CPI Narayana: ఆత్మస్తుతి, పరనింద పనికిరాదు: సీపీఐ నారాయణ
ఏపీలో కోనసీమ జిల్లా వివాదం చినికి చినికి గాలివానలా మారి.. చివరకు మంత్రి ఇంటినే తగులబెట్టే పరిస్థితి ఏర్పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
అమరావతి: ఏపీలో కోనసీమ జిల్లా వివాదం చినికి చినికి గాలివానలా మారి.. చివరకు మంత్రి ఇంటినే తగులబెట్టే పరిస్థితి ఏర్పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇది అక్కడున్న కుల ఘర్షణగా చూడ్డానికి వీల్లేదని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
‘‘ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఈ ఘటన ప్రతిబింబిస్తోంది. ఎక్కడ వీలు ఉంటే అక్కడ ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని ప్రతిబింబించే పద్ధతిలో ఉద్యమాలు వస్తాయి. ఎప్పుడైతే ప్రజాస్వామ్యం లేకుండా, ప్రతిపక్షాలకు సంబంధించిన భావాలు పంచుకోలేకపోతారో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. జిల్లా ప్రకటించే సమయంలోనే అంబేడ్కర్ పేరు పెట్టి ఉంటే ఎవరూ అడిగి ఉండేవారు కాదు. జిల్లాలు ఏర్పాటు చేసి పేర్లు చెప్పేశారు. అనేక జిల్లాల్లో పేర్ల విషయంలో వివాదాలొచ్చినా గట్టిగా నిలబడి.. ఇప్పుడెందుకు రాజీ పడ్డారు? ఇందులో ఓట్లు, రాజకీయ లబ్ధి తప్ప ఇంకేమీ కనిపించడం లేదు.
సంకుచిత వైఖరి ఉంటే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. సీఎం జగన్ ఊగిసలాట, స్వార్థ వైఖరే దీనికి కారణం. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం ఇతర పార్టీలపై అభాండాలు వేస్తే లాభం లేదు. ఆత్మస్తుతి, పరనింద పనికిరాదు. ఈ విషయంలో వాస్తవాలు ఆలోచించాలి. ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిపాలన సాగిస్తే ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవు. కోనసీమ వ్యవహారంపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం వైకాపా ప్రభుత్వానికి ఉంది’’ అని నారాయణ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ