బ్రేకింగ్

breaking
30 Apr 2024 | 17:13 IST

కాంగ్రెస్‌, భారాస వేర్వేరు కాదు: మోదీ

అల్లాదుర్గం:  భారత్‌ను కాంగ్రెస్‌ పార్టీ అవినీతి ఊబిలోకి నెట్టివేసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. మెదక్‌ జిల్లా అల్లాదుర్గం బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ‘‘కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న చోట పంచ సూత్రాలతో పాలన చేస్తుంది. అవి.. అవినీతి, అబద్ధాలు, మాఫియా, కుటుంబపాలన, ఓటు బ్యాంకు రాజకీయాలు. దేశంలో మళ్లీ పాతరోజులు తీసుకురావాలని ఆ పార్టీ చూస్తోంది. కాంగ్రెస్‌, భారాస వేర్వేరు కాదు. ఇరుపార్టీలు పరస్పరం సహకరించుకుంటున్నాయి’’ అని మోదీ ఆరోపించారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని