21న సమ్మె నోటీసు
పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. ఇప్పటికే నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న ఉద్యోగులు చివరి అస్త్రంగా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. నిబంధనల ప్రకారం 14 రోజుల ముందు ఇవ్వాల్సిన సమ్మె నోటీసును... శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మకు ఇవ్వనున్నారు.
ఉద్యోగ సంఘాల నిర్ణయం
పీఆర్సీ జీవోలపై ఆందోళనలు ఉద్ధృతం
ఉద్యమ కార్యాచరణపై నేడు ఐకాసల ఐక్యవేదిక సమావేశం
ఉపాధ్యాయుల కలెక్టరేట్ల ముట్టడి నేడు
ఈనాడు - అమరావతి
పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. ఇప్పటికే నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న ఉద్యోగులు చివరి అస్త్రంగా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. నిబంధనల ప్రకారం 14 రోజుల ముందు ఇవ్వాల్సిన సమ్మె నోటీసును... శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మకు ఇవ్వనున్నారు. ఈమేరకు ఏపీ ఐకాస, ఐకాస అమరావతి ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం నిర్వహించే సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. సమ్మెలో ఆర్టీసీ సంఘాలు పాల్గొనే అవకాశముంది. మరోవైపు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేరకు ఉపాధ్యాయులు గురువారం జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించనున్నారు. దీనికి ఐకాసలు మద్దతు ప్రకటించాయి. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డివిజన్ కేంద్రాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనికి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది.
జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు: బండి
పీఆర్సీ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఈనెల 21న సీఎస్కు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో బుధవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం కార్యవర్గ సభ్యులతో కలిసి పీఆర్సీ ఉత్తర్వుల ప్రతులను మంటల్లో దహనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేసే వరకు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదు. సమ్మె, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై గురువారం ఏపీ ఐకాస, ఐకాస అమరావతి ఐక్యవేదిక సమావేశంలో చర్చిస్తాం. హెచ్ఆర్ఏ, సీసీఏ, అదనపు పింఛన్ అంశాలను సీఎస్తో మాట్లాడుకోవాలని సీఎం సూచించారు. మమ్మల్ని పిలిచి, మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పిన సీఎస్ రాత్రిపూట ఉత్తర్వులు ఇచ్చారు. పీఆర్సీతో వేతనాల్లో రూ.6వేలు నుంచి రూ.7వేలు తగ్గిపోతాయి. ఇది ఐఏఎస్ల పన్నాగంలా అనుమానం వస్తోంది. అయిదు డీఏలను ఇంతకాలం పెండింగ్ పెట్టి, ఇప్పుడు ఒకేసారి ఇస్తున్నారు. గతంలో ఇచ్చిన మూడు డీఏల బకాయిలు ఇంతవరకు ఇవ్వలేదు. ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ తగ్గింపు, సీసీఏ రద్దుతో వేతనంలో 18% తగ్గించి, డీఏల ద్వారా 20% ఇస్తున్నారు.
ఇది దుర్మార్గమైన చర్య. ఉద్యమం ద్వారానే డిమాండ్లను సాధించుకుంటాం. పీఆర్సీ ఉత్తర్వులు ఇవ్వడంలో సీఎంకు భాగస్వామ్యం ఉందని సీఎస్ చెప్పినందుకు ధన్యవాదాలు. ఉద్యోగుల భవిష్యత్తును తాకట్టు పెట్టే పరిస్థితి లేదు. కరోనాతో చనిపోయిన ఫ్రంట్లైన్ వర్కర్ల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. గ్రామ, వార్డు సచివాలయాలు, ఎన్ఎంఆర్లుగా ఉద్యోగాలు ఇస్తామని సీఎంను అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వం ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులను సైతం మోసం చేసింది’’ అని ఆరోపించారు.
రాబడిపై గందరగోళ ప్రచారం: సూర్యనారాయణ
ప్రభుత్వ ఆదాయం తగ్గిందని ఒకవైపు సీఎస్ చెబుతుండగా... మరోవైపు నవంబరు నెలాఖరుకు గత ఐదేళ్లల్లో కంటే ఎక్కువ రాబడి వచ్చినట్లు కాగ్ చెప్పిందని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. ఇది సమాజాన్ని తప్పుదారి పట్టించడమేనన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ... ‘‘ప్రభుత్వ ఆదాయం తగ్గిందని విలేకర్ల సమావేశంలో సీఎస్ చెప్పారు. నవంబరు నెలఖారునాటికి గత ఐదేళ్లలో కంటే ఎక్కువ ఆదాయం వచ్చిందని కాగ్ వెల్లడించింది. ప్రభుత్వం తన విజయంగా ప్రచారం చేసుకుంటోంది. సీఎస్ చెప్పింది నిజమైతే ఏపీ ప్రభుత్వం కాగ్కు నోటీసులు ఇవ్వాలి? లేదంటే సీఎస్పై ఏం చర్యలు తీసుకుంటుందో ప్రభుత్వానికి వదిలిపెడుతున్నాం. సీఎస్, ఆర్థికశాఖ అధికారులు పాత పవర్ ప్రజంటేషన్నే మళ్లీ చూపించారు. దాంట్లో శాస్త్రీయత, వాస్తవికత లోపించింది. కేంద్ర పీఆర్సీపై వితండ వాదం చేస్తున్నారు. పదవీ విరమణ వయసును 62ఏళ్లకు పెంచారు. కేంద్రంలో 60ఏళ్లకే ఉంది. దేన్ని ప్రమాణికంగా తీసుకుని పెంచారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రొఫెసర్లకు మాదిరిగా 65 ఏళ్లకు ఎందుకు పెంచలేదు. వైద్య కళాశాలల్లో పని చేస్తున్న వైద్యులు పదవీ విరమణ వయసును పెంచాలని గత ఐదేళ్లుగా కోరుతున్నా ఎందుకు పెంచడం లేదు. పదవీ విరమణ ప్రయోజనాలను రెండేళ్లకు వాయిదా వేసేందుకే వయోపరిమితి పెంచినట్లుఉంది. సీఎస్ పూర్తిగా విఫలమయ్యారు. ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్యవర్తిగా వ్యవహరించాల్సిన ఆయనే ప్రతిబంధకంగా తయారయ్యారనిపిస్తోంది. పీఆర్సీ ఉత్తర్వులను నిలిపివేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని సహకరిస్తాం. కానీ, ఇది అవమానకరంగా ఉందని అభిప్రాయపడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చే హెచ్ఆర్ఏతో ఎక్కడైనా అద్దెకు ఇల్లు దొరుకుతుందా? ఎక్కడ పొరపాటు జరిగిందో సీఎం గుర్తించాలి’’ అని అన్నారు.
మట్టి ఖర్చులు మిగుల్చుకోవాలని చూస్తోంది: బొప్పరాజు
ఉద్యోగి చనిపోతే ఇచ్చే మట్టి ఖర్చులనూ మిగుల్చుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ‘‘వేతనాల పెంపు కోసమే సమ్మె చేయాలని నిర్ణయించాం. ఇస్తున్న వేతనాలు తగ్గించి, గత ప్రభుత్వం ఇచ్చిన భత్యాల్లో కోత వేయడంతోనే సమ్మెకు వెళ్తున్నాం. సీపీఎస్ రద్దు సహా ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది. వేతనాలపై సీఎస్ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. జీతాలు తగ్గవని ప్రభుత్వం అనుకుంటే పాత జీతాలే ఇవ్వొచ్చు కదా...! రివర్స్ పీఆర్సీ మాకొద్దు. పాత జీతాలే ఇవ్వండి. ఉత్తర్వులను రద్దు చేసుకునే వరకూ ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు. ఉద్యమంలోకి అడుగుపెడితే వెనక్కి తగ్గేది ఉండదు. మా ఉద్యమానికి ప్రజల మద్దతు కోరుతున్నాం. సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొంటారు’’ అని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత