రూ. వెయ్యి కోట్ల సాయం అందించండి
ఏపీలో ఇటీవలి వానలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని భర్తీచేయడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం రూ.వెయ్యి కోట్ల సాయం అందించాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. మంగళవారం రాజ్యసభ జీరో
కేంద్రానికి విజయసాయిరెడ్డి వినతి
ఏపీలో ఇటీవలి వానలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని భర్తీచేయడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం రూ.వెయ్యి కోట్ల సాయం అందించాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్లో ఆయన మాట్లాడారు. ‘నవంబర్ 8న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీలో మెరుపు వరదలకు దారితీసింది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉత్పాతం తలెత్తింది. అనూహ్యంగా వచ్చిన వానలు, వరదల్లో రిజర్వాయర్ల కట్టలు తెగాయి. రహదారులు, వంతెనలు, రైల్వేట్రాక్లు దెబ్బతిన్నాయి. విద్యుత్తు వ్యవస్థ అస్తవ్యస్థమైంది. ఇళ్లు కూలిపోయాయి. ఇప్పటివరకు 44 మంది చనిపోయారు. 16 మంది గల్లంతయ్యారు. 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారు. పంటలు, మౌలిక వసతులకు రూ.6,054 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. తాత్కాలికంగా రూ.వెయ్యి కోట్ల సాయం అందించాల’ని కోరారు.
ముందస్తు హెచ్చరికలు లేకే: సీఎం రమేష్
వరదల వల్ల తలెత్తే ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు హెచ్చరికలు చేయకపోవడం వల్లే ఏపీలో నష్టం తీవ్రమైనట్లు భాజపా ఎంపీ సీఎం రమేష్ పేర్కొన్నారు. రాజ్యసభలో మాట్లాడుతూ ‘భారీ వర్షాలు కురుస్తాయని రెండు మూడు రోజుల ముందు నుంచే వాతావరణ శాఖ హెచ్చరించినా.. ప్రజలను అప్రమత్తం చేయలేదు. ఎగువన రెండు డ్యాంల నుంచి వచ్చిన నీళ్లతో వేల పశువులు కొట్టుకుపోయాయి. ఆరోజు ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్చేసి పరిస్థితులను తెలుసుకున్నారు. అప్పటిదాకా ఏ అధికారీ పల్లె ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీచేయలేదు. దానివల్ల ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లింది’ అని అన్నారు. ఈ వాదనతో ఎంపీ సుజనాచౌదరి ఏకీభవించారు.
మంగళగిరి ఎయిమ్స్లో 40% బోధనా సిబ్బంది ఖాళీ
ఈనాడు, దిల్లీ: మంగళగిరి ఎయిమ్స్లో 40% బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈమేరకు మంగళవారం రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ సమాధానం ఇచ్చారు. దీనికి 183 బోధనా సిబ్బంది పోస్టులు మంజూరు చేయగా ప్రస్తుతం 110 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఈ సంస్థ నిర్మాణానికి రూ.1,618 కోట్లు మంజూరవగా, ఇప్పటివరకు రూ.1,024.5 కోట్లు విడుదలయ్యాయి. 2019 మార్చి నుంచి ఇక్కడ 23 అంశాల్లో ఓపీ సేవలు, వంద ఇన్పేషెంట్ పడకలు, రెండు ఆపరేషన్ థియేటర్లు ప్రారంభమయ్యాయి. ఈ సంస్థలో 2018-19 నుంచే ఎంబీబీఎస్ కోర్సు మొదలైంది. నరసరావుపేటలో రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్, మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ యూనిట్ ఏర్పాటు చేయాలని ఈ సంస్థకు వినతులు అందినట్లు కేంద్ర మంత్రి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..