ఆకట్టుకుంటోన్న ‘చక్ర’ స్నీక్ పీక్
ఇంటర్నెట్ డెస్క్: విశాల్ కథానాయకుడుగా దర్శకుడు ఎం.ఎస్. ఆనందన్ తెరకెక్కించిన చిత్రం ‘చక్ర’. శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా, శ్రుతి నాయికలు. సైబర్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన అన్ని చోట్లా మంచి స్పందన లభిస్తుందీ సినిమాకు. ఈ నేపథ్యంలో స్నీక్ పీక్ పేరుతో సుమారు 3నిమిషాలున్న ఆసక్తికర సన్నివేశాన్ని తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. నేరానికి పాల్పడే వ్యాపార సంస్థ సభ్యులకు, విశాల్ మధ్య సాగే సంభాషణలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. డిజిటల్ ప్రపంచంలో వ్యక్తిగత సమాచారానికి గోప్యత లేదనే అంశంపై వాదన ప్రతివాదనలు ఆలోచింపజేస్తున్నాయి. ‘చట్టం అనేది పేదలకు, మిడిల్ క్లాస్ వాళ్లకే ఇలాంటి పదివేల కోట్లు కొట్టేసే వాళ్లకి కాదు’ అనే డైలాగ్ ప్రత్యేకంగా నిలుస్తుంది.
విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. గతంలో విశాల్ నటించిన ‘అభిమన్యుడు’ ఇలాంటి నేపథ్యంలోనే వచ్చి విజయం అందుకుంది.
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
- మోహన్బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
‘పద్మవ్యూహం లోనికి..’ సుశాంత్!