్రికా దేశం సాయుధ తిరుగుబాటు అంచుకు చేరింది. ఆదివారం సియర్రా లియోన్లో అరాచకం చోటు చేసుకుంది. జైళ్లను, ప్రభుత్వ ఆయుధాగారాలను దండుగులు బద్దలుకొట్టి.. ఆయుధాలను దోచుకెళ్లారు. -
Khalistani Supporters: న్యూయార్క్లో భారత రాయబారిని అడ్డుకున్న ఖలిస్థానీలు
ఖలిస్థానీ సానుభూతిపరులు అమెరికాలోని న్యూయార్క్లో భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధుని అడ్డుకుని నిరసన తెలిపారు. -
Rishi Sunak: ‘ఎలాన్ మస్క్ అయితే ఏంటీ.. అది తప్పే’: రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు
‘యూదు వ్యతిరేకత’ ఏ రూపంలో ఉన్నా సరే.. దాన్ని తాను తీవ్రంగా ఖండిస్తానని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) అన్నారు. ఎలాన్ మస్క్ (Elon Musk) అయినా సరే.. అలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పేనన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
‘ఆ పసి హృదయం దారుణంగా గాయపడింది’: బైడెన్
Israel-Hamas Conflict: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన సంధి నేటితో ముగియనుంది. దీనిని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. -
మరో 34 మంది బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ మధ్య రెండు, మూడు విడతల బందీల విడుదల శని, ఆదివారాల్లో సాఫీగా సాగింది. 26 మంది ఇజ్రాయెలీలతోపాటు 8 మంది విదేశీయులను హమాస్ విడుదల చేసింది. -
గాజాలో నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం గాజాకు వచ్చారు. ఆయన వెంట సీనియర్ అధికారులు ఉన్నారు. యుద్ధంలో పాల్గొంటున్న సైనికులతో ఆయన సమావేశమయ్యారు. -
అవి సీజనల్ నిమోనియా సమస్యలే: చైనా
చైనాలోని చిన్నారుల్లో వ్యాపించిన నిమోనియాపై తమకు నివేదిక అందిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అవి శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలేనని బీజింగ్ పేర్కొందని వెల్లడించింది. -
సనాతన ధర్మ వ్యతిరేకతను తిప్పికొడదాం
సనాతన ధర్మ వ్యతిరేకతను తిప్పి కొడదామని, హిందూ సంస్థల మధ్య ఐక్యతను బలోపేతం చేద్దామని ప్రపంచ హిందూ కాంగ్రెస్ (డబ్ల్యూహెచ్సీ) నిర్ణయించింది. -
రాకెట్ దశను గాల్లోనే పేల్చేసిన ఉ.కొరియా
ఇటీవల ఉత్తర కొరియాలోని కిమ్ సర్కార్ ఒక నిఘా ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీనిని ప్రయోగించే సమయంలో ఎలాంటి ఆధారాలు, పరికరాలు.. అమెరికా, దక్షిణ కొరియాలకు చిక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకొంది. -
ఆదిమ కాలంలో అతివలూ వేటాడేవారు
వేట పూర్తిగా పురుష లక్షణమన్న భావన తప్పవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆదిమ కాలంలో మహిళలు కూడా వేటాడేవారని తాజాగా తేల్చారు. -
ప్రధాన సైనిక బ్యారక్పై సాయుధుల దాడి
ఆఫ్రికా ఖండంలోని సియర్రా లియోన్లో సంక్షోభం నెలకొంది. రాజధాని ఫ్రీటౌన్లోని దేశ ప్రధాన సైనిక బ్యారక్తోపాటు జైళ్లపై సాయుధులు దాడికి దిగారు. -
మయన్మార్ సాయుధ గ్రూపు చేతికి చైనా బోర్డర్ గేట్
మయన్మార్లో సాయుధపోరాటం తీవ్రరూపం దాల్చింది. ఉత్తర షాన్ రాష్ట్రంలోని ఓ మైనార్టీ సాయుధ గ్రూపు.. చైనా సరిహద్దు సమీపంలోని ప్రాంతాలను మయన్మార్ సైన్యం నుంచి స్వాధీనం చేసుకొంది. -
అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టాం
చైనా-అమెరికా మధ్య శిఖరాగ్రస్థాయి చర్చలు ముగిసి రెండు వారాలు కూడా కాలేదు.. మరోసారి ఇరు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. -
ఏఐ మోడల్ సంపాదన నెలకు రూ.9 లక్షలు
కృత్రిమ మేధ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఉద్యోగాలు పోతాయనే భయం చాలా మందిలో నెలకొంది. ఎలాన్ మస్క్ వంటి టెక్ దిగ్గజాలు.. ఏఐతో మానవాళికి ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
అలా బెదిరించడంతో.. మాట్లాడలేకపోయా: సింఘానియాపై నవాజ్ మరిన్ని ఆరోపణలు
-
US Visa: ‘స్టూడెంట్ వీసా’కు అమెరికా కొత్త రూల్స్.. నేటి నుంచే అమల్లోకి..
-
Amaravati: రైతులకు కౌలు చెల్లింపు పిటిషన్పై విచారణ వాయిదా
-
Sandeep Reddy Vanga: మహేశ్బాబుకు ‘యానిమల్’ కథ చెప్పలేదు కానీ..: సందీప్ రెడ్డి వంగా క్లారిటీ
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Appleలో ఉద్యోగం కావాలా? ఈ నైపుణ్యాలు ఉండాలంటున్న సీఈఓ టిమ్ కుక్!