Krishnapatnam: ఒక విడతలో 10 లక్షల మందికి
రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే.. అన్ని వనరులు సమకూరితే ఒక విడతలో 10 లక్షల మందికి మందు తయారు చేయగలమన్న నమ్మకాన్ని ఆనందయ్య వ్యక్తం చేశారు.. ‘మందు తయారీకి సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాం
మందు తయారీపై ఆనందయ్య విశ్వాసం
ప్రభుత్వ సాయం కోరామని వెల్లడి
ఈనాడు డిజిటల్, నెల్లూరు - కృష్ణపట్నం (ముత్తుకూరు), న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే.. అన్ని వనరులు సమకూరితే ఒక విడతలో 10 లక్షల మందికి మందు తయారు చేయగలమన్న నమ్మకాన్ని ఆనందయ్య వ్యక్తం చేశారు.. ‘మందు తయారీకి సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. ఇప్పటివరకు సాయం అందలేదు. అందిన వెంటనే వేగంగా ప్రజలకు మందు అందిస్తాం’ అని చెప్పారు. సోమవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో తన నివాసంలో ఆయన ‘ఈనాడు-ఈటీవీ’తో, విలేకరులతో మాట్లాడారు. ‘అవాంతరాలతో 15 రోజులపాటు తయారీ నిలిచిపోయింది. అనుమతి ఇచ్చినప్పటి నుంచి తయారీకి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులతో యంత్రాలు కాలిపోతున్నాయి. మందు తయారీ నిర్విరామంగా జరగాలంటే.. కాస్త సమయం పడుతుంది. దేశంలో అవసరమైన వారందరికీ అందజేయాలని ప్రణాళిక నిర్దేశించుకున్నాం. నా మీద రాజకీయ ఒత్తిడి లేదు. ముందుగా కొవిడ్ బాధితులకు ఇవ్వాలనుకుంటున్నాం. అధికారులు సహకరించి పాజిటివ్ వ్యక్తులను గుర్తించేందుకు ఏర్పాట్లు చేస్తే ప్రయోజనంగా ఉంటుంది. సాయం చేసేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆన్లైన్లో పంపిణీ చేసే ఉద్దేశం లేదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఆనందయ్య వివరించారు. మరో వైపు ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆర్డీవో హుస్సేన్సాహెబ్, గ్రామీణ డీఎస్పీ హరినాథ్రెడ్డి ఆయనతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం విలేకరులతో ఆనందయ్య మాట్లాడుతూ.. రవాణా, ప్యాకింగ్ వంటి పనులకు దాదాపు 300 మంది అవసరమవుతారని చెప్పారు. కృష్ణపట్నంలోనే తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసుకుని తయారు చేసేందుకు ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పారు.
సంపాదించాలన్న ఆలోచన చేస్తే నాశనమవుతా: ఎమ్మెల్యే కాకాణి
వెంకయ్య స్వామిపై ప్రమాణం చేసి చెబుతున్నా.. ఆనందయ్య మందును అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించాలనుకున్నా.. ఆ దిశగా ఆలోచన చేసినా తాను, తమ కుటుంబసభ్యులు సర్వనాశనమైపోతామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మండలం గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమంలోని కల్యాణమండపంలో ఆనందయ్య మందును ఆయన పంపిణీ చేశారు. తనపై అభాండాలు వేసిన వారికి ఏ శిక్ష విధించాలో దేవుడే చూసుకుంటారన్నారు. నియోజకవర్గంలోని 1.80 లక్షల కుటుంబాలకు తొలుత మందు అందజేస్తామని చెప్పారు.
నా ఆరోపణలన్నీ నిజాలే: సోమిరెడ్డి
నెల్లూరు, న్యూస్టుడే: ఆనందయ్య మందు పంపిణీకి తయారుచేసిన వెబ్సైట్ విషయంలో తాను చేసిన ఆరోపణలన్నీ నిజాలేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. వాటి వివరాలు మీడియా సమావేశంలో వెల్లడిస్తే అర్ధరాత్రి నాన్బెయిలబుల్ కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. సోమవారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, అరెస్టు చేసుకోండని సవాల్ చేశారు. అక్రమంగా వెబ్సైట్ను ప్రారంభించిన వారిపై కేసులు నమోదు చేయరా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేని కలిశానని వెబ్సైట్ తయారీదారు ఒప్పుకున్నారని, అధికారుల వద్దకు వెళ్లానని కూడా చెప్పారని వెల్లడించారు. పబ్లిక్ వెబ్సైట్లో ఉన్న వాటిని మీడియా ముందు ఉంచితే కేసులు పెడతారా అని వ్యాఖ్యానించారు. సంస్థ ఉండేది నెల్లూరు దర్గామిట్ట పోలీసుస్టేషన్ పరిధిలో అయితే కృష్ణపట్నంలో కేసు ఎలా పెడతారని మండిపడ్డారు. వెబ్సైట్పై ఫిర్యాదు ఇవ్వాలని రోజంతా ఎదురుచూసినా ఒక్క పోలీసు అధికారి కూడా అందుబాటులో లేరన్నారు. దీంతో మెయిల్లో ఎస్పీకి పంపామని వివరించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవ, తమ పోరాటంతోనే ఆనందయ్య మందుకు అనుమతులు త్వరగా వచ్చాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
కార్టూన్
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు.