విపత్తు నిధులూ మళ్లించారు!
విపత్తు బాధితులకు తక్షణ సహాయానికి ఖర్చుచేయాల్సిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధుల్ని.. రాష్ట్ర ప్రభుత్వం పీడీ ఖాతాకు మళ్లించిందని కాగ్ ఆక్షేపించింది. విపత్తు నిర్వహణ నిధి
పెట్టుబడి రాయితీ, వ్యవసాయ పరికరాలకు ఖర్చు
వ్యవసాయ కమిషనర్ పీడీ ఖాతాకు రూ.1,100 కోట్లు
నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వాన్ని ఆక్షేపించిన కాగ్
ఈనాడు, అమరావతి: విపత్తు బాధితులకు తక్షణ సహాయానికి ఖర్చుచేయాల్సిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధుల్ని.. రాష్ట్ర ప్రభుత్వం పీడీ ఖాతాకు మళ్లించిందని కాగ్ ఆక్షేపించింది. విపత్తు నిర్వహణ నిధి అకౌంటింగ్ నియమాలకు ఇది విరుద్ధమని ఆక్షేపించింది. 2020 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర పరిస్థితులపై నివేదికలో విపత్తుల ప్రతిస్పందన నిధికి సంబంధించి కాగ్ పలు అంశాలను ప్రస్తావించింది.
ఏడాది చివరకు ఏమీ మిగల్లేదు
2019-20లో కేంద్రం ఇచ్చిన రూ.324.15 కోట్లతో పాటు రాష్ట్రం తన వాటా కింద రూ.209.85 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తం రూ.534 కోట్లను ప్రకృతి వైపరీత్యాల ఉపశమనం (కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఉచిత ఉపశమనం, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పునరుద్ధరణ, మరమ్మతులు, వ్యవసాయ సాధకాల కొనుగోలుకు రైతులకు సాయం) కోసం ఖర్చుచేసింది. దీంతో ఏడాది చివరికి ఏమీ మిగల్లేదు. నిబంధనల ప్రకారం విపత్తు సంసిద్ధత, పునరుద్ధరణ, పునర్నిర్మాణం, ఉపశమనం కోసం విపత్తు స్పందన నిధి నుంచి ఖర్చు చేయకూడదు. సాధారణ బడ్జెట్ పద్దులు/రాష్ట్ర ప్రణాళిక నుంచి భరించాలి. రిజర్వుబ్యాంకు ఓవర్డ్రాప్టు (ఓడీ) నియమావళి ప్రకారం.. ఓడీకి వర్తించే వడ్డీరేటు ప్రకారం ఆరు నెలలకోసారి విపత్తు ప్రతిస్పందన నిధులకు రాష్ట్రప్రభుత్వం వడ్డీ చెల్లించాలి. ఆ నిధిలోకి వచ్చే జమలు, వాటి పెట్టుబడులపై వచ్చే ఆదాయాన్ని కేంద్రప్రభుత్వ సెక్యూరిటీలు, వేలం వేసిన ఖజానా బిల్లులు, వాణిజ్యబ్యాంకుల్లో వడ్డీ వచ్చే డిపాజిట్లలోంచి ఖర్చుపెట్టాలి.
వ్యవసాయ కమిషనర్ పీడీ ఖాతాకు రూ.1,100 కోట్లు
2019-20 సంవత్సరంలో ఎస్డీఆర్ఎఫ్ రూ.534 కోట్లు, ఎన్డీఆర్ఎఫ్ రూ.570.91 కోట్లు కలిపి మొత్తం రూ.1,104.91 కోట్లు కేంద్రం నుంచి వచ్చాయి. ఇందులో రూ.1,100 కోట్లను ఖరీఫ్ పెట్టుబడి రాయితీల కోసం రైతులకు చెల్లించేందుకు వ్యవసాయ కమిషనర్, సంచాలకుల డిపాజిట్ ఖాతాకు బదిలీ చేసి.. తర్వాత 2020 మార్చి 31న ఆయన పేరుతో ఉన్న పీడీ ఖాతాకు మళ్లించారు. విపత్తు ఉపశమనం, పునరావాసం కింద వ్యయాన్ని చూపించి.. చట్టవిరుద్ధంగా పీడీ ఖాతాకు బదిలీ చేసిందని కాగ్ స్పష్టం చేసింది. దేశంలో తలెత్తిన మహమ్మారి, సంబంధిత ఖర్చులకు ఈ నిధులను పక్కన పెట్టినట్లు రాష్ట్రప్రభుత్వం సమాధానమిచ్చింది. విపత్తు బాధితుల తక్షణ సహాయానికి అయ్యే ఖర్చు భరించడానికే ఈ నిధి నుంచి సర్దుబాటు చేయాలని నియామాలు చెబుతున్నా.. అందుకు విరుద్ధంగా పీడీ ఖాతాకు మళ్లించిందని అభ్యంతరం తెలియజేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?