బ్రేకింగ్

breaking
26 Apr 2024 | 13:52 IST

వైకాపాకు డొక్కా మాణిక్య వరప్రసాద్‌ రాజీనామా

అమరావతి: వైకాపాకు డొక్కా మాణిక్య వరప్రసాద్‌ రాజీనామా చేశారు. గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్ష పదవి, పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించిన లేఖను సీఎం జగన్‌కు పంపారు. డొక్కా మాణిక్య వరప్రసాద్‌ తాడికొండ టికెట్‌ను ఆశించారు. అక్కడ మాజీ మంత్రి మేకతోటి సుచరితకు వైకాపా అవకాశం కల్పించింది. దీంతో గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న డొక్కా.. నేడు రాజీనామా చేశారు.

మరిన్ని

తాజా వార్తలు