విపత్తు నిధులూ మళ్లించారు!
విపత్తు బాధితులకు తక్షణ సహాయానికి ఖర్చుచేయాల్సిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధుల్ని.. రాష్ట్ర ప్రభుత్వం పీడీ ఖాతాకు మళ్లించిందని కాగ్ ఆక్షేపించింది. విపత్తు నిర్వహణ నిధి
పెట్టుబడి రాయితీ, వ్యవసాయ పరికరాలకు ఖర్చు
వ్యవసాయ కమిషనర్ పీడీ ఖాతాకు రూ.1,100 కోట్లు
నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వాన్ని ఆక్షేపించిన కాగ్
ఈనాడు, అమరావతి: విపత్తు బాధితులకు తక్షణ సహాయానికి ఖర్చుచేయాల్సిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధుల్ని.. రాష్ట్ర ప్రభుత్వం పీడీ ఖాతాకు మళ్లించిందని కాగ్ ఆక్షేపించింది. విపత్తు నిర్వహణ నిధి అకౌంటింగ్ నియమాలకు ఇది విరుద్ధమని ఆక్షేపించింది. 2020 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర పరిస్థితులపై నివేదికలో విపత్తుల ప్రతిస్పందన నిధికి సంబంధించి కాగ్ పలు అంశాలను ప్రస్తావించింది.
ఏడాది చివరకు ఏమీ మిగల్లేదు
2019-20లో కేంద్రం ఇచ్చిన రూ.324.15 కోట్లతో పాటు రాష్ట్రం తన వాటా కింద రూ.209.85 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తం రూ.534 కోట్లను ప్రకృతి వైపరీత్యాల ఉపశమనం (కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఉచిత ఉపశమనం, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పునరుద్ధరణ, మరమ్మతులు, వ్యవసాయ సాధకాల కొనుగోలుకు రైతులకు సాయం) కోసం ఖర్చుచేసింది. దీంతో ఏడాది చివరికి ఏమీ మిగల్లేదు. నిబంధనల ప్రకారం విపత్తు సంసిద్ధత, పునరుద్ధరణ, పునర్నిర్మాణం, ఉపశమనం కోసం విపత్తు స్పందన నిధి నుంచి ఖర్చు చేయకూడదు. సాధారణ బడ్జెట్ పద్దులు/రాష్ట్ర ప్రణాళిక నుంచి భరించాలి. రిజర్వుబ్యాంకు ఓవర్డ్రాప్టు (ఓడీ) నియమావళి ప్రకారం.. ఓడీకి వర్తించే వడ్డీరేటు ప్రకారం ఆరు నెలలకోసారి విపత్తు ప్రతిస్పందన నిధులకు రాష్ట్రప్రభుత్వం వడ్డీ చెల్లించాలి. ఆ నిధిలోకి వచ్చే జమలు, వాటి పెట్టుబడులపై వచ్చే ఆదాయాన్ని కేంద్రప్రభుత్వ సెక్యూరిటీలు, వేలం వేసిన ఖజానా బిల్లులు, వాణిజ్యబ్యాంకుల్లో వడ్డీ వచ్చే డిపాజిట్లలోంచి ఖర్చుపెట్టాలి.
వ్యవసాయ కమిషనర్ పీడీ ఖాతాకు రూ.1,100 కోట్లు
2019-20 సంవత్సరంలో ఎస్డీఆర్ఎఫ్ రూ.534 కోట్లు, ఎన్డీఆర్ఎఫ్ రూ.570.91 కోట్లు కలిపి మొత్తం రూ.1,104.91 కోట్లు కేంద్రం నుంచి వచ్చాయి. ఇందులో రూ.1,100 కోట్లను ఖరీఫ్ పెట్టుబడి రాయితీల కోసం రైతులకు చెల్లించేందుకు వ్యవసాయ కమిషనర్, సంచాలకుల డిపాజిట్ ఖాతాకు బదిలీ చేసి.. తర్వాత 2020 మార్చి 31న ఆయన పేరుతో ఉన్న పీడీ ఖాతాకు మళ్లించారు. విపత్తు ఉపశమనం, పునరావాసం కింద వ్యయాన్ని చూపించి.. చట్టవిరుద్ధంగా పీడీ ఖాతాకు బదిలీ చేసిందని కాగ్ స్పష్టం చేసింది. దేశంలో తలెత్తిన మహమ్మారి, సంబంధిత ఖర్చులకు ఈ నిధులను పక్కన పెట్టినట్లు రాష్ట్రప్రభుత్వం సమాధానమిచ్చింది. విపత్తు బాధితుల తక్షణ సహాయానికి అయ్యే ఖర్చు భరించడానికే ఈ నిధి నుంచి సర్దుబాటు చేయాలని నియామాలు చెబుతున్నా.. అందుకు విరుద్ధంగా పీడీ ఖాతాకు మళ్లించిందని అభ్యంతరం తెలియజేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
నీరు ఇవ్వలేం... కొనుక్కుని తాగండి!
ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు. -
వైకాపా అరాచకాలపై మేము సైతం పోరాడతాం
‘ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు పోరాడతాం’ అని అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు తెలిపారు. -
వైద్య బోధకుల బదిలీల దుమారం
ముందస్తు సమాచారం లేకుండా బదిలీల ఉత్తర్వులు జారీచేసి, వెంటనే రిలీవ్ కావాలని పేర్కొనడంపై వైద్య బోధకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి పాడేరు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందులలోని కొత్త వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభం కావాలి. -
ఇఫ్కోకు భూకేటాయింపుపై పిల్ కొట్టివేత
యూరియా, అమోనియా ప్లాంట్ నిర్మాణం కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)కు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. 2017లో దాఖలైన పిల్ను కొట్టేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. -
భరోసానూ బరికేశారు!
రైతుబంధు కింద తెలంగాణలో ఎకరానికి ఏడాదికి ఇస్తోంది రూ.10,000. ఐదెకరాలుంటే రూ.50 వేలు. అంటే ఐదేళ్లలో ఒక్కో రైతుకు అందింది కనీసం రూ.2.50 లక్షలు. -
ముందుచూపుతో ప్రజల్ని నడిపించే దార్శనికులు రావాలి
పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం.. -
ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి
‘హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. నిధుల విడుదల వాయిదా
రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరిపించండి’
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్లోడ్ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) కోరింది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ
ట్రిపుల్ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
-
పెద్దల మాట
-
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?