5 లక్షల కోట్లకు అప్పు!
ఆంధ్రప్రదేశ్లో అప్పులు రూ.5 లక్షల కోట్లు దాటిపోతున్నాయని ఆర్థికనిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తెచ్చిన రుణాల మొత్తం కూడా కలిపి లెక్కిస్తే అప్పు ఈ అంకెను దాటేస్తున్నట్లేనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రం నెత్తిన మోయలేనంత రుణభారం
కార్పొరేషన్ల అప్పే రూ. 1.35 లక్షల కోట్లు
మిగిలినవి రూ.4 లక్షల కోట్లకు చేరువలో
ఈనాడు - అమరావతి
ఆంధ్రప్రదేశ్లో అప్పులు రూ.5 లక్షల కోట్లు దాటిపోతున్నాయని ఆర్థికనిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తెచ్చిన రుణాల మొత్తం కూడా కలిపి లెక్కిస్తే అప్పు ఈ అంకెను దాటేస్తున్నట్లేనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నానాటికీ అప్పుల మొత్తం పెరుగుతోంది. పీడీ ఖాతాల్లో ఉంచిన మొత్తాన్నీ ప్రభుత్వ అప్పుగానే లెక్కించాలి. ప్రభుత్వం వివిధ రూపాల్లో రుణాలు సేకరిస్తుంది. వీటిని బడ్జెట్ ద్వారా చేసే ఖర్చులకు వినియోగిస్తుంది. అదే సమయంలో కార్పొరేషన్లకు ప్రభుత్వమే గ్యారంటీలు ఇచ్చి అప్పులు తీసుకుని తన అవసరాలకే వినియోగించుకుంటున్నా ఆ మొత్తాలను రుణాల్లో కలిపి చూపించడం లేదు. ఆ కార్పొరేషన్లు చేసే రుణాన్నీ ప్రభుత్వం తన బడ్జెట్ కేటాయింపుల ద్వారా చెల్లిస్తోంది. కార్పొరేషన్లకు సొంత వ్యాపారాలు లేకుండానే వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుని ప్రభుత్వ అవసరాలు తీరుస్తున్నాయి. ఆ రుణాల భారం పడేది ప్రభుత్వం పైనే. ఈ లెక్కన ఇప్పటికే దాదాపు రూ.4లక్షల కోట్ల వరకు ఉన్న ప్రభుత్వ అప్పునకు కార్పొరేషన్ల ద్వారా తీసుకువచ్చిన మరో రూ.1,35,600 కోట్లు కలిపి చూడాలని విశ్లేషిస్తున్నారు. ఈ లెక్కన ప్రభుత్వ అప్పు రూ.5.35 లక్షల కోట్ల మొత్తానికి చేరుకుంటున్నట్లే భావించాల్సి వస్తుందని చెబుతున్నారు.
ప్రభుత్వం బడ్జెట్ లెక్కల్లో పేర్కొన్న ప్రకారం రాష్ట్ర అప్పు 2020-21 ఆర్థిక సంవత్సరానికి 3,55,974.30 కోట్లకు చేరింది. అంతకుముందు అంచనాల్లో అది 3.48 లక్షల కోట్లే. లెక్కలు సవరించే నాటికి ఇది ఎంత లేదన్నా మరో 8-10వేల కోట్లు పెరిగే అవకాశం ఉందని ఆర్థికశాఖ వర్గాల విశ్లేషణ. దీనికితోడు పీడీ ఖాతాల ద్వారా ఇప్పటికీ చెల్లించని భారం కలిపితే ఇప్పటికే రూ.4 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లే లెక్క కడుతున్నారు. కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు మినహాయిస్తే మిగిలిన అప్పులన్నీ ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.3.87 లక్షల కోట్లకు చేరుకుంటాయని ప్రభుత్వ అంచనాలే పేర్కొంటున్నాయి. సవరించిన అంచనాల ప్రకారం 4 లక్షల కోట్లకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
కార్పొరేషన్ల అప్పులు లక్ష కోట్ల పైనే రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా ఇంతవరకు రూ.1,35,600 కోట్ల రుణం తీసుకున్నట్లు లెక్కలు కడుతున్నారు.
*రాష్ట్రంలోని 29 కార్పొరేషన్లకు ప్రభుత్వాలు రూ.1,19,230 కోట్ల మేర గ్యారంటీలు ఇచ్చాయి. వాటి నుంచి రూ.1,13,000 కోట్లు ప్రభుత్వాలు ఇప్పటికే రుణంగా తీసుకున్నాయని విశ్లేషకుల లెక్క. ఆ అప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాల అవసరాల కోసం తెచ్చినవే.
* మరోవైపు ఇటీవల ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ను ఏర్పాటుచేశారు. భవిష్యత్తు ఆదాయాలు ఎస్క్రో చేసి రూ.21,500 కోట్ల రుణం తీసుకున్నారు. అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకం విధించి, ఆ మొత్తాన్ని రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్కు మళ్లించి అక్కడి నుంచి పది డిపోల ద్వారా వచ్చే ఆదాయాన్ని బ్యాంకులకు ఎస్క్రో చేస్తున్నారు. ఈ నిధులు సంక్షేమ పథకాలకే వినియోగిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
* ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటుచేసి పెట్రోలు, డీజిల్పై రూపాయి సెస్ విధించి రూ.1,100 కోట్లు రుణంగా తీసుకుంది.
*ఈ రుణాలన్నింటి విలువ రూ.1,35,600 కోట్లుగా తేలుతోంది. ఈ అప్పుల చెల్లింపు రాష్ట్ర బడ్జెట్ నుంచే జరుగుతున్నందున ఇది రాష్ట్రప్రభుత్వ అప్పుగానే చూడాలని నిపుణులు పేర్కొంటున్నారు. కేరళ ప్రభుత్వం ఇలాగే అదనపు సెస్లను ఎస్క్రో చేసి తీసుకున్న రుణాన్ని రాష్ట్ర అప్పుగానే పరిగణించాలని అక్కడి కాగ్ పేర్కొన్న అంశమూ తాజాగా చర్చనీయాంశమవుతోంది.
ఇలాగైతే సగం రాబడి అప్పుల చెల్లింపులకే
కార్పొరేషన్ల రుణాల అసలు, వడ్డీ చెల్లింపులకు ప్రభుత్వమే తన బడ్జెట్ నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో నిధులిస్తోందని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆ కార్పొరేషన్లు ఏవీ సొంత వ్యాపారాలతో నిధులు సృష్టించుకోవని, అందువల్లే వాటి రుణాల బాధ్యతను ప్రభుత్వమే భరించాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇలా అప్పులు పరిమితికి మించి పెరిగితే రాబడిలో సగానికి పైగా మొత్తం అప్పులు చెల్లించేందుకు వినియోగించే రోజులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక