Telangana elections: తెలంగాణలో నేతల ప్రచార ‘సిత్రాలు’
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. పలు ఆసక్తికర చిత్రాలను చూసేయండి.
Updated : 10 May 2024 13:53 IST
1/24
భువనగిరి సభలో ప్రసంగిస్తున్న అమిత్షా. చిత్రంలో భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్.
2/24
హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించిన జనజాతర సభలో అభివాదం చేస్తున్న రాహుల్ గాంధీ. పక్కన సీఎం రేవంత్రెడ్డి.
3/24
హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించిన జనజాతర సభలో అభ్యర్థులు రంజిత్రెడ్డి, పట్నం సునీతా మహేందర్రెడ్డి, చామల కిరణ్కుమార్రెడ్డిలను సభికులకు పరిచయం చేస్తున్న రాహుల్ గాంధీ.
4/24
కరీంనగర్ రోడ్షోలో మాట్లాడుతున్న కేసీఆర్. చిత్రంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ తదితరులు.
5/24
తొర్రూరు జనసభలో ప్రసంగిస్తున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ. పక్కన వరంగల్ భాజపా అభ్యర్థి అరూరి రమేశ్.
6/24
భైంసాలో ప్రసంగిస్తున్న కేటీఆర్, పక్కన నేతలు అనిల్జాదవ్, రమాదేవి, అభ్యర్థి ఆత్రం సక్కు.
7/24
హుస్నాబాద్లో ప్రసంగిస్తున్న భాజపా అభ్యర్థి బండి సంజయ్.
8/24
మధిరలో మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. చిత్రంలో మంత్రి పొంగులేటి, ఖమ్మం అభ్యర్థి రఘురాంరెడ్డి తదితరులు.
9/24
గుడిహత్నూర్లో టీ తయారు చేస్తున్న భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్.
10/24
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఆత్రం సుగుణ స్వగ్రామం తిమ్మాపూర్లో కూలీలతో మాట్లాడారు. ‘మా అమ్మతో కలిసి ఇదే గ్రామంలో నేనూ కూలీ పనులు చేశాను’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు.
11/24
మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారంలో అభిమానులను సెల్ఫీలతో అలరించారు. యాకుత్పుర అసెంబ్లీ సెగ్మెంట్లోని కుర్మగూడలో పాదయాత్ర చేసి ఓటర్లను కలుసుకున్నారు.
12/24
కాప్రా సర్కిల్ పరిధిలోని సాయిబాబా నగర్ పోచమ్మ ఆలయంలో మల్కాజిగిరి లోక్సభ భారాస అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పూజలు చేశారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
13/24
మల్కాజిగిరి భాజపా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ హయత్నగర్ డివిజన్ బంజారా కాలనీలో స్థానిక నేతలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఓటర్లను పలకరిస్తూ అభివాదం చేశారు.
14/24
సుడిగాలి పర్యటనలు చేస్తున్న చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి తుక్కుగూడలో కార్యకర్తలతో కలిసి రహదారి పక్కన టీ తాగారు. అనంతరం రోడ్షోలో పాల్గొన్నారు.
15/24
నాగర్కర్నూల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని చంద్రధన, తలకొండపల్లి గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు.
16/24
మల్కాజిగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి బాచుపల్లి, బౌరంపేట, దుండిగల్, దూలపల్లిలో ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, పార్టీ నియోజకవర్గ బాధ్యుడు కొలను హన్మంత్రెడ్డి పాల్గొన్నారు.
17/24
గోషామహల్ డివిజన్ దత్తాత్రేయ నగర్, మంగళ్హాట్లో హైదరాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి గడ్డం శ్రీనివాస్యాదవ్ బైకు ర్యాలీ నిర్వహించారు. తమ పార్టీని బలపరచాలని ఓటర్లను అభ్యర్థించారు.
18/24
పటాన్చెరు మండలం రుద్రారంలో మెదక్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్ధి నీలం మధుకు మద్దతుగా సీపీఎం శ్రేణులు ఇంటింటి ప్రచారం చేశారు. ఇండియా కూటమి అభ్యర్థిగా ఆయనను గెలిపించాలని కోరారు.
19/24
కంటోన్మెంట్ నాలుగో వార్డు పరిధిలోని పికెట్, లక్ష్మీనగర్ బస్తీలో ఎమ్మార్పీఎస్ నేతలు ఉపఎన్నిక ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ బరిలో ఉన్న భాజపా అభ్యర్థి డాక్టర్ వంశతిలక్ పాల్గొన్నారు.
20/24
మిర్యాలగూడ పట్టణం సుందర్నగర్లో వృద్ధురాలికి నమస్కరిస్తున్న ఎమ్మెల్యే బీఎల్ఆర్.
21/24
మునుగోడు పెద్ద చెరువు వద్ద ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి.
22/24
భువనగిరి పట్టణంలో ఓ చిరువ్యాపారిని ఓటు అభ్యర్థిస్తున్న మాజీ ఎమ్మెల్యే శేఖర్రెడ్డి, నాయకులు.
23/24
ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యే పద్మావతిరెడ్డికి మంగళహారతులు పడుతున్న కార్యకర్తలు.
24/24
భువనగిరిలో ఏఐటీయూసీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి సతీమణి డింపుల్రెడ్డి.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!
-
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
-
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి